భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫేమ్ ఇండియా పథకం ఫేజ్-II కింద 07 డిసెంబర్ 2022 వరకు 7,45,713 ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఇన్సెంటివ్ ద్వారా దాదాపు రూ. 3,200 కోట్ల మద్దతు.

Posted On: 13 DEC 2022 2:56PM by PIB Hyderabad

 

ఫేమ్ ఇండియా పథకం ఫేజ్-II కింద 07 డిసెంబర్ 2022 వరకు 7,45,713 ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఇన్సెంటివ్ ద్వారా దాదాపు రూ. 3,200 కోట్ల మద్దతు లభించింది. వీటితో పాటు పథకం కింద 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర మరియు ఇంటర్‌సిటీ కార్యకలాపాల కోసం 65 నగరాలు/ఎస్‌టియులు/సిటియులు/ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంహెచ్‌ఐ 6315 ఇ-బస్సులను మంజూరు చేసింది.

భారతదేశంలో (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వాహనాల (ఫేమ్ ఇండియా) పథకం వేగవంతమైన అమలు మరియు తయారీ దశ-IIని ప్రభుత్వం 1 ఏప్రిల్, 2019 నుండి ఐదేళ్ల పాటు మొత్తం రూ. 10,000 కోట్ల బడ్జెట్ మద్దతుతో  చేపట్టింది. ఈ దశ ప్రధానంగా ప్రజా మరియు భాగస్వామ్య రవాణాకు సంబంధించి విద్యుదీకరణకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. డిమాండ్ ప్రోత్సాహక పథకం ద్వారా 7090 ఇ-బస్సులు, 5 లక్షల ఇ-3 వీలర్లు, 55000 ఇ-4 వీలర్ ప్యాసింజర్ కార్లు మరియు 10 లక్షల ఇ-2 వీలర్ల ద్వారా మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధరలో ముందస్తు తగ్గింపు రూపంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించబడతాయి.

దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది:

 

  1. 11 జూన్, 2021 నుండి ఫేజ్ ఇండియా స్కీమ్  ఫేజ్ II కింద డిమాండ్ ప్రోత్సాహకం రూ.10,000/కెడబ్ల్యూహెచ్‌ నుండి వాహన ధరలో 20% నుండి 40% వరకు పరిమితి పెరుగుదలతో రూ.15,000/కెడబ్ల్యూహెచ్‌ పెరిగింది.  తద్వారా ఐసీఐ టూ వీలర్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరను ఎనేబుల్ చేస్తుంది. ఇంకా, 25 జూన్, 2021న ఫేమ్ ఇండియా స్కీమ్ II దశ 2024 మార్చి 31 వరకు 2 సంవత్సరాల పాటు పొడిగించబడింది.
  2. దేశంలో బ్యాటరీ ధరలను తగ్గించేందుకు దేశంలో అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని 12 మే 2021న ప్రభుత్వం ఆమోదించింది. బ్యాటరీ ధరలు తగ్గడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గుతుంది.
  3. ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్‌ల కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకం కింద కవర్ చేయబడ్డాయి, ఇది ఐదేళ్ల కాలానికి రూ 25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో 15 సెప్టెంబర్ 2021న ఆమోదించబడింది.
  4. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ 12% నుండి 5%కి తగ్గించబడింది; ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లు/ఛార్జింగ్ స్టేషన్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు.
  5. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్ మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టిహెచ్‌) బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్‌లు ఇవ్వబడుతుందని మరియు పర్మిట్ అవసరాల నుండి మినహాయించబడుతుందని ప్రకటించింది.
  6. ఈవీలపై రహదారి పన్నును మినహాయించాలని రాష్ట్రాలకు సలహా ఇస్తూ ఎంఓఆర్‌టిహెచ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఈవీల ప్రారంభ ధరను తగ్గించడంలో సహాయపడుతుంది.


కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

*****



(Release ID: 1883304) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Marathi , Tamil