ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాత్యాయని మాత ఆశీస్సుల కోసం ప్రార్థించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 OCT 2022 9:26AM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి నవరాత్రి ఉత్సవ కాలం లో కాత్యాయని మాత భక్తజనులు అందరి కి ఆ దేవి శుభాశీస్సులు ప్రాప్తించాలంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రార్థన చేశారు. అందరి కి సంకల్ప బలం మరియు ఆత్మవిశ్వాసం తాలూకు దీవెన లు కూడా దక్కాలి అని ఆయన ఆకాంక్షించారు. దేవత కు సంబంధించిన స్తుతి ని సైతం ఆయన శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా

కాత్యాయనీ చ శుభదా దేవీ దానవఘాతినీ

దుర్గా మాత యొక్క కాత్యాయనీ స్వరూపం అత్యంత అద్భుమైందీ, అలౌకికమైందీను. ఈ రోజు న ఆమె ను ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరి కి నూతన ఆత్మబలం మరియు ఆత్మవిశ్వాసం తాలూకు ఆశీర్వాదాలు లభించు గాక.. ఇదే నేను కోరుకొంటున్నది.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1864127) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam