రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పిథోరఘర్ (ఉత్తరాఖండ్)లో భారత్ -ఉజ్బెకిస్థాన్ సంయుక్త సైనిక ‘విన్యాసం 'డస్ట్లిక్' ప్రారంభం

Posted On: 20 FEB 2023 4:22PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌ఘర్ ప్రాంతంలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్ నందు భారత సైన్యం, ఉజ్బెకిస్థాన్ ఆర్మీ సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి. ‘డస్ట్లిక్’ పేరుతో జరుగుతున్న 4వ ఎడిషన్ విన్యాసాలు ఇవి.  సోమవారం ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఉజ్బెకిస్థాన్ మరియు భారత సైన్యం నుండి 45 మంది సైనికులు ఈ వ్యాయామంలో పాల్గొంటున్నారు, రెండు సైన్యాల మధ్య సానుకూల సంబంధాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్‌లో గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కు చెందిన ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన దళాలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల మొదటి ఎడిషన్ నవంబర్ 2019లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగింది. 14 రోజుల పాటు జరిగే ఈ ఉమ్మడి విన్యాసం యుఎన్ ఆదేశం ప్రకారం పర్వత మరియు పాక్షిక పట్టణీకరణ దృష్టాంతంలో ఉమ్మడి దేశాలలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి పెడుతూ సాగింది. ఫీల్డ్ ట్రైనింగ్ వ్యాయామాలు, పోరాట చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు,  ధ్రువీకరణ వ్యాయామంతో ఈ విన్యాసాలు ముగుస్తాయి. ఉమ్మడి కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త తరం పరికరాలు, సాంకేతికతను ఉపయోగించుకోవడం నేర్చుకుంటూ, సంభావ్య బెదిరింపులను తటస్తం చేయడానికి వీలుగా ఇరుపక్షాలు సంయుక్తంగా శిక్షణ, ప్రణాళిక,  వ్యూహాత్మక కసరత్తుల శ్రేణిని అమలు చేస్తాయి. సైనిక శక్తుల మధ్య పరస్పర చర్యను పెంచడంపై తగిన ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం సాగింది.  వ్యాయామం సమయంలో ఏర్పడిన బోన్‌హోమీ, ఎస్పిరిట్-డి-కార్ప్స్,  గుడ్‌విల్‌లు పరస్పరం సంస్థ మరియు వివిధ కార్యకలాపాలను నిర్వహించే పద్ధతిని అర్థం చేసుకోవడం ద్వారా రెండు సైన్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయడం దిశగా ఈ విన్యాసాలు చాలా దూరంగా సాగనున్నాయి.

***



(Release ID: 1901048) Visitor Counter : 189