ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ
Posted On:
26 NOV 2022 9:25AM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ రోజంతా వరకు వేడుకలు ఏర్పాటు చేసింది.
హిందీ, ఆంగ్లంలో రాజ్యాంగ పీఠిక పఠనంతో వేడుక ప్రారంభమైంది.
ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంలో, "భారతదేశం - ప్రజాస్వామ్యానికి జనని / भारत लोक तन्त्र की जननी" పేరిట నినాదాల రాత పోటీని నిర్వహించారు.
ఈ పోటీ తర్వాత, భారత రాజ్యాంగం గురించి మంత్రిత్వ శాఖ అధికారులు పరస్పర చర్చలు జరిపారు.
భారతదేశం, భారత రాజ్యాంగం అంశాల మీద మంత్రిత్వ శాఖ ఒక క్విజ్ కూడా నిర్వహించింది. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది అందరూ చురుగ్గా పాల్గొన్నారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో పోస్టర్లను ప్రదర్శించారు.


*******
(Release ID: 1879044)