హోం మంత్రిత్వ శాఖ

ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్ధీకరణపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష


-అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణ

Posted On: 09 JAN 2023 5:03PM by PIB Hyderabad

ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్ధీకరణను సమీక్షించేందుకు.. ప్రధాన  భాగస్వామ్య పక్షాలవారితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారుపౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శిఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్బీసీఏఎస్ డీజీబ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ఢిల్లీ పోలీస్డైయల్ జీఎంఆర్ మరియు వివిధ భద్రతా ఏజెన్సీలు  సమావేశానికి హాజరయ్యారు. 15 డిసెంబర్ 2022 జరిగిన గత చివరి సమీక్షా సమావేశం నుండి వివిధ విషయాలలో సామర్థ్యాలను స్థిరంగా పెంచడం జరిగిందని అధికారులు ఈ సమావేశానికి తెలియజేయబడిందిఇటీవలి కాలంలో తీసుకున్న అనేక ముఖ్యమైన చర్యలు:

 

      i.        ఎయిర్ స్లాట్ నిశిత పర్యవేక్షణ మరియు సవరించిన షెడ్యూల్ వల్ల విమానాల బంచింగ్ సంఘటనలు తగ్గాయి.

     ii.        త్వరిత ఇమ్మిగ్రేషన్ను సులభతరం చేయడానికితగినంత సిబ్బందిని పోస్టింగ్ చేయడంతో పాటు అదనపు కౌంటర్లు కూడా పని చేస్తున్నాయిడొమెస్టిక్ బేలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా బ్యాగేజీ స్కానర్లను పెంచారు.

    iii.        ట్రాఫిక్ లేన్ నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులు సిబ్బంది మోహరింపును పెంచింది.

 

వాటాదారుల కమిటీ మూల్యాంకనం ఆధారంగాడైయల్ జీఎంఆర్ ఇమ్మిగ్రేషన్ బే కోసం ఆధునిక లేఅవుట్ ప్లాన్ను సవరించింది. ఈ విషయాన్ని సమావేశంలో తెలియజేయబడిందిఇమ్మిగ్రేషన్ బే చిందరవందరగా ఉండకుండా వాక్వేస్లో డాక్యుమెంటేషన్ మరియు బయోమెట్రిక్స్ బూత్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉందికేంద్ర హోంశాఖ కార్యదర్శి సమన్వయంతో వ్యవహరిస్తామని భాగస్వామ్య పక్షాలు హామీ ఇచ్చాయి. ఢిల్లీ విమానాశ్రయాలలో విమానాల బయలుదేరుట, రాకపోకలను క్రమబద్ధీకరించడంలో వేగాన్ని కొనసాగించాలని వాటాదారులను అభ్యర్థించారు.

*****



(Release ID: 1889895) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Punjabi