సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 2.0లో 2వ వారంలో సాధించిన పురోగతిని సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన సంతృప్తిని వ్యక్తం చేసారు మరింత మెరుగైన విధానం కోసం పిలుపునిచ్చారు
స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి మరియు పెండెన్సీని కనిష్టీకరించడానికి మంత్రిత్వ శాఖలు/విభాగాలలో అద్భుతమైన ఉత్సాహం కనిపించింది
స్వచ్ఛతా ప్రచారం 37899 ప్రచార స్థలాలలో విజయవంతంగా నిర్వహించబడింది
27.25 లక్షల ఫైళ్లు సమీక్షించబడ్డాయి మరియు 5.22 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయబడింది
చెత్త పారవేయడం ద్వారా ఇప్పటివరకు రూ. 233.54 కోట్లు ఆర్జించబడ్డాయి, 2,28,745 ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి, 4201 ఎం పి యొక్క రిఫరెన్స్లకు సమాధానం ఇవ్వబడింది మరియు 480 నియమాలు సడలించబడ్డాయి
నాడు పోస్టు చేయడమైనది:
18 OCT 2022 5:04PM by PIB Hyderabad
కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్, భారతదేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న ప్రత్యేక ప్రచారం 2.0 యొక్క 2వ వారం పురోగతిని సమీక్షించారు మరియు అక్టోబర్ 2-16 2022 మధ్య కాలంలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు.
స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి మరియు పెండింగ్ను తగ్గించడానికి మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్లో అద్భుతమైన ఉత్సాహం కనిపిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. "ఇటువంటి ప్రయత్నాలు వినూత్నమైనవి మరియు ప్రశంసించదగినవి మాత్రమే కాదు, ముఖ్యంగా మన పరిసరాలను మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రాథమిక పౌర కర్తవ్యాన్ని గుర్తుచేస్తాయి" గౌరవ ప్రధాని తన ట్వీట్లో మాటల నుండి ప్రేరణ పొందాలని ఆయన అధికారులను కోరారు.
ప్రత్యేక ప్రచారం 2.0 అక్టోబర్ 2-31, 2022 నుండి రెండు వారాల అమలును పూర్తి చేసింది. అక్టోబర్ 2-16, 2022 మధ్య కాలంలో, రిమోట్ అవుట్స్టేషన్ కార్యాలయాలు, విదేశీ మిషన్లు మరియు పోస్ట్లు, అటాచ్డ్ మరియు సబార్డినేట్ ఆఫీసులు మరియు పౌర సమాజ కేంద్రీకృత స్వచ్ఛతా కార్యక్రమాలలో ప్రత్యేక ప్రచారం 2.0 అమలు చేయబడింది.
ప్రత్యేక ప్రచారం 2.0 ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛత కోసం ఒక ఉద్యమాన్ని సృష్టించిన వేలాది మంది అధికారులు మరియు పౌరుల నుండి విస్తృతంగా పాల్గొనడం జరిగింది 2 వారాల్లో, పరిమాణం మరియు స్థాయిలో సంపూర్ణమైనది. క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు భారత ప్రభుత్వ కార్యదర్శులు ప్రత్యేక ప్రచారం 2.0లో పాల్గొని, అమలులో నాయకత్వం మరియు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2 వారాల్లో, తపాలా శాఖ కు చెందిన 11037 పోస్టాఫీసుల్లో, రైల్వే మంత్రిత్వ శాఖ కు చెందిన 3923 రైల్వే స్టేషన్లలో, ఫార్మాస్యూటికల్స్ విభాగం కు చెందిన 5123 ప్రచార స్థలాలలో, రక్షణ శాఖ కు చెందిన 3923 ప్రచార స్థలాలలో మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2364 ప్రచార స్థలాలలో 2 వారాల్లో పరిశుభ్రత ప్రచారాన్ని నిర్వహించింది.
|
ఎస్ నెం
|
వర్గం
|
ప్రత్యేక ప్రచారం 2.0
పురోగతి
అక్టోబర్ 16, 2022
|
|
1
|
స్వచ్ఛత ప్రచార స్థలాలు
|
37899
|
|
2
|
రికార్డుల నిర్వహణ:
ఫైల్లు సమీక్షించబడ్డాయి (భౌతిక ఫైల్లు + ఇ-ఫైళ్లు)
|
27.25 lac
|
|
3
|
ప్రజా సమస్యలు + అప్పీల్స్ పరిష్కరించబడ్డాయి
|
228745
|
|
4
|
సంపాదించిన ఆదాయం (రూ. కోట్లు)
|
Rs. 233.54 cr
|
|
5
|
ఖాళీ చేసిన స్థలం (లక్ష చదరపు అడుగులు)
|
5.22 లక్షల చదరపు అడుగులు
|
|
6
|
ఎం పి యొక్క సూచనలు
|
4201
|
|
7
|
నియమాలు/ ప్రక్రియలను సులభతరం చేయడం
|
480
|
ప్రమాణీకరణ యాప్/ జీవన్ ప్రమాణ్ యాప్ ప్రచారం
ఆరోగ్యం మరియు ఆరోగ్య కేంద్రాలు - చేతుల పరిశుభ్రత కోసం ప్రచారం
డబ్ల్యు సి డి - క్లీన్ వన్ స్టాప్ సెంటర్ల కోసం స్వచ్ఛత ప్రచారం
ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు - అస్సాంలో ఎం సేవ (m-Sewa( యాప్
సి బీ ఐ సి - ఆఫీస్ మెరుగుదల, రికార్డుల నిర్వహణ పద్ధతులు.
సి బీ డీ టీ – పౌరుల సేవ చర్య కోసం భారతదేశం అంతటా ఆయాకార్ సేవా కేంద్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ఏ ఎస్ కే కేంద్రాలు, జీరో పీ జీ లక్ష్యాలు, ఎంటీస్/ డి ఈ ఓ ల కోసం యూనిఫారాలు
యువజన వ్యవహారాలు – ఎన్ వై కే ఎస్ / ఎన్ ఎస్ ఎస్ యొక్క వాలంటీర్లు భారతదేశం అంతటా ఒకే వినియోగ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పారవేసారు
సైన్స్ & టెక్నాలజీ – డీ పీ సీ సి డేటాబేస్తో అనుసంధానించబడిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ పరికరం, టెక్నాలజీ భవన్లో మెకనైజ్డ్ క్లీనింగ్
ల్యాండ్ రిసోర్సెస్ - శివాజీ స్టేడియం కార్యాలయ ఆవరణలో రెజువ్ యోగా సెంటర్
డీ ఏ పీ ఆర్ జీ - 3 ఆర్ కియోస్క్ మహిళా ఎస్ హెచ్ జి చే స్థాపించబడింది, 1908, 1917 మరియు 1947 యొక్క చారిత్రక పత్రాల పరిరక్షణ
లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ - ఆర్ ఓ, గోరఖ్పూర్లో వృద్ధాప్య పింఛనుదారుల కోసం వీల్చైర్ సౌకర్యాన్ని ప్రారంభించడం, ఫైళ్ల డిజిటలైజేషన్
సంస్కృతి - అండమాన్ & నికోబార్ మరియు జగదల్పూర్లోని మారుమూల ప్రాంతాలతో సహా అన్ని సంస్థలు పాల్గొన్నాయి
ప్రత్యేక ప్రచారం 2.0 యొక్క మిగిలిన కాలంలో స్వచ్ఛతను సంస్థాగతీకరించడం మరియు పెండింగ్ను తగ్గించడం అనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అధికారులు మరియు సంస్థలు అవిశ్రాంతంగా కృషి చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్రచారం 2.0 అక్టోబర్ 31, 2022న రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున ముగుస్తుంది
***
(రిలీజ్ ఐడి: 1868995)
సందర్శకుల సూచీ సంఖ్య : : 198