ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్-ఆర్ఎంఆర్‌సి అనెక్స్ భవనాన్ని ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా


భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్-ఆర్ఎంఆర్‌సిలో ఐసిఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & బిఎస్‌ఎల్‌ III లాబొరేటరీకి పునాది రాయి

పరిశోధన పరంగా భారత్‌కు ప్రపంచ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ఇటీవలి కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇది నిరూపించబడింది: డాక్టర్ మాండవియా

ఒడిశాలో 2014కి ముందు 3 మెడికల్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం 10కి పెరిగాయి: శ్రీ ప్రధాన్

Posted On: 08 JAN 2023 8:51AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా  కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో ఐసిఎంఆర్-ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (ఆర్‌ఎంఆర్‌సి)  అనుబంధ భవనాన్ని ప్రారంభించారు. ఐసిఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు బిఎస్ఎల్ III లాబొరేటరీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి అపరాజిత సారంగి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ మాండవ్య మాట్లాడుతూ  పరిశోధనల పరంగా ప్రపంచానికి అగ్రగామిగా నిలిచే అవకాశం భారత్‌కు ఉందన్నారు. ఇటీవల కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇది నిరూపించబడిందన్నారు. ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలకు తన ప్రశంసలను తెలియజేస్తూ "ప్రపంచంలో మొట్టమొదటి కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టిన ఒక నెలలోనే భారతదేశం తన స్వంత దేశీయ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను విడుదల చేసింది" అని పేర్కొన్నారు.

వైద్య పరిశోధన యొక్క పరిధిని మరియు అవుట్‌పుట్‌ను పెంపొందించడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరిశోధనా సౌకర్యాల మధ్య ఉమ్మడి సహకారం అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి హైలైట్ చేశారు.

 

image.png

 

స్వదేశీ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో వారి సహకారం మరియు కొవిడ్-19 వైరస్ యొక్క కొత్త వైవిధ్యాల జన్యు శ్రేణికి వారి నిరంతర ప్రయత్నాలకుగాను ఐసిఎంఆర్‌కు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆరోగ్య సంరక్షణలో ఒక నమూనా మార్పును చూసిందని ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో 2014కి ముందు 3 మాత్రమే ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ప్రస్తుతం 10కి పెరిగిందని ఆయన హైలైట్ చేశారు.

డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఐసిఎంఆర్ సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూ కొవిడ్ వంటి మహమ్మారి సమయాల్లో ఐసిఎంఆర్ మొబైల్ బిఎస్‌ఎల్ ల్యాబ్‌లను భూటాన్ వంటి ఇతర దేశాలు ఉపయోగించుకుంటున్నాయని గుర్తు చేసుకున్నారు. టిబి-ముక్త్ భారత్ కోసం గౌరవనీయ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు హృదయపూర్వకంగా మద్దతునిచ్చిన మరియు నిక్షయ్ మిత్రలుగా మారడానికి ముందుకు వచ్చిన ఐసిఎంఆర్-ఆర్‌ఎంఆర్‌సి శాస్త్రవేత్తలకు కూడా ఆమె తన అభినందనలు తెలిపారు.

హై ఎండ్ లాబొరేటరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రయోజనాల కోసం అనెక్స్ భవనం నిర్మించబడింది. వ్యాధికారక సూక్ష్మజీవుల జన్యుపరమైన అంటువ్యాధి శాస్త్రంపై అధ్యయనాలు చేపట్టేందుకు కేంద్రం తదుపరి తరం సీక్వెన్సింగ్ (ఎన్‌జిఎస్)ను ప్రారంభించింది. తదుపరి తరం సీక్వెన్సింగ్ సదుపాయం ప్రస్తుతం సార్స్-కొవ్-2 జెనోమిక్ నిఘా డేటాను ఇండియన్ సార్స్-కొవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్)కి అందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న మరియు మళ్లీ అభివృద్ధి చెందుతున్న వ్యాధుల గుర్తింపును కూడా అందిస్తోంది. ఈ భవనంలో బయోఇన్ఫర్మేటిక్స్ సౌకర్యం, ప్రోటీమిక్స్ స్టడీ ఫెసిలిటీ, ఇ-లైబ్రరీ మరియు మెడికల్ మ్యూజియం వంటి అధునాతన ప్రయోగశాలలు ఉంటాయి.

 

image.png

 

ఐసిఎంఆర్-ఆర్‌ఎంఆర్‌సి భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పాల్గొనేవారికి వృత్తిపరమైన, క్లిష్టమైన మరియు ఇంటర్ డిసిప్లినరీ విద్యను అందిస్తుంది. ప్రస్తుత ప్రజారోగ్య సవాళ్లను అన్వేషించడానికి మరియు ప్రతిస్పందించడానికి వారికి నైపుణ్యాలను అందిస్తుంది. భువనేశ్వర్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో 2018 నుండి పబ్లిక్ హెల్త్ అకడమిక్ ప్రోగ్రామ్ సెంటర్‌లో ప్రారంభించబడింది. ఈ కోర్సు ఉత్కల్ యూనివర్శిటీ, ఒడిషా (నాక్ ఏ+)కి అనుబంధంగా ఉంది మరియు ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా గుర్తింపు పొందింది. ఇది దేశంలోనే రెండవ ఐసిఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ప్రస్తుతం ఎంపిహెచ్ కోర్సు (2022-24) కోసం ఐదవ బ్యాచ్ అడ్మిషన్ పూర్తయింది.

భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్-రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్‌ఎంఆర్‌సి)లోని ప్రాంతీయ స్థాయి వైరస్ పరిశోధన మరియు రోగనిర్ధారణ ప్రయోగశాల (విఆర్‌డిఎల్) అనేది ఒక పబ్లిక్ హెల్త్ వైరాలజీ లేబొరేటరీ సెటప్. ఇది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఆరోగ్య పరిశోధన విభాగం  ఆధ్వర్యంలో దేశంలో అంటువ్యాధులు మరియు జాతీయ విపత్తుల నిర్వహణ కోసం ప్రయోగశాలల విస్తృత నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం” పథకం క్రింద నిధులు సమకూర్చింది. బిఎస్‌ఎల్‌3 స్థాయి సదుపాయం రాష్ట్రంలో మరియు  ప్రాంతంలో అంటు వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడానికి మరియు అటువంటి వ్యాధికారక కారకాలు ముఖ్యంగా ఉద్భవిస్తున్న మరియు తిరిగి ఉద్భవిస్తున్న వైరస్‌ల ద్వారా ఎదురయ్యే ఆరోగ్య సవాళ్లకు ప్రతిస్పందించడానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క 26 పరిశోధనా సంస్థల్లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఐసిఎంఆర్-ఆర్ఎంఆర్‌సి ఒకటి. బయోమెడికల్ మరియు హెల్త్ రీసెర్చ్ యొక్క సూత్రీకరణ, సమన్వయం మరియు ప్రచారం కోసం భారతదేశంలోని అత్యున్నత ప్రభుత్వ సంస్థ ఐసిఎంఆర్‌-ఆర్‌ఎంఆర్‌సి భువనేశ్వర్‌లో 1981లో 6వ పంచవర్ష ప్రణాళిక వ్యవధిలో సంక్రమించే మరియు నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులలో పరిశోధన కార్యకలాపాలను చేపట్టడానికి స్థాపించబడింది. వనరుల అభివృద్ధి కార్యక్రమం మరియు ప్రాంతీయ ఆరోగ్య సమస్యకు పరిష్కారాలను కనుగొనడంలో రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి ఇది పనిచేస్తుంది. ప్రాంతీయ ఆరోగ్య సమస్యలను గుర్తించి సహకారం అందించడంలో కేంద్రం సమర్థవంతంగా పనిచేసింది. గత మూడు దశాబ్దాలలో ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం మరియు విధానాల మూల్యాంకనం, అమలులో గణనీయంగా ఉపయోగించబడింది. 2020-22 కాలంలో కొవిడ్-19 మహమ్మారి యొక్క సమర్థవంతమైన నిర్వహణలో కేంద్రం రాష్ట్ర ఆరోగ్య శాఖతో సన్నిహిత సహకారంతో పనిచేసింది. గత 5 సంవత్సరాలలో, కేంద్రం జూనోటిక్ వ్యాధులు, వన్‌హెల్త్, హెల్త్ సిస్టమ్ రీసెర్చ్, నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ పరిశోధన సహకారం ద్వారా దేశంలోని 10 వేర్వేరు రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకుంది.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అదనపు కార్యదర్శి శ్రీ మనోహర్ అగ్నాని, ఐసిఎంఆర్ డిజి డాక్టర్ రాజీవ్ బహ్ల్, భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్-ఆర్‌ఎంఆర్‌సి డైరెక్టర్  డాక్టర్ సంఘమిత్ర పతి పాల్గొన్నారు.

 

****



(Release ID: 1889643) Visitor Counter : 106