రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డిజిటల్ లో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పాస్‌ల పంపిణీ


అతిథులకు ఇ-ఆహ్వానాలను అందించడానికి ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను ప్రారంభించిన రక్షణ మంత్రిత్వ శాఖ, సాధారణ ప్రజలకు టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం

Posted On: 06 JAN 2023 1:23PM by PIB Hyderabad

ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ చొరవలో భాగంగా,  రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ తిలకించే ప్రముఖులకు ఇ-ఆహ్వానాలను అందించడానికి రక్షణ శాఖ  మంత్రి శ్రీ అజయ్ భట్ జనవరి 06 న న్యూఢిల్లీలో ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ (www.aamantran.mod.gov.in)ని ప్రారంభించారు. ఈ వేడుకలను చూసేందుకు సాధారణ ప్రజలకు టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం ఇక డిజిటల్ గా అందించనున్నారు. భౌగోళిక స్థానంతో సంబంధం లేకుండా సామాన్య ప్రజలు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసే సదుపాయంతో పాటు ప్రముఖులకు, వారి అతిథులకు ఆన్‌లైన్ పాస్‌లను జారీ చేసే సదుపాయాన్ని పోర్టల్ అందిస్తుంది. ఆమంత్రన్ పోర్టల్ ఈ మొత్తం ప్రక్రియను వినియోగదారు స్నేహపూర్వకంగా, పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది. 

ఈ సందర్భంగా శ్రీ అజయ్ భట్ మాట్లాడుతూ, ఈ పోర్టల్ 'డిజిటల్ ఇండియా' చొరవలో మరో మైలురాయి అని, సులభ, సమర్థవంతమైన, ఆర్థిక, పర్యావరణ అనుకూల పాలనపై ఆధారపడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఇ-గవర్నెన్స్ మోడల్ భావన వైపు ఒక అడుగు అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి జీవన సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 'డిజిటల్ ఇండియా', 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' ప్రభుత్వాన్ని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల  కోసం ప్రజలు టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని ఈ ఆహ్వాన పోర్టల్ సులభతరం చేస్తుందని,  ప్రింటింగ్‌లో ఉపయోగించే పెద్ద మొత్తంలో కాగితాన్ని ఆదా చేస్తుందని రక్షణ శాఖ మంత్రి ప్రశంసించారు. పోర్టల్ ఆర్‌డి వేడుకలను మరింత సురక్షితంగా మారుస్తుందని ఆయన అన్నారు.

ఆమంత్రన్ పోర్టల్ క్రింది లక్షణాలను కలిగి ఉంది:
* మెరుగైన భద్రత కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రమాణీకరణ.
* ఇమెయిల్‌లు/ఎస్ఎం ఎస్ ద్వారా పాస్‌లు/టికెట్‌ల డిజిటల్ డెలివరీ.
* రద్దు చేయలేని, బదిలీ చేయలేని టిక్కెట్లు.
* ఆహ్వానితుల నుండి ఆమోదం పొందేందుకు పాస్‌ల కోసం ఆర్ఎస్ వి పి ఎంపిక

* భవిష్యత్ ఈవెంట్‌ల మెరుగైన నిర్వహణ కోసం ఈవెంట్ డేటా విశ్లేషణ

పోర్టల్ ద్వారా ఇ-ఆహ్వానాలను పొడిగించడంతో పాటు, టిక్కెట్ల కొనుగోలు కోసం బూత్‌లు/కౌంటర్‌లు ఈ క్రింది ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ టిక్కెట్‌లను సులభతరం చేస్తుంది:

  • సేన భవన్ (గేట్ నెం 2)
    శాస్త్రి భవన్ (గేట్ నెం 3)
    జంతర్ మంతర్ (మెయిన్ గేట్ దగ్గర)
    ప్రగతి మైదాన్ (గేట్ నెం 1)
    పార్లమెంట్ హౌస్ (రిసెప్షన్ ఆఫీస్) – ఎంపీల కోసం ప్రత్యేక కౌంటర్ (18.01.2023న తెరుస్తారు)
    సమయాలు మధ్యాహ్నం (1000 గంటల నుండి 1230 గంటల వరకు), మధ్యాహ్నం (1400 గంటల నుండి 1630 గంటల వరకు) ఉంటాయి.
    వివరణాత్మక సూచనల కోసం, www.mod.gov.inwww.indianrdc.mod.gov.inని సందర్శించండి

 

****



(Release ID: 1889203) Visitor Counter : 151