సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
శ్రీనగర్ దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించి మీడియా యూనిట్లపనితీరును, స్వచ్ఛత 2.0 ప్రత్యేక ప్రచారాన్ని సమీక్షించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్
Posted On:
03 NOV 2022 3:45PM by PIB Hyderabad
కేంద్ర సమాచార ప్రసార శాఖసహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ 2022 అక్టోబర్ 28న శ్రీనగర్ దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వశాఖపరిధిలోని ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ల పనితీరును సమీక్షించారు.దూరదర్శన్ డిడిజి శ్రీ ఎస్.సంజీవ్, ఆలిండియా రేడియో డిడిజి శ్రీ అజయ్ కె. దోహారె, పిఐబి, సబిసి ఎడిజి (రీజియన్) శ్రీ రాజిందర్ చౌదరి, ఇతర మీడియా యూనిట్ల సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంస్థలు సాధించిన విజయాలపైన, ఈ మీడియా యూనిట్లు మరింతగా తమ సేవలను మెరుగుపరచడంలో ఎదురవుతున్న ఇబ్బందులపైన ప్రజంటేషన్లు ఇచ్చారు.
ఈ సమీక్ష సందర్భంగా డాక్టర్.ఎల్.మురుగన్ అధికారులతో మాట్లాడి, వివిధ అంశాలపై వారికి మార్గదర్శనం చేయడంతోపాటు జమ్ముకాశ్మీర్ లో అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ కార్యకలాపాలపై కవరేజ్ని మెరుగుపరిచేందుకు తగిన సూచనలు చేశారు. డాక్టర్ మురుగన్చేసిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలలోని ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి.
1. మీడియా యూనిట్లు, భారతప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టి క్షేత్రస్థాయినుంచి కవరేజ్ ఇవ్వాలి. ఈ అభివృద్ధికార్యక్రమాలపై లబ్ధిదారుల నుంచి స్పందనను ప్రజలకు అందించాలి.
2. ఇలాంటి అభివృద్ధికార్యక్రమాల విజయగాధలను క్షేత్రస్థాయినుంచి గ్రహించి వాటికి ప్రాధాన్యతనివ్వాలి.
3. జిల్లాస్థాయిలో అభివృద్ధికార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టాలి.అలాంటి అభివృద్ధి కార్యక్రమాల ఫలితంపై సమీక్ష చేయాలి.
4.భారత ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెడుతున్నది. వివిధ మంత్రిత్వశాఖల మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధికార్యక్రమాల అమలు తీరును సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు మీడియా యూనిట్లు మరింత కవరేజ్,పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
డాక్టర్ మురుగన్, స్వచ్ఛతా ప్రచారం 2.0 అమలు పురోగతిపైకూడా సమీక్షనిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని మీడియా యూనిట్లు 2022 అక్టోబర్ 2నుంచి చేపట్టాయి. దీనిని ప్రజెంటేషన్ల ద్వారా సమీక్షించారు. అనంతరం మంత్రి శ్రీనగర్ దూరదర్శన్ కేంద్రం ఆఫీస్ బ్లాక్ను సందర్శించారు. ఆ ప్రాంగణాన్ని పరిశీలించి స్వచ్ఛతా కార్యక్రమాలను మరింత మెరుగు పరిచేందుకు ,దాని నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
***
(Release ID: 1873967)