రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0 పురోగతిని సమీక్షించిన ఎంఓఆర్‌టిహెచ్‌ కార్యదర్శి కార్యక్రమ స్పూర్తికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశం

Posted On: 29 OCT 2022 3:17PM by PIB Hyderabad

ఎంఓఆర్‌టిహెచ్‌  కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ శనివారం హైబ్రిడ్ మోడ్‌లో "ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0" పురోగతిని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇది అక్టోబర్ 2న ప్రారంభమై అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది.

 

image.png

శ్రీమతి ఉపాధ్యాయ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఎంపీ రిఫరెన్స్‌లు, పీఎంవో రిఫరెన్స్‌లు, ప్రజా ఫిర్యాదులు, పార్లమెంట్ హామీలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు తదితరాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కార్యక్రమ లక్ష్యం తేదీ 31 అక్టోబర్, 2022 నాటికి కార్యాలయ ఆవరణలు, టోల్ ప్లాజాలు మొదలైనవి స్ఫూర్తికి అనుగుణంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

"ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0"లో భాగంగా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించడం నుండి ఎంఆర్‌టీహెచ్‌, ఎన్‌హెచ్‌ఏఐ,ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌, ఐఆర్‌సి మరియు ఐఏహెచ్‌ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసుల వద్ద పరిశుభ్రతను నిర్వహించడం వరకు చర్యలు తీసుకుంటోంది.  హైవే వినియోగదారుల సౌకర్యార్థం జాతీయ రహదారిని గుంతలు లేకుండా ఉండేలా మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

 

image.png

ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 29 వరకు 694 ఎంపీ రిఫరెన్స్‌లలో 553, 1,049 పబ్లిక్ గ్రీవెన్స్‌లో 993, 16 పీఎంఓ రిఫరెన్స్‌లలో 12, 28 రాష్ట్ర ప్రభుత్వ రిఫరెన్స్‌లలో 26, అలాగే 7,060 ఫిజికల్ ఫైల్‌లు డిస్పోజ్ చేయబడ్డాయి. టోల్ ప్లాజాలు, ప్రాంతీయ కార్యాలయాలు మరియుఎంఆర్‌టీహెచ్‌, ఎన్‌హెచ్‌ఏఐ,ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌కు చెందిన పిఐయు/పిఎంయులతో సహా 2,466 స్థానాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమ సమయంలో స్క్రాప్‌లను పారవేయడం ద్వారా మంత్రిత్వ శాఖ రూ.7.07 లక్షలు ఆర్జించింది. స్క్రాప్‌లను తొలగించిన తర్వాత 1,936 చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయబడింది.

సమీక్షా సమావేశానికి కార్యదర్శితో పాటు, అదనపు కార్యదర్శి (హైవేస్) శ్రీ అమిత్ కుమార్ ఘోష్, జెఎస్‌ (కోఆర్డినేషన్) మరియు నోడల్ అధికారి శ్రీ కమలేష్ చతుర్వేది, జెఎస్‌ (మీడియా) శ్రీ ఎస్‌.పి. సింగ్ మరియు ఎంఓఆర్‌టిహెచ్‌ మరియు ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎంఆర్‌టీహెచ్‌, ఎన్‌హెచ్‌ఏఐ,ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌కు చెందిన ఫీల్డ్ ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.


 

***


(Release ID: 1872034)
Read this release in: English , Urdu , Hindi , Tamil