శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

పంజాబ్‌లోని మొహాలిలో నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటర్ (ఎన్‌జిఈటిసి)ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఆహారం మరియు పోషకాహార భద్రతపై 4 రోజుల అంతర్జాతీయ సదస్సును కూడా ప్రారంభించిన డా. జితేంద్ర సింగ్

అగ్రి టెక్ స్టార్టప్ అనేది భారతదేశంలో ప్రత్యేకమైన సంభావ్యత. ఈ భావన విజయవంతం కావడానికి దేశంలోని వాటాదారులందరికీ మరింత అవగాహన అవసరం అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రోత్సాహం కారణంగా భారతదేశంలో స్టార్టప్ ఉద్యమం ఊపందుకుంది. ఆ ఉద్యమం ఇప్పటికి దేశంలో 80,000 స్టార్టప్‌ల సృష్టికి దారితీసింది.

స్టార్టప్‌ల సంఖ్యలో ఈ క్వాంటం జంప్ వ్యవసాయం మరియు బయోటెక్‌లలో సమానంగా మరియు దామాషా ప్రకారం ప్రతిబింబించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు మరియు భారతీయ పారిశ్రామికవేత్తలు మరియు యువత ప్రయోజనం పొందలేదు.

Posted On: 05 JAN 2023 5:35PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఒఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పంబాబ్‌లోని మొహాలీలో గల నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఏబిఐ)లో "నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటర్"ని ప్రారంభించారు.

 

మంత్రి  అదే సమయంలో  4 రోజుల అంతర్జాతీయ సదస్సు అయిన ఆహారం మరియు పోషకాహార భద్రత-ఐఫ్యాన్స్‌2023ను కూడా ప్రారంభించారు.

 

image.png

 

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ అగ్రి-టెక్ స్టార్టప్‌కు భారతదేశంలో ప్రత్యేకమైన సామర్థ్యం ఉందని ఈ భావన విజయవంతం కావడానికి దేశంలోని వాటాదారులందరికీ మరింత అవగాహన అవసరమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోత్సాహం కారణంగా భారతదేశంలో స్టార్టప్ ఉద్యమం ఊపందుకుంది మరియు 2014కి ముందు 350 మాత్రమే ఉన్న స్టార్ట్‌ప్‌ల సంఖ్య ఇప్పుడు 80,000 స్టార్టప్‌ల సృష్టికి దారితీసిందని ఆయన అన్నారు.

వ్యవసాయం మరియు బయోటెక్‌లలో కూడా సమానంగా మరియు దామాషాగా ఈ స్టార్ట్‌అప్‌ల సంఖ్య ప్రతిబింబించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు మరియు భారతీయ పారిశ్రామికవేత్తలు మరియు యువత ప్రయోజనం పొందలేదు. దీంతో అగ్రి టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో లాభదాయకమైన జీవనోపాధి మరియు ఆదాయ మార్గాల గురించి అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

 

image.png

 

"నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటర్" (ఎన్‌జిఈటిసి) ఈరోజు ప్రారంభించబడింది, ఇది సిఆర్‌ఐఎస్‌పిఆర్‌-సిఎఎస్‌తో సహా వివిధ జీనోమ్ ఎడిటింగ్ పద్ధతులను స్వీకరించడానికి ప్రాంతీయ అవసరాలను తీర్చడానికి జాతీయ వేదికగా ఉపయోగపడే ఒక రూఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయం. ఇది యువ పరిశోధకులకు శిక్షణ మరియు మార్గనిర్దేశాన్ని అందించడం ద్వారా వారికి దాని పరిజ్ఞానం మరియు పంటలలో అనువర్తనాన్ని అందిస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మంచి పోషకాహారం మరియు మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను మెరుగుపరచడం ఒక ముఖ్యమైన సవాలు. జీనోమ్ ఎడిటింగ్ అనేది పంటలలో కావలసిన టైలర్ మేడ్ లక్షణాలను అందించడానికి భారతీయ పరిశోధనలు స్వీకరించగల మంచి సాంకేతికత. అరటి, వరి, గోధుమ, టమోటా, మొక్కజొన్న మరియు మిల్లెట్‌లతో సహా విస్తారమైన పంటలకు జన్యు సవరణ సాధనాలను ఎన్‌ఎబిఐ అందించగలదు.

ఆహార మరియు పోషకాహార భద్రతపై అంతర్జాతీయ సదస్సు (ఐఫ్యాన్స్-2023)ని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఎబిఐ), సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్ (సిఐఏబి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐపిబి) మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీ (ఐసిజీఈబి)లు మొహాలిలోని ఎన్‌ఏబిఐలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలో మారుతున్న వాతావరణంలో జీనోమ్ ఎడిటింగ్ దేశం యొక్క ఆహారం మరియు పోషకాహార భద్రతను ఎలా పెంపొందించగలదో 4 రోజుల సదస్సు మేధోమథనం చేస్తుంది. కాన్ఫరెన్స్‌లో 15 వేర్వేరు దేశాల నుండి అనేక మంది స్పీకర్‌లతో బహుళ సెషన్‌లు ఉంటాయి. వారు మొక్కల శాస్త్రాల్లో వారి పరిశోధన ఫలితాలను, అనుభవాలను పంచుకుంటారు. ఈ సమావేశం కొత్త సవాళ్లు మరియు కొత్త ఆలోచనలను తీసుకువస్తుంది మరియు వివిధ దేశాల్లోని ప్రయోగశాలల మధ్య కొత్త పరిశోధన సహకారాలను పెంపొందించడానికి ఒక వేదికగా కూడా పని చేస్తుంది.

వ్యవసాయం, ఆహారం మరియు పోషకాహారం బయోటెక్నాలజీ మరియు జీనోమ్ ఎడిటింగ్ రంగాలలో అంతర్జాతీయ నిపుణులు మరియు యువ పరిశోధకులను ఒకచోట చేర్చాలని ఈ సమావేశం భావిస్తుంది. ఆహారం మరియు పోషకాహార భద్రత అనేది ప్రపంచ డిమాండ్ అనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని యువ విద్యార్థులు మరియు పరిశోధకులను ప్రేరేపించడానికి సదస్సు యొక్క థీమ్ సంబంధితంగా ఉంది. సిఆర్ఐఎస్‌పిఆర్‌-కాస్9ని ఉపయోగించి జన్యు సవరణ వంటి అధునాతన బయోటెక్నాలజీ సాధనం ఈ లక్ష్యాలను స్థిరమైన పద్ధతిలో సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 500 మందికి పైగా ఈ సదస్సు కోసం నమోదు చేసుకున్నారు. వీరితో పాటు ఈ నాలుగు రోజుల్లో 80 మంది వక్తలు (40 అంతర్జాతీయ మరియు 40 జాతీయ) తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పంచుకుంటారు.

 

image.png

 

ఎన్‌ఎబిఐ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో వ్యవసాయం ఆహారం మరియు పోషకాహార బయోటెక్నాలజీ ఇంటర్‌ఫేస్‌లో పరిశోధన కార్యకలాపాలపై దృష్టి సారించే ఆదేశంతో కూడిన జాతీయ సంస్థ. జీనోమ్ ఎడిటింగ్ అనేది సైట్ నిర్దిష్ట జన్యు ఉత్పరివర్తనలు/మార్పులకు కారణమయ్యే కీలకమైన సాధనం. తద్వారా ముఖ్యమైన పంట లక్షణాలను అభివృద్ధి చేయవచ్చు. ఈ ఉత్పరివర్తనలు ప్రకృతి వంటి ఉత్పరివర్తనాలను అనుకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు జన్యువులో నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుత వాతావరణ దృష్టాంతంలో, అభివృద్ధి చెందుతున్న మెరుగైన పోషకాహారం మరియు మారుతున్న పర్యావరణ స్థితికి సహనం కోసం ఒక ముఖ్యమైన సవాలు. జీనోమ్ ఎడిటింగ్ అనేది పంటలలో కావలసిన టైలర్ మేడ్ లక్షణాలను అందించడానికి భారతీయ పరిశోధనలు స్వీకరించగల మంచి సాంకేతికత. ఎన్‌ఎబిఐ జీనోమ్ ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని ఇది చూపించింది. అరటి, వరి, గోధుమ, టమోటా మరియు మిల్లెట్‌తో సహా విస్తారమైన పంటలకు జీనోమ్ ఎడిటింగ్ సాధనాలను ఇది విస్తరించవచ్చు.

                                                 

 <><><><>



(Release ID: 1889100) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Hindi , Punjabi