సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సామాన్య ప్రజలపై భారీ సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉన్న అన్ని కేంద్ర పథకాలలో నూరు శాతం సంతృప్తత సాధించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందన్న - జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్.సి.జి.జి) డైరెక్టర్ జనరల్, శ్రీ భరత్ లాల్


హైదరాబాద్‌ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) లో ‘పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ & ఇన్నోవేషన్’ అనే అంశంపై నిన్న సాయంత్రం కీలకోపన్యాసం చేసిన - శ్రీ లాల్


గ్రామ, పంచాయతీ స్థాయిలో తాగునీరు, విద్యుత్తు, వంటగ్యాస్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి వివిధ సేవలను సార్వజనీకరణ చేయడం మంచి, సురక్షితమైన పాలనకు ఉదాహరణ తప్ప మరొకటి కాదు : శ్రీ లాల్

Posted On: 08 JAN 2023 2:22PM by PIB Hyderabad

సామాన్య ప్రజలపై భారీ సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉన్న అన్ని కేంద్ర పథకాలలో నూరు శాతం సంతృప్తత సాధించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని, జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్.సి.జి.జి) డైరెక్టర్ జనరల్, శ్రీ భరత్ లాల్ పేర్కొన్నారు.

హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి)లో 'పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ & ఇన్నోవేషన్' అనే అంశంపై శ్రీ లాల్ కీలకోపన్యాసం చేస్తూ, గత ఎనిమిదిన్నరేళ్లలో తాగునీరు, విద్యుత్, వంటగ్యాస్ వంటి వివిధ సేవలను సార్వజనీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, గ్రామ, పంచాయతీ స్థాయిలో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మంచి, సురక్షితమైన పాలనకు ఉదాహరణ తప్ప మరొకటి కాదనీ చెప్పారు.

తాగు నీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్, పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (.డి.ఎఫ్.) స్థితి నిర్వహణ కోసం 15 ఆర్థిక సంఘం (ఎఫ్‌.సి) 2021-22 నుండి 2025-26 వరకు పంచాయితీలకు 1.42 లక్షల కోట్ల రూపాయల గ్రాంటు సిఫార్సుచేసింది. ఇది గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య సంబంధిత ప్రణాళికలను అమలు చేయడానికి మరిన్ని నిధులు అందజేస్తుందని, గ్రామ పంచాయతీలు సేవాభావంపై దృష్టి సారించి స్థానిక 'పబ్లిక్ యుటిలిటీస్' గా పనిచేస్తాయని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి 73 సవరణకు అనుగుణంగా స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి ఇది ఒక పెద్ద అడుగు అని శ్రీ లాల్ తెలిపారు.

పరిపాలన, పాలసీ, ఆవిష్కరణల సరైన కలయిక అద్భుతాలను సృష్టించగలదని శ్రీ లాల్ అభిప్రాయ పడ్డారు. ఇందుకు గుజరాత్ పురోగతి విజయగాథను ఉదాహరణగా పేర్కొన్నారు. 1999-2000 లో 1.02 శాతం, 2000-2001 లో మైనస్ 4.89 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి నుండి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హయాంలోని రెండు దశాబ్దాలలో రెండంకెల వృద్ధిని సాధించిందని, ఆతర్వాత 2014 మే నెల నుండి ప్రధానమంత్రిగా తన పాత్రను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని, ఆయన పేర్కొన్నారు. కాలంలో, గుజరాత్లో నీటి కొరత తొలగిపోవడమే కాకుండా, 2001లో కచ్ భూకంపం తర్వాత, వాతావరణం, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు నిర్మించబడ్డాయి. గుజరాత్ సమ్మిళిత అభివృద్ధికి, రెండంకెల వృద్ధికి, అవకాశాల భూమికి ప్రకాశించే ఉదాహరణగా మారిందని ఆయన అన్నారు. అందరికీ శ్రేయస్సు, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భరోసా ఇచ్చే పెట్టుబడి, ఆవిష్కరణల గమ్యంగా మారింది.

జాతీయ విద్యా విధానం (ఎన్..పి-2020) తర్వాత విద్యా రంగంలో 3.5 లక్షల మంది షెడ్యూల్డ్ తెగ (ఎస్.టి) విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే 740 ఏకలవ్య మోడల్ ఆశ్రమ పాఠశాలలను స్థాపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఎన్.సి.జి.జి. డైరెక్టర్ జనరల్ సూచించారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా, కనీసం 20,000 మంది ఎస్టీలు ఉన్న ప్రతి బ్లాక్లో ఇలాంటి పాఠశాలలు ఉంటాయని, ఆయన చెప్పారు. పేద గిరిజన పిల్లలకు బోర్డింగ్ స్కూల్ ఉంటుందని, అక్కడ వారు నాణ్యమైన విద్యను పొందుతారని, వారి సంస్కృతిని నేర్చుకుంటారని, వారి క్రీడలు నేర్చుకుంటారని, చివరికి అది షెడ్యూల్డ్ తెగలలో నాయకత్వ వికాసానికి దారి తీస్తుందని ఆయన వివరించారు.

డిజిటల్ఆరోగ్యం కావచ్చు, పంచాయతీ స్థాయిలో ఇంటర్నెట్‌, గ్రామ స్థాయిలో, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ లేదా ముద్రా రుణం ద్వారా నవ భారతదేశం ఆవిర్భవిస్తున్నదని, ప్రజలు వీటిని వినియోగించుకునేలా చేయడం, అవకాశాలు జారిపోవడానికి అనుమతించకుండా చూడడం ఒక ప్రజా సేవకునిగా మా కర్తవ్యమని శ్రీ లాల్ అన్నారు.

2007 లో భారతదేశం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 60 సంవత్సరాలు పట్టిందని, అయితే తర్వాత 7 సంవత్సరాలలో ట్రిలియన్ డాలర్లు మాత్రమే జోడించబడగా, 2014లో మనం 2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలుగా మారామని, తర్వాత 2019 లో కేవలం 5 సంవత్సరాలలో మూడు ట్రిలియన్లు జోడించబడిందని శ్రీ లాల్ పేర్కొన్నారు. వేగం, స్థాయి, అవకాశాలు దాని స్వంత ఊపును సృష్టిస్తాయని, ప్రభుత్వం అందరికీ అవకాశాలను అందించే ఎనేబుల్ ఎకో-సిస్టమ్ను రూపొందిస్తోందని ఆయన సూచించారు.

2014 లో కేవలం 24 శాతం మహిళలు మాత్రమే వర్క్ఫోర్స్లో ఉన్నారని, గత 7-8 ఏళ్లలో శాతం 33 శాతంకి పెరిగిందని, రాబోయే 25 ఏళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేయడం లేదా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం గురించి మాట్లాడినప్పుడు ప్రతి తలసరి ఆదాయం సుమారు 12,000 డాలర్లు, శ్రామిక శక్తిలో మహిళల పాత్ర కీలక పాత్ర పోషిస్తుందనీ, ప్రభుత్వం వ్యూహంపై పని చేస్తోందనీ, శ్రీ లాల్ పేర్కొన్నారు.

సరైన పాలన లేనప్పుడు ప్రజా విధానమైనా దాని లక్ష్యాన్ని సాధించడం లేదని, నేటి యుగంలో ఆవిష్కరణతో కలగలిసి పోతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని శ్రీ లాల్ తన ప్రశంగాన్ని ముగించారు. పబ్లిక్ పాలసీలో లక్ష్యం, పూచీకత్తు గురించి చాలా స్పష్టంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా చూడాలని ఆయన అన్నారు. నేడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం రకమైన పర్యావరణ వ్యవస్థను, అవకాశాలను సృష్టిస్తోంది, ఇక్కడ 140 కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందవచ్చు.

 

 

<><><>

 



(Release ID: 1889672) Visitor Counter : 192