పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

గోవాలోని 48 ఫారెస్ట్ ఫైర్ ప్రదేశాలను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన అగ్నిమాపక వ్యవస్థ పర్యవేక్షణకు 24/7 కంట్రోల్ రూమ్


ప్రతి ప్రదేశంలో అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశం

పుష్ప, జంతు వైవిధ్యానికి ఇంతవరకు పెద్ద నష్టాలు ఏవి జరగలేదు

Posted On: 11 MAR 2023 8:49AM by PIB Hyderabad

గోవాలోని అడవులు, ప్రైవేటు ప్రాంతాలు, కమ్యూనిటీ భూములు, తోటలు, రెవెన్యూ భూములు సహా పలు ప్రాంతాల్లో మార్చి 05, 2023 నుండి. అడపాదడపా అగ్నిప్రమాదాలు సంభవించినట్టు గుర్తించారు. జిల్లా కలెక్టర్ (ఉత్తరం), జిల్లా కలెక్టర్ (దక్షిణ), ఎస్పీ (ఉత్తరం), ఎస్పీ (దక్షిణ), డైరెక్టరేట్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వంటి ఇతర సంబంధిత విభాగాల  సమన్వయంతో గోవా అటవీ శాఖ అగ్నిప్రమాదాల స్థానిక సంఘటనలను అత్యంత ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తోంది. అగ్నిమాపక ప్రదేశాలను అదుపులో ఉంచడానికి , సహజ వనరులతో సహా ప్రాణ ,ఆస్తి నష్టాన్ని నివారించడానికి సిబ్బందిని, సామగ్రిని మోహరించింది. సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేసి, పరిస్థితిని దగ్గర నుంచి సమీక్షిస్తూ, బాధ్యులైన అధికారులందరికీ ఎప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇప్పటివరకు అటవీ మంటల పరిస్థితిని పరిష్కరించడానికి డిపార్ట్ మెంట్ ఈ క్రింది చర్యలు తీసుకుంది:

అగ్నిప్రమాదాల రియల్ టైమ్ మానిటరింగ్ కోసం 24×7 కంట్రోల్ రూమ్: ఎఫ్ ఎస్ ఐ ద్వారా జారీ అయ్యే అలర్ట్ లను రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి 24×7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను తక్షణమే పరిష్కరించడానికి ఖచ్చితమైన జియో-కోఆర్డినేట్ లు , ఫైర్ లొకేషన్ ల మ్యాప్ లను రియల్ టైమ్ ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీసర్ లకు షేర్ చేస్తారు. అటవీ ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజించి డీసీఎఫ్/ఏసీఎఫ్ స్థాయి అధికారులను అగ్నిప్రమాద పరిస్థితిని పర్యవేక్షించడానికి ఇంచార్జీలుగా నియమించారు. ప్రభావిత ప్రాంతాలను సెక్టార్లుగా విభజించి డీసీఎఫ్, ఏసీఎఫ్ స్థాయి అధికారులకు డ్యూటీలు కేటాయించి అగ్నిప్రమాదాలను తక్షణమే పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల సమన్వయంతో అటవీ మంటలను శ్రీఘ్ర గతిన అదుపు చేయాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన మంటలను ఆర్పేందుకు 750 మందికి పైగా రంగంలోకి దిగారు.

అనధికారిక ప్రవేశాలపై నిషేధం, ప్రవేశాన్ని నిరోధించడానికి అటవీ - వన్యప్రాణి చట్టాలను కఠినంగా అమలు చేయడం:

అటవీ ప్రాంతాల్లోకి అనధికారిక ప్రవేశాలను నిరోధించడానికి  అటవీ చట్టాలను వర్టింపచేసి ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని, ఆ బాధ్యతను వారి స్థాయిలో దర్యాప్తు కోసం పోలీసు శాఖకు అప్పగించాలని డిసిఎఫ్ లకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత విభాగాల (లైన్ డిపార్ట్ మెంట్ ) తో సమన్వయం:

యుద్ధప్రాతిపదికన అగ్నిప్రమాదాలను నియంత్రించేలా జిల్లా కలెక్టర్ (ఉత్తరం)/(దక్షిణ), పోలీసు శాఖ, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, పీఆర్ఐతో సహా స్థానిక కమ్యూనిటీ సహకారంతో సంయుక్త బృందాలను క్షేత్రస్థాయిలో మోహరించాయి.

విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశం: డైరెక్టర్ (ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్)తో సహా డీసీ (నార్త్/సౌత్), ఎస్పీ (నార్త్/సౌత్)లతో కూడా తమ పరిధిలో విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయాలని, అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణకు బాధ్యులైన అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియా ప్లాట్ ఫారం ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం: అడవుల్లో అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేయాల్సినవి, చేయకూడని వాటి రూపంలో నివారణ, నియంత్రణ చర్యలపై ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రతి ప్రదేశంలో అగ్నిప్రమాదానికి కారణాలు/ పరిస్థితులు తెలుసుకోవడానికి విచారణకు ఆదేశం: 05.03.2023 నుండి సంభవించిన ప్రతి అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత డిసిఎఫ్ లను ఆదేశించారు.

ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ చర్యలు ముమ్మరం: ఫైర్ లైన్లు, ఫైర్ బ్రేక్స్ ఏర్పాటు చేయడం, పొదలను కొట్టడం, కౌంటర్ ఫైరింగ్, ఆకు చెత్తను తొలగించడం ద్వారా మంటలకు ఇంధనాన్ని కట్ చేయడం ద్వారా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లు, బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా, మంటలను వెంటనే నియంత్రించడానికి మంటలను ఆర్పడానికి అన్ని ప్రదేశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

అటవీ మంటల నిర్వహణకు భారత వైమానిక దళం ,భారత నావికాదళం నుండి వైమానిక మద్దతు: భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు నిరంతరం అటవీ ప్రాంతాల్లో ఏరియల్ రెక్కీ నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంటల తీవ్రతను తెలుసుకుంటున్నాయి. యాక్టివ్ ఫైర్ ఏరియాల పరిధిని అంచనా వేయడానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, చేరుకోలేని ప్రాంతాల విషయంలో, భారత నావికాదళం / ఐఎఎఫ్ కూడా హెలిబకెట్ల ద్వారా మంటలను ఆర్పడానికి వైమానిక సహాయాన్ని అందించాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ప్రకారం 05.3.2023 నుంచి 10.3.2023 వరకు 48 అగ్నిమాపక కేంద్రాలను క్షేత్రస్థాయి అధికారులు గుర్తించి సంబంధిత శాఖలు, పీఆర్ఐలతో సహా స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుని పరిశీలించారు.

10.3.2023 ఉదయం 10 గంటల వరకు 7 అగ్నిప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఇతర శాఖలు, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పీఆర్ ఐలతో సహా 500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. ఇప్పటికే 41  మంటలను ఆర్పివేశారు.

 

వరస నెం.

అగ్నిప్రమాద ప్రదేశం స్థితి

మంటలు ఆర్పివేసిన అగ్నిప్రమాదాల సంఖ్య

క్రియాశీల అగ్నిప్రమాదాల సంఖ్య

1.

ప్రైవేట్ ఏరియా

5

 

2.

ప్రైవేట్ ఫారెస్ట్

2

 

3

కమ్యూనిడేడ్

1

 

4.

ప్రభుత్వ అడవి

31

7

5.

జి ఎఫ్ డి సి

3

 

 

మొత్తం

41

7

 

గత కొన్ని రోజులుగా గమనించిన కొన్ని అంశాలు క్రింద వివరించబడ్డాయి:

i.సుదీర్ఘ పొడి వాతావరణం (2022 అక్టోబర్ మధ్య నుండి దాదాపు వర్షాలు లేవు), తక్కువ తేమతో అసాధారణ అధిక వేసవి ఉష్ణోగ్రతతో మంటలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది, ఇది గత రెండు వారాలుగా, ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత అధిక గాలుల వల్ల మరింత తీవ్రమైంది.

 ii.రాష్ట్రవ్యాప్తంగా ఆకురాల్చే ప్రాంతాల్లో ఈ మంటలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కనిపించే , గమనించిన అగ్ని స్వభావం ఉపరితల మంటలు. ఉపరితల మంటలు వదులుగా , ఎండిన ఆకు చెత్తను, ఎండిన గుల్మకాండ వృక్షాలు, పొదలు, చిన్న చెట్లు నేల ఉపరితలం వద్ద లేదా సమీపంలో ఉన్న మొక్కలను ఎక్కువగా మండడం ద్వారా కాల్చేస్తాయి. ఉపరితల మంటల విస్తరణ , వ్యాప్తి ఒక ప్రాంతం ఉపరితల ఇంధనం లోడ్ ద్వారా నిర్దేశించబడుతుంది; కొన్ని చోట్ల చనిపోయిన చెట్లు/పడిపోయిన దుంగలు మంటల తీవ్రతను పెంచాయి. కాలిపోతున్న శిథిలాల నుంచి పొగ, జ్వాలలు నిరంతరం కనిపిస్తూ పెద్ద ప్రాంతాన్ని కప్పేస్తున్నాయి.

iii.పశువులను మేపడంపై ఆధారపడిన స్థానిక ప్రజలు తమ పశువుల మందల కోసం తమకు అందుబాటులో ఉన్న మేత భూములు , గడ్డి మైదానాలలో కోత , కాల్చే పద్ధతిని ఆచరిస్తారు. ప్రధానంగా కొత్త గడ్డిని ప్రోత్సహించడం కోసం పెద్ద ఎత్తున గడ్డి పీఠభూములను తగలబెట్టినట్లు గుర్తించారు.

iv.అదేవిధంగా, జీడిమామిడి తోటల సాంస్కృతిక ,సంరక్షణ కార్యకలాపాలలో వ్యయాన్ని తగ్గించే చర్యగా, జీడిమామిడి తోటల యజమానులు, కార్మికులు కూడా ఎక్కువగా శిథిలాలను తగ్గించడానికి జీడిమామిడి చెట్ల క్రింద పెరుగుదలను అణచివేయడానికి. కోత ,కాల్చే పద్ధతిని అనుసరిస్తారు,

v.అగ్నిప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పుల వల్లే సంభవించినట్టు కనబడుతోంది. దీనికి కారణం యాదృచ్చికం లేదా మరేదైనా కావచ్చు.  దీనిపై విచారణ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలు, అధిక గాలులు వల్ల వ్యాప్తి మరింత పెరిగింది.

vi. ఇప్పటివరకు పుష్ప, జంతుజాల వైవిధ్యానికి పెద్ద నష్టాలేమీ జరగలేదు.

****

 



(Release ID: 1905924) Visitor Counter : 170