రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఏరో ఇండియా 2023 కోసం రక్షణ మంత్రి అధ్యక్షతన రాయబారుల రౌండ్ టేబుల్ సమావేశం: న్యూఢిల్లీలో జరిగిన రీచ్ అవుట్ కార్యక్రమానికి 80కి పైగా దేశాలప్రతినిధులు హాజరు


ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు బెంగళూరులో జరిగే ఆసియాలోనే అతిపెద్ద ఏరో షోకుహాజరు కావాలని ప్రపంచ దేశాలకు శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఆహ్వా:నం ఇప్పటి వరకు 645 మందికిపైగా ఎగ్జిబిటర్ల నమోదు

‘‘భారత్ కు బలమైన రక్షణ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థ ఉంది. మన ఏరోస్పేస్, డిఫెన్స్మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా ఉంది‘‘

మన 'మేక్ ఇన్ ఇండియా' ప్రయత్నాలు కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినవి కావు, ఇది పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తిలో ఉమ్మడి భాగస్వామ్యానికి సిద్ధం: రక్షణ మంత్రి

"కొనుగోలుదారు- అమ్మకందారుల సంబంధాన్ని సహ-అభివృద్ధి మరియు సహ-ఉత్పత్తినమూనాకు చేర్చడమే మన ప్రయత్నం"

Posted On: 09 JAN 2023 3:08PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ 2023 జనవరి 9 న న్యూఢిల్లీలో ఏరో ఇండియా 2023 కు సంబంధించి జరిగిన రాయబారుల రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ నిర్వహించిన ఈ రీచ్ అవుట్ కార్యక్రమంలో 80 కి పైగా దేశాల రాయబారులు, హై కమిషనర్లు, చార్జీ డి అఫైర్స్ , డిఫెన్స్ అటాచీలు పాల్గొన్నారు.

 

2023 ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కర్ణాటకలోని బెంగళూరులో జరగనున్న ఆసియాలోనే అతిపెద్ద, 14వ ఏరో షో - ఏరో ఇండియా-2023కు హాజరు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను రక్షణ మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. తమ తమ ఈ డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలను గ్లోబల్ ఈవెంట్ కు హాజరయ్యేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.

 

ఏరోస్పేస్ పరిశ్రమతో సహా భారతీయ విమానయాన-రక్షణ పరిశ్రమకు తన ఉత్పత్తులు, సాంకేతికతలు ,పరిష్కారాలను జాతీయ స్థాయి విధాన నిర్ణేతలకు ప్రదర్శించడానికి అవకాశాన్ని అందించే ప్రధాన గ్లోబల్ ఏవియేషన్ ట్రేడ్ ఫెయిర్ గా ఏరో ఇండియాను రక్షణ మంత్రి అభివర్ణించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళం విమాన ప్రదర్శనలతో పాటు ప్రధాన ఏరోస్పేస్ , డిఫెన్స్ ట్రేడ్ ఎక్స్పోజిషన్ సమ్మేళనం ఆవిష్కృతం అవుతుంది.

రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమల్లోని ప్రధాన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రక్షణ మేధో సంస్థలు, రక్షణ సంబంధిత సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

విమానయాన రంగంలో సమాచారం, ఆలోచనలు, కొత్త సాంకేతిక పరిణామాల మార్పిడికి ఏరో ఇండియా ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది‘‘ అని ఆయన అన్నారు.

 

ఏరో ఇండియా - 2021 విజయాన్ని శ్రీ రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేస్తూ, గత ఎడిషన్ లో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు నేరుగా, మరో 108 మంది వర్చువల్ గా హాజరయ్యారని, ఈ కార్యక్రమంలో 63 దేశాలు పాల్గొన్నాయని, సుమారు 3,000 బిజినెస్ -2-బిజినెస్ సమావేశాలు జరిగాయని ఆయన తెలిపారు. 1,340 మందికి పైగా ఎగ్జిబిటర్లు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ లు, ఎంఎస్ ఎంఈలు, సాయుధ దళాలు, అనేక దేశాల ప్రతినిధులు పాల్గొన్న డిఫెన్స్ ఎక్స్ పో 2022 భారీ విజయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 451 అవగాహన ఒప్పందాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందాలు, ఉత్పత్తుల ఆవిష్కరణలు, దేశీయ వ్యాపారాలకు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు డిఫెన్స్ ఎక్స్ పో విజయానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఏరో ఇండియా-2023 లో ఎగ్జిబిటర్లు , మిత్ర దేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు ఏర్పడిన భాగస్వామ్యాలకు మద్దతు ఇవ్వడానికి , భవిష్యత్తు వృద్ధి కోసం కొత్త సంబంధాలను ఏర్పరచడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు.

 

భారతదేశ పెరుగుతున్న రక్షణ, పారిశ్రామిక సామర్థ్యాల గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ వివరిస్తూ, ముఖ్యంగా డ్రోన్లు, సైబర్-టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్లు మొదలైన అభివృద్ధి చెందుతున్న రంగాలలో తయారీ సామర్థ్యాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒక ధృఢమైన డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ సృష్టించబడిందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం ప్రముఖ రక్షణ ఎగుమతిదారుగా ఆవిర్భవించడానికి దారితీసిందని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో రక్షణ ఎగుమతులు ఎనిమిది రెట్లు

పెరిగాయని, ఇప్పుడు భారతదేశం 75 కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని చెప్పారు.

 

"మన పెద్ద జనాభా , అపారమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ సృష్టికి దారితీసింది, ఇది అధిక సాంకేతిక రంగాలలో స్టార్ట్-అప్ ల నేతృత్వంలో ఉంది.తక్కువ ఖర్చుతో అత్యాధునిక రక్షణ వేదికలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి ఇవి ఆర్ అండ్ డి సంస్థలు, పరిశ్రమలతో కలిసి పనిచేస్తున్నాయి" అని రక్షణ మంత్రి చెప్పారు. భారతీయ ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగం భవిష్యత్ సవాళ్లను స్వీకరించడానికి ,అభివృద్ధి చెందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉందని చెప్పారు. తేలికపాటి యుద్ధ విమానాలను భారతదేశం దేశీయంగా ఉత్పత్తి చేసిందని, తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్ల తయారీ కూడా ప్రారంభమైందని ఆయన తెలిపారు.

 

‘మేక్ ఇన్ ఇండియా' కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినవి కాదని స్పష్టం చేస్తూ, ‘‘మన స్వావలంబన చొరవ భాగస్వామ్య దేశాలతో రక్షణ సంబంధాల కొత్త నమూనాకు నాంది. ప్రపంచ రక్షణ పరిశ్రమ దిగ్గజాలతో భాగస్వామ్యాలు జరుగుతున్నాయి‘‘ అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత వైమానిక దళానికి సి-295 యుద్ధ విమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ , స్పెయిన్ లోని ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఎస్ ఏ భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

‘మేక్ ఇన్ ఇండియా' అంటే 'మేక్ ఫర్ ది వరల్డ్'. రక్షణ పరిశోధన ,అభివృద్ధి, ఉత్పత్తిలో ఉమ్మడి ప్రయత్నాలు భాగస్వామ్యాల కోసం అందరికీ బహిరంగ ఆఫర్ గా మారుతుంది" అని ఆయన అన్నారు.

 

ఇతర దేశాలతో భారతదేశ రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాన్ని వేరుచేసే రెండు కీలక పదాలు 'భాగస్వామ్యం', 'ఉమ్మడి ప్రయత్నాలు' అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కొన్ని దేశాలను ఇతరులకన్నా ఉన్నతమైనవిగా పరిగణించే ప్రపంచ వ్యవస్థ క్రమానుగత భావనను భారతదేశం విశ్వసించదని ఆయన స్పష్టం చేశారు. 'భారత దేశ అంతర్జాతీయ సంబంధాలు మానవ సమానత్వం, గౌరవం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి, ఇది మన పురాతన నైతికతలో భాగం. క్లయింట్ లేదా శాటిలైట్ స్టేట్‌గా తయారు చేయడం లేదా మారడంపై మాకు నమ్మకం లేదు, కాబట్టి, మేము ఏదైనా దేశంతో భాగస్వామిగా ఉన్నప్పుడు, అది సార్వభౌమ సమానత్వం , పరస్పర గౌరవం ఆధారంగా ఉంటుంది. సురక్షితమైన సుసంపన్నమైన ప్రపంచం సాధించాలనే మా చిరకాల లక్ష్యం దిశగా కృషి చేస్తున్నందున సంబంధాలను ఏర్పరచుకోవడం భారతదేశ సహజ గుణం" అని ఆయన అన్నారు.

 

భారతదేశం కొనుగోలుదారు లేదా అమ్మకందారు అనే దానితో సంబంధం లేకుండా సహ-అభివృద్ధి ,సహ-ఉత్పత్తి నమూనాతో కొనుగోలుదారు -అమ్మకందారు మధ్య సంబంధాన్ని అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు."మేము ప్రధాన రక్షణ కొనుగోలుదారు , గణనీయమైన రక్షణ ఎగుమతిదారు. మన విలువైన భాగస్వామ్య దేశాల నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తున్నప్పుడు, వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటారు, భారతదేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. వివిధ ఉప వ్యవస్థల కోసం మన స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తారు. మేము మా రక్షణ పరికరాలను ఎగుమతి చేసేటప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, సహ ఉత్పత్తి మొదలైన వాటిని పంచుకోవడం ద్వారా కొనుగోలుదారుడి సామర్థ్య అభివృద్ధికి మేము మా పూర్తి మద్దతును అందిస్తాము" అని ఆయన అన్నారు.

 

జాతీయ ప్రాధాన్యతలు ,సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ ఎంపికలతో వచ్చే భాగస్వామ్యాన్ని భారతదేశం అందిస్తుందని రక్షణ మంత్రి తెలిపారు. "మేము మీతో నిర్మించాలనుకుంటున్నాము, మేము మీతో ప్రారంభించాలనుకుంటున్నాము ఇంకా మేము మీతో సృష్టించాలనుకుంటున్నాము. ఒక పాత ఆఫ్రికన్ సామెత ఉంది 'మీరు వేగంగా వెళ్ళాలనుకుంటే, ఒంటరిగా వెళ్ళండి. మీరు చాలా దూరం వెళ్ళాలనుకుంటే, కలిసి వెళ్ళండి'. మేము చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నాము ,మేము కలిసి చేయాలనుకుంటున్నాము. మేము సహజీవన సంబంధాలను సృష్టించాలనుకుంటున్నాము, ఇక్కడ ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు, కలిసి ఎదగవచ్చు .అందరికీ గెలుపు-గెలుపు పరిస్థితిని సృష్టించవచ్చు. అంతర్జాతీయ సంబంధాలు సరిగ్గా అదే విధంగా వ్యవహరించాలి. సహకారం అనేది ఉమ్మడి మానవ వారసత్వ నిర్వచించే లక్షణం, దీనిని మనమందరం పంచుకుంటాము. మహా ఉపనిషత్తులో పేర్కొన్న వసుధైక కుటుంబం భావన హితోపదేశ, ఇతర భారత దేశ సాహిత్య రచనలలో కూడా ప్రస్తావించబడింది, 'మొత్తం ప్రపంచం ఒకే కుటుంబం' అనే ఆలోచనను అది నిస్సందేహంగా ప్రతిపాదిస్తుంది‘‘ అని ఆయన పేర్కొన్నారు.

 

భారతదేశ జి 20 అధ్యక్ష పదవిపై తన అభిప్రాయాలను పంచుకున్న శ్రీ రాజ్ నాథ్ సింగ్ , రాబోయే శిఖరాగ్ర సమావేశం ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభం, ఆహార ,ఇంధన భద్రత ఆందోళనలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పై మందకొడి పురోగతి, పెరుగుతున్న ప్రభుత్వ రుణ భారం ,అత్యవసర వాతావరణ మార్పు సంబంధిత సమస్యల నేపథ్యంలో జరుగు తుందని పేర్కొన్నారు. జి 20 లో ఏకాభిప్రాయాన్ని సాధించడానికి, మరింత సురక్షితమైన, సంపన్నమైన, సుస్థిరమైన, న్యాయమైన ప్రపంచం కోసం ఎజెండాను రూపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన వివరించారు. అధ్యక్ష స్థానం లో ఉన్న భారత్ ప్రపంచానికి అభివృద్ధి, ప్రజాస్వామ్యం, వైవిధ్యం అనే తన మూడు ముఖ్య సూత్రాలను (త్రీడీలను) చెబుతుందని తెలిపారు.

 

రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే మాట్లాడుతూ, ప్రపంచం వినూత్న పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు హబ్ గా భారతదేశం వేగంగా ఎదుగుతోందని, అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాణించాలనే ఆకాంక్ష నెరవేర్చు కోవడం లో ఎగ్జిబిటర్లు, భాగస్వాములు తమ ఆలోచనలను పరస్పరం పంచుకోవడానికి, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఏరో ఇండియా- 2023 అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు.

 

రాయబారుల సమావేశంలో, ఏరో ఇండియా 2023 వివరణాత్మక అవలోకనాన్ని ప్రతినిధులకు ఇచ్చారు. 'రన్ వే టు ఎ బిలియన్ ఆపర్ట్యునిటీస్‘ అనే ఇతివృత్తం తో ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని యెలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో మొత్తం 1.08 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 645 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ ఈవెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు, 80 దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. రక్షణ మంత్రుల కాన్క్లేవ్ 'స్పీడ్'తో పాటు సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది.

 

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1889801) Visitor Counter : 296