నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోర్టుల ఆధునీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 16 DEC 2022 3:39PM by PIB Hyderabad

సాగరమాల కార్యక్రమంలో భాగంగా 800కు పైగా ప్రాజెక్టులు రూ. 5.4 లక్షల కోట్ల అంచనా వ్యయంతో గుర్తించారు. సాగరమాల ప్రాజెక్టులలో ఇప్పటికే ఉన్న ఓడరేవులు మరియు టెర్మినల్స్ ఆధునికీకరణ, కొత్త పోర్టులు, టెర్మినల్స్, రోరో & టూరిజం జెట్టీలు, పోర్ట్ కనెక్టివిటీ పెంపుదల, అంతర్గత జలమార్గాలు, లైట్‌హౌస్ టూరిజం, ఓడరేవు చుట్టూ పారిశ్రామికీకరణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక కేంద్రాలు మొదలైన వివిధ వర్గాల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులు సాగరమాల యొక్క ఐదు ప్రధాన అంశాలుగా వర్గీకరించబడ్డాయి.

ఓడరేవు ఆధునీకరణ కింద 241 ప్రాజెక్టులు దాదాపు రూ. 2.5 లక్షల కోట్లతో చేపట్టారు. మంత్రిత్వ శాఖ పాక్షికంగా 20 పోర్టుల ఆధునికీకరణ ప్రాజెక్టులకు రూ. 1,191 కోట్లతో చేపట్టింది. ఈ మొత్తం 20 ప్రాజెక్టుల్లో రూ. 157 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.868 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఓడరేవుల ఆధునికీకరణ ప్రాజెక్టుల రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం Iలో అందించబడ్డాయి.

పారాదీప్ పోర్ట్‌లో 4 ప్రధాన సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రూ. 3264 కోట్లు గత 7 సంవత్సరాలలో అమలు చేయబడ్డాయి. ఈ ప్రాజెక్టులు పోర్టు సామర్థ్యాన్ని 55 ఎంటిపిఏ మేర పెంచాయి. పారాదీప్ పోర్ట్‌లో పోర్టు ఆధునీకరణ ప్రాజెక్టుల వివరాలు అనుబంధం IIలో అందించబడ్డాయి.

వీటితో పాటు కేప్ సైజు నౌకలను నిర్వహించడానికి బిఓటి ప్రాతిపదికన వెస్ట్రన్ డాక్‌ను అభివృద్ధి చేయడంతో సహా అంతర్గత నౌకాశ్రయ సౌకర్యాలను డీపెనింగ్ మరియు ఆప్టిమైజేషన్‌కు రూ.3004.63 కోట్లు మంజూరు చేయబడ్డాయి.

ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్ నోటిఫైడ్ నాన్ మేజర్ పోర్ట్‌గా ఉంది. నాన్-మేజర్ పోర్టులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణలో ఉన్నాయి. బూస్ట్ ప్రాతిపదికన పిపిపి మోడ్ ద్వారా గోపాల్‌పూర్ పోర్ట్స్ లిమిటెడ్ (జీపిఎల్) ద్వారా గోపాల్‌పూర్ పోర్ట్ అభివృద్ధి చేయబడిందని మరియు కార్యాచరణలో ఉందని ఒడిశా ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి, గోపాల్‌పూర్ పోర్టు సామర్థ్యాన్ని ఆధునీకరించడం మరియు పెంచడం జీపీఎల్ బాధ్యత.

 

అనుబంధం I

సాగరమాల కింద పోర్ట్ ఆధునీకరణలో పాక్షికంగా నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల రాష్ట్రాల వారీగా వివరాలు కార్యక్రమం

 

రాష్ట్రం/ యూటీ

# ప్రాజెక్ట్లు

ప్రాజెక్ట్ వ్యయం

(రూకోట్లు)

మంజూరుచేయబడ్డ నిధులు (రూకోట్లు)

ఆంధ్రప్రదేశ్

1

86

43

డామన్ & డయ్యూ

2

92

46

గోవా

1

14

7

కర్ణాటక

3

263

74

కేరళ

4

72

57

మహారాష్ట్ర

2

184

92

పుదుచ్చేరి

1

44

44

తమిళనాడు

5

356

147

పశ్చిమ బెంగాల్

1

81

40

మొత్తము

20

1191

550

 

అనుబంధం II

పారాదీప్ పోర్ట్ వద్ద పోర్ట్ ఆధునీకరణ ప్రాజెక్టుల వివరాలు

క్రమ సంఖ్య

ప్రాజెక్ట్ పేరు

ప్రాజెక్ట్ వ్యయం (రూకోట్లు)

సామర్థ్యం జోడించబడింది

1

బిఓటి ప్రాతిపదికన కంటైనర్లతో సహా శుభ్రమైన కార్గోను నిర్వహించడానికి బహుళార్ధసాధక బెర్త్ అభివృద్ధి

431

5 ఎంటీపిఏ

2

బిఓటీ ప్రాతిపదికన ఇనుప ఖనిజం ఎగుమతులను నిర్వహించడానికి కొత్త ఇనుప ఖనిజం బెర్త్ అభివృద్ధి

740

10 ఎంటీపిఏ

3

బిఓటీ ప్రాతిపదికన ఈక్యూ1- ఈక్యూమరియు ఈక్యూబెర్త్‌ల  యాంత్రీకరణ

1438

30 ఎంటీపిఏ

4

బిఓటీ ప్రాతిపదికన బొగ్గు దిగుమతులను నిర్వహించడానికి కొత్త బొగ్గు అభివృద్ధి

656

10 ఎంటీపిఏ

 

ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
 
***

(రిలీజ్ ఐడి: 1884644) సందర్శకుల సూచీ సంఖ్య : : 170
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil