ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపుర్ లోని నోనీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దుర్ఘటన లో ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం వ్యక్తం చేసినప్రధాన మంత్రి 


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఆయనపరిహారాన్ని ప్రకటించారు

प्रविष्टि तिथि: 21 DEC 2022 8:52PM by PIB Hyderabad

మణిపుర్ లోని నోనీ జిల్లా లో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం లో మరణించిన వారి బంధువుల కు 2 లక్షల రూపాయల వంతున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -

 

‘‘మణిపూర్‌ లోని నోనీ జిల్లా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు తీవ్ర వేదనకు లోనయ్యాను. ఈ దురదృష్టకర ఘటన లో తమ ఆప్తుల ను కోల్పోయిన వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలుగాను సాయపడటానికి మణిపూర్ పాలనాయంత్రాంగం చొరవ తీసుకుంటోంది: ప్రధాన మంత్రి @narendramodi’’

 

‘‘బస్సు ప్రమాద దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారం ఇవ్వడం జరుగుతుంది. దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి@narendramodi’’ అని పేర్కొంది.


(रिलीज़ आईडी: 1885736) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam