ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.67 లక్షల కోట్లు - 10.02.2023 నాటికి గత సంవత్సరం సంబంధిత కాలంలో స్థూల వసూళ్ల కంటే 24.09 శాతం ఎక్కువ


ప్రత్యక్ష పన్ను వసూళ్లు, నికర రీఫండ్‌లు రూ.12.98 లక్షల కోట్లు - గత సంవత్సరం ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 18.40 శాతం ఎక్కువ

Posted On: 11 FEB 2023 12:34PM by PIB Hyderabad
ఫిబ్రవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూల వసూళ్లు రూ. 15.67 లక్షల కోట్లు, ఇది గత సంవత్సరం ఇదే కాలానికి స్థూల వసూళ్ల కంటే 24.09 శాతం  ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, నికర రీఫండ్‌లు రూ. 12.98 లక్షల కోట్లు, ఇది గత సంవత్సరం ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 18.40 శాతం ఎక్కువ. ఈ సేకరణ 2022-23  సంబంధించిన ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాలలో 91.39 శాతం. 2022-23 ప్రత్యక్ష పన్నుల సవరించిన అంచనాలలో 78.65 శాతం.

స్థూల ఆదాయ వసూళ్ల పరంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సిఐటి), వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) వృద్ధి రేటు విషయానికి వస్తే, సిఐటి వృద్ధి రేటు 19.33 శాతం  కాగా, పిఐటి (ఎస్ టి టి తో సహా) వృద్ధి రేటు 29.63 శాతం. వాపసుల సర్దుబాటు తర్వాత, సిఐటి సేకరణలలో నికర వృద్ధి 15.84 శాతం, పిఐటి సేకరణలలో 21.93 శాతం (పిఐటి మాత్రమే)/ 21.23 శాతం (ఎస్ టి టి తో సహా పిఐటి).

మొత్తం రూ. 2.69 లక్షల కోట్ల రిఫండ్ ఏప్రిల్ 1, 2022 నుండి 10 ఫిబ్రవరి 2023 వరకు జారీ అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన  రిఫండ్‌ల కంటే 61.58 శాతం ఎక్కువ.

 

****



(Release ID: 1898450) Visitor Counter : 128