ప్రధాన మంత్రి కార్యాలయం

అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం:ప్రధాని

Posted On: 25 FEB 2023 9:44AM by PIB Hyderabad

   న్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కరదీపికను చదివిన తర్వాత జార్ఖండ్‌లోని కోదర్మాలోగల ఓ పాఠశాల విద్యార్థులు పరీక్షల సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తులయ్యారంటూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి ట్వీట్‌ చేశారు.

శ్రీ మోదీ ఈ ట్విట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

 “అద్భుతం! విద్యార్థులు పరీక్షల విషయంలో ఎంతమాత్రం ఒత్తిడికి గురికాకూడదు. ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ కరదీపిక లక్ష్యం ఇదే”నని పేర్కొన్నారు.


*****

DS/ST



(Release ID: 1902418) Visitor Counter : 141