రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఉత్తర్ ప్రదేశ్ – ఉత్తరాఖండ్ రెండింటినీ కలుపుతూ ఎన్ హెచ్- 734 లోని మొరాదాబాద్ –ఠాకూర్వాడ – కాశీపూర్ సెక్షన్ కోసం కింద రూ. 1841.92 కోట్ల వ్యయంతో అభివృద్ధి, మెరుగుపరిచే పనులు మంజూరు
ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాలను కలుపుతూ NH-734లోని మొరాదాబాద్ - ఠాకుర్వాడ - కాశీపూర్ సెక్షన్ కోసం రూ.1841.92 కోట్లతో అభివృద్ధి మరియు అప్గ్రేడేషన్ పనులు మంజూరు చేయబడ్డాయి.
Posted On:
01 NOV 2022 3:20PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ – ఉత్తరాఖండ్ రాష్ట్రాలను (మొరాదాబాద్ – అమ్రోహ జిల్లాలోని కాశీపూర్ బైపాస్ తో సహా) కలుపుతూ ఎన్ హెచ్- 734కు సంబంధించిన మొరాదాబాద్- ఠాకూర్వాడ్ – కాశీపూర్ సెక్షన్ ను ఇపిసి విధానం కింద రూ. 1841.92 కోట్ల వ్యయంతో అభివృద్ధి, మెరుగుపరిచే పనులు మంజూరు చేశారు.
దాదాపు 33.724 కిమీల పొడువైన (ఫ్లెక్సిబుల్ పేవ్ మెంట్ తో సహా) ఈ అభివృద్ధి పనులను 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వరుస ట్వీట్ లలో తెలిపారు. మొరాదాబాద్ బైపాస్ కారిడార్ ఎన్ హెచ్ -734, అంటే, మొరాదాబాద్ – కాశీపూర్ హైవేను అనుసంధానం చేయడం ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఢిల్లీ నుంచి మీరట్, బరేలీ, మొరాదాబాద్ కు రాకపోకలు సజావుగా ఉంటాయని, రాంనగర్ మీదుగా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కు మరింత అనుసంధానం అవుతుందని మంత్రి వెల్లడించారు.
***
(Release ID: 1872881)