సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ బ్యాంక్ పోర్టల్స్- అనుభవ్, సీపీజీహెచ్ఎస్, సీజీహెచ్ఎస్ వంటి అన్ని పోర్టల్స్ ను వృద్ధుల జీవన సౌలభ్యం కోసం కొత్తగా రూపొందించిన “ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్” రూపంలో ఒకే పోర్టల్లో విలీనం చేస్తాం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


‘‘జీవన సౌలభ్యాన్ని తీసుకురావడానికి సమీకృత విధానం" కోసం ప్రధానమంత్రి విజన్కు అనుగుణంగా, ఈ చర్య పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గిస్తుంది: భోపాల్లో జరిగిన బ్యాంకర్స్ అవేర్నెస్ వర్క్షాప్లో డాక్టర్ జితేంద్ర సింగ్

పెన్షన్ పంపిణీ చేసే మొత్తం 18 బ్యాంకులు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్లో విలీనం చేయబడతాయి

పెన్షన్ డిపార్ట్మెంట్ నవంబర్, 22న ఫేస్ అథెంటికేషన్ క్యాంపెయిన్ ద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను చేపట్టింది, దీని ఫలితంగా 30 లక్షల మంది పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని డిజిటల్గా సమర్పించారు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 06 MAR 2023 4:28PM by PIB Hyderabad

పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ బ్యాంక్ పోర్టల్స్- అనుభవ్, సీపీజీహెచ్ఎస్, సీజీహెచ్ఎస్ వంటి అన్ని పోర్టల్స్ ను వృద్ధుల జీవన సౌలభ్యం కోసం కొత్తగా రూపొందించిన “ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్” (https://ipension.nic.in) రూపంలో ఒకే పోర్టల్‌లో విలీనం చేయాలని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించిందని కేంద్ర సైన్స్ , టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి  (స్వతంత్ర బాధ్యత), ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి  (స్వతంత్ర బాధ్యత), పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్‌లు, అణుశక్తి ,అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

చెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బ్యాంకర్స్ అవేర్‌నెస్ వర్క్‌షాప్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "జీవన సౌలభ్యాన్ని తీసుకురావడానికి సమీకృత విధానం" కోసం ప్రధానమంత్రి విజన్‌కు అనుగుణంగా, బ్యాంకు మార్పు, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పెన్షనర్ల మరణ ధృవీకరణ పత్రం సమర్పణ, పెన్షన్ స్లిప్, పెన్షన్ స్లిప్ తిరిగి పొందడం, ఆదాయపు పన్ను మినహాయింపు డేటా / ఫారం 16, పెన్షన్ రసీదు సమాచారం, పెన్షన్ పంపిణీ  చేసే బ్యాంకుల వెబ్ సైట్లు కూడా ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ తో అనుసంధానం కావడం ద్వారా బ్యాంకులతో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చర్య పరిష్కరిస్తుందని

చెప్పారు.

ఎస్ బి ఐ,  కెనరా బ్యాంకు పెన్షన్ సేవా పోర్టల్ ను భవిష్య పోర్టల్ తో అనుసంధానం చేసే పని పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. దీనితో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్ స్లిప్, లైఫ్ సర్టిఫికేట్, ఫారం-16 సమర్పించే స్టేటస్ పొందవచ్చు. మొత్తం 18 పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌లో విలీనం చేయబడతాయని కూడా ఆయన తెలియజేశారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, డిఓపిపిడబ్ల్యు కేవలం సర్వీస్ / రిటైర్ అయ్యే ఉద్యోగులను మాత్రమే కాకుండా మన పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసం కూడా పనిచేస్తుందని, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఈ దిశలో మరొక అడుగు అని అన్నారు. పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించేటప్పుడు పారదర్శకత ,  “ఈజ్ ఆఫ్ లివింగ్” కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్ సమర్పణ కోసం ఆధార్ ఆధారిత పథకం “జీవన్ ప్రమాణ్” ను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 2014లో ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.

తొలుత బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించి డీఎల్ సీల సమర్పణను ప్రారంభించామని, ఆ తర్వాత యూఐడీఏఐ ఆధార్ సాఫ్ట్ వేర్ ఆధారంగా మైలురాయి ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఎంఈఐటీవైతో డిపార్ట్ మెంట్ నిమగ్నమైందని, దీని ద్వారా ఏదైనా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ నుంచి డీఎల్ సీ ఇవ్వడం సాధ్యమైందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ పురోగతి సాంకేతికత బాహ్య బయో మెట్రిక్ పరికరాలపై పెన్షనర్లు ఆధారపడటాన్ని తగ్గించిందని, స్మార్ట్ ఫోన్ లలో అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా ఈ ప్రక్రియను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు.

పెన్షన్ డిపార్ట్ మెంట్ నవంబర్, 22న ఫేస్ అథెంటికేషన్ ద్వారా దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని చేపట్టిందని, దీని ఫలితంగా 30 లక్షల మంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ను డిజిటల్ రూపంలో సమర్పించారని మంత్రి తెలిపారు.

పెన్షన్ ,పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ తన ప్రసంగంలో, డిఓపిపిడబ్ల్యు తాజా పెన్షన్ నియమాలు / విధానాల సంస్కరణలు ,పెన్షన్లను నిర్వహించే బ్యాంకు క్షేత్రస్థాయి కార్యకర్తలకు సంక్షేమ కార్యక్రమాల గురించి సమాచారాన్ని అందించే ఉద్దేశ్యంతో బ్యాంకర్ల కోసం వరుస అవగాహన కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. పారదర్శకత, డిజిటలైజేషన్, సర్వీస్ డెలివరీ అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భవిష్య ప్లాట్ఫామ్ పెన్షన్ ప్రాసెసింగ్, పేమెంట్ ను ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ చేసింది. రిటైరైన వారు ఆన్ లైన్ లో తన పత్రాలను దాఖలు చేయడం నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో పీపీవో జారీ చేసే వరకు, డిజిలాకర్ లోకి వెళ్లడం వరకు ఈ ప్లాట్ ఫామ్ ప్రభుత్వ పూర్తి పారదర్శకత, సమర్థతను చాటింది.

01.01.2017 నుండి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ పెన్షన్ ప్రాసెసింగ్ వ్యవస్థ అయిన 'భవిష్య' ప్లాట్ ఫాం ను తప్పనిసరి చేశారు.

ప్రస్తుతం 818 అనుబంధ కార్యాలయాలు, 7,941 డీడీవోలతో సహా 97 మంత్రిత్వ శాఖలు/ శాఖల ప్రధాన సచివాలయంలో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇప్పటి వరకు 1,89,494 కేసులను ప్రాసెస్ చేయగా 1,23,249 మందికి పైగా ఈ-పీపీవోలు జారీ చేశారు.

డిజిలాకర్ లో పిపిఒ,  కొత్త పెన్షనర్లకు పిపిఓను పంపడంలో జాప్యాన్ని తొలగిస్తుంది, అలాగే భౌతిక కాపీని అందజేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. దేశంలోని సుదూర ప్రాంతాల్లో సేవలందిస్తున్న సీఏపీఎఫ్ ల నుంచి రిటైరైన వారు అధిక సంఖ్యలో ఉన్నందున, ఇటువంటి సాఫ్ట్ వేర్ ప్రాసెసింగ్ సౌలభ్యంతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ లో వేగం ,ఖచ్చితత్వం రెండింటి పరంగా ఒక వరం.

అన్ని కేంద్ర ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ పోర్టల్స్ లో ఎన్ఈఎస్ డి ఎ అసెస్మెంట్ 2021 ప్రకారం పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ‘భవిష్య‘ (పెన్షన్ మంజూరు ,చెల్లింపు కోసం డిఓపిపిడబ్ల్యు అభివృద్ధి చేసిన ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్) కోసం 3 వ ర్యాంకును గెలుచుకుంది. యాక్సెసబిలిటీ, కంటెంట్ లభ్యత, వినియోగ సౌలభ్యం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఎండ్ సర్వీస్ డెలివరీ, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ, స్టేటస్ అండ్ రిక్వెస్ట్ ట్రాకింగ్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు. ఈ పారామీటర్ల ఆధారంగా ‘భవిష్య‘ 3వ ర్యాంకు సాధించడం చాలా అభినందనీయం.

పెన్షనర్ల ప్రయోజనం కోసం వ్యూహరచన చేయడానికి , కొత్త కార్యక్రమాలను రూపొందించడానికి ఈ అవగాహన కార్యక్రమాలు ఒక వేదికను అందిస్తాయి. బ్యాంకుల పెన్షన్ చెల్లింపు పోర్టల్స్ తో భవిష్య పోర్టల్ ను అనుసంధానం చేసే మార్గాన్ని ప్రవేశపెట్టడానికి ఇది దోహదపడింది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , కెనరా బ్యాంక్ తమ

పోర్టల్స్  ను భవిష్య - ఐపిపితో అనుసంధానించాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో కొనసాగుతోంది.

ఈ వర్క్ షాప్ లు ఒక అద్భుతమైన ద్విముఖ అభ్యసన ప్రక్రియ. పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసం డిఒపిపిడబ్ల్యు తీసుకున్న/జారీ చేసిన అన్ని చర్యలు/ఓఎమ్ ల గురించి పెన్షన్ డీలింగ్ బ్యాంక్ అధికారులకు తెలియజేయబడినందున పెన్షనర్ల బ్యాంక్ సంబంధిత ఫిర్యాదులను తగ్గించడంలో ఇది చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు బ్యాంకులు ఇంతవరకు విస్మరించిన పెన్షనర్ల ఆకాంక్షలపై ఈ శాఖ తీవ్రం గా దృష్టి పెట్టిందనే బలమైన సందేశాన్ని కూడా అందిస్తాయి.

 

<><><><><>



(Release ID: 1904723) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Hindi , Marathi