పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిన రంగాల్లో ఆరోగ్య సంరక్షణ ఒకటి: శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


గత 7-8 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఆరోగ్య రంగంలో జరిగిన పని గత 70 సంవత్సరాల్లో జరగలేదు.... శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

ప్రజలకు చౌకైన చికిత్స మరియు మందులు అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ రంగం నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రోత్సహిస్తుంది.. శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

ఆరోగ్య సంరక్షణకు అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం . శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

Posted On: 23 DEC 2022 2:21PM by PIB Hyderabad

మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిన రంగాల్లో ఆరోగ్య సంరక్షణ ఒకటి అని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈరోజు ఢిల్లీలో విలేకరులతో శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు.  సమగ్ర ఆరోగ్య సంరక్షణకు విధానం అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  అనారోగ్యానికి కారణమయ్యే కారకాలను తొలగించడం, వ్యాధుల చికిత్స ను సమ్మిళితం చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు స్వస్థత పై  దృష్టి సారించిందని  అన్నారు. గత 7-8 ఏళ్లలో భారతదేశంలో ఆరోగ్య రంగంలో జరిగిన  పని గత 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. 

ప్రజలందరికి సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి  గత 8 సంవత్సరాల కాలంలో  ఆరోగ్య రంగంలో  మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని  శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని  శ్రీ సింధియా అన్నారు.   సరసమైన ధరకు చికిత్స, ఔషధాలు అందించడం,  గ్రామ స్థాయిలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అభివృద్ధి చేయడం, మానవ వనరుల అభివృద్ధి, వ్యాధి  నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రోత్సహించడం,  ఆరోగ్య సంరక్షణ అందించడానికి  పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వివరించారు.

 ఆరోగ్య సంరక్షణలో 'అంత్యోదయ' దార్శనికతను అమలు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం నాణ్యమైన అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సరసమైన ధరలకు మందులు అందుబాటులోకి తెచ్చిందని శ్రీ సింధియా  అన్నారు. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా అమలు జరుగుతున్న  ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పి ఎం-జె) ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం గా గుర్తింపు పొందిందని తెలిపారు.పథకం అమలుకు కేంద్ర  ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. పీఎంజే  కింద సుమారు 10.74 కోట్ల పేద, నిస్సహాయ కుటుంబాలు (సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులు) ద్వితీయ, తృతీయ స్థాయి ఆసుపత్రుల్లో చేరే సమయంలో ప్రయోజనం పొందుతున్నాయని అన్నారు. దేశంలో 17.6 కోట్ల  ఆయుష్మాన్ కార్డులు మంజూరు అయ్యాయని  శ్రీ సింధియా తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు  28,800 కి పైగా ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించామని  ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎం బిజెపి) పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 8,800 జన ఔషధి ఫార్మసీ అవుట్ కేంద్రాల్లో  1,800 కంటే ఎక్కువ మందులు సరసమైన మరియు అధిక నాణ్యత గల  అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. 

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు అమలు చేస్తున్నాదని శ్రీ సింధియా తెలిపారు. దీనిలో భాగంగా స్థిరమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడానికి  ఆయుష్మాన్ భారత్ హెల్త్ , వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయని  శ్రీ సింధియా చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అందించేందుకు  గ్రామాల్లో పరీక్షల కోసం మెరుగైన సౌకర్యాలతో పరీక్ష కేంద్రాలు నెలకొల్పి  సకాలంలో చికిత్స కోసం వ్యాధులను గుర్తిస్తున్నారని మంత్రి తెలిపారు. 2014కు ముందు దేశంలో 400 కంటే తక్కువ వైద్య కళాశాలలు ఉండేవని, గత ఎనిమిదేళ్లలో 200కు పైగా కొత్త  వైద్య కళాశాలలు నెలకొల్పామని చెప్పారు. వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని అన్నారు. దేశంలో  2014 కి ముందు ఏడు ఎయిమ్స్  మాత్రమే ఉన్నాయని తెలిపిన మంత్రి కేంద్ర ప్రభుత్వ పథకం కింద 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు ఎయిమ్స్ ఆమోదం లభించింది అని అన్నారు. 

యోగా మరియు ఆయుష్ పై ప్రజలకు  అవగాహన ఎక్కువగా ఉందని మంత్రి తెలియజేశారు. ప్రపంచంలో యోగా పట్ల ఆకర్షణ పెరిగింది అని అన్నారు.  స్వచ్ఛ భారత్ అభియాన్ అనేక వ్యాధుల నివారణకు సహకరించిందని తెలిపిన శ్రీ సింధియా  పోషణ్ అభియాన్ మరియు జల్ జీవన్ మిషన్ పోషకాహార లోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతున్నాయి అని తెలిపారు. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా నగరాల వైద్యుల నుంచి ప్రాథమిక సంప్రదింపులు పొందగలుగుతున్నారని శ్రీ సింధియా అన్నారు. నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ – ఇ సంజీవని వ్యాధుల నిర్ధారణ, చికిత్స మరియు నిర్వహణ రిమోట్ గా ప్రారంభించడానికి ఐసిటి ని వినియోగిస్తున్నదని శ్రీ సింధియా వివరించారు. సమగ్ర డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించిందని శ్రీ సింధియా తెలిపారు. 

 

***


(Release ID: 1886106) Visitor Counter : 368
Read this release in: English , Urdu , Marathi , Hindi