సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పెన్షనర్ల సులభతర జీవనం "ఈజ్ ఆఫ్ లివింగ్" కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ను అభివృద్ధి చేయనున్న పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ


పింఛను ఫిర్యాదులకు ప్రాధాన్యతపై ఇక పరిష్కారం

పిఎన్‌బి సిపిపిసిలు డిఓపిపిడబ్ల్యుతో సమన్వయం చేసుకుంటూ పెన్షనర్ల సంక్షేమంలో
పరివర్తన సంస్కరణలకు ఊతం ఇస్తాయి

Posted On: 30 AUG 2022 3:35PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపీపీడబ్ల్యూ) కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస్ ఈ రోజు రెండు రోజుల బ్యాంకర్ల అవగాహన కార్యక్రమాన్ని అమృత్‌సర్‌లో ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సీజీఎం శ్రీ గౌరీ ప్రసాద్ శర్మ, డిఓపీపీడబ్ల్యూ జాయింట్ సెక్రటరీ శ్రీ ఎస్ ఎన్ మాథుర్, సీపీఏఓ సీసీపీ శ్రీ భూపాల్ నందా,  పంజాబ్ నేషనల్ బ్యాంకు జీఎం శ్రీ పర్వీన్ గోయల్,ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సి;పీపీసిలు, పెన్షన్ వ్యవహారాలు చూసే 50 మందికి పైగా అధికారులు ఈ 2-రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా అందించే సేవలు, వాటి అనుభవాలను  శ్రీ వి శ్రీనివాస్, తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ పోర్టల్ భవిష్య, వివిధ బ్యాంకుల పెన్షన్ పోర్టల్‌లను లింక్ చేయడం, పెన్షనర్లు, ప్రభుత్వం, బ్యాంకర్‌ల మధ్య అరమరికలు లేని పరస్పర అవగాహనను, సంభాషణను చేసుకోడానికి ఒక వ్యవస్థ రూపకల్పన జరగడం గురించి ఆయన వివరించారు. 

శ్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పిఎన్‌బితో పాటు ఇతర బ్యాంకుల సహకారంతో డిజిటల్ సిస్టమ్‌లను రూపొందించడానికి డిపార్ట్‌మెంట్ మొదటి డెలివరీబుల్స్‌గా సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు.  పిఎన్‌బి ద్వారా ప్రక్రియ, వ్యక్తులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ 2014లో ప్రారంభమైంది. ఇది ఆధార్ ఆధారిత బయో-మెట్రిక్ పరికరాలు, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కి చెందిన 1,90,000 గ్రామీణ డాక్ సేవక్స్, బ్యాంకుల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ నవంబర్, 2021లో ప్రారంభమైంది. ఇది పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే విధానాన్ని మారుస్తుంది. ఫిన్‌టెక్‌ని చాలా పెద్ద పద్ధతిలో ఉపయోగించడం వల్ల పెన్షనర్‌ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.

 

పెన్షనర్లు మరియు కుటుంబ పింఛనుదారుల "ఈజ్ ఆఫ్ లివింగ్"ని పెంపొందించడానికి, కేంద్ర ప్రభుత్వం పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ సంబంధిత ప్రక్రియల డిజిటలైజేషన్‌లో అనేక సంక్షేమ చర్యలు ఇన్పెన్షన్ పాలసీని చేపట్టింది. పెన్షన్ నియమాలలో అనేక సవరణలు జరిగాయి. గత 50 సంవత్సరాలలో అనేక స్పష్టమైన ఆదేశాలు/సూచనలు జారీ అయ్యాయి. వీటిని డిసెంబర్, 2021లో సెంట్రల్ సివిల్ సర్వీస్ (పెన్షన్) రూల్స్, 2021గా సంకలనం చేశారు.   ప్రధాన పెన్షన్ పంపిణీ అధికారులు బ్యాంకులు కాబట్టి, పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపీపీడబ్ల్యూ ) దీని కోసం అవగాహన కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించింది. సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్‌లు, బ్యాంక్‌లో పెన్షన్ సంబంధిత పనిని నిర్వహిస్తున్న ఫీల్డ్ ఫంక్షనరీలు. ఈ కార్యక్రమాల లక్ష్యం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించిన వివిధ నియమాలు, విధానాలపై అవగాహన కల్పించడంతోపాటు పాలసీ, విధానాలలో వివిధ సవరణల ద్వారా ఎప్పటికప్పుడు జరిగే మార్పుల గురించి క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియజేయడం. ఈ ప్రక్రియల నిర్వహణలో బ్యాంక్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెన్షనర్ల ఫిర్యాదులను అర్థం చేసుకోవడం కూడా కార్యక్రమం ఉద్దేశ్యం. లైఫ్ సర్టిఫికేట్‌ల సమర్పణలో పెన్షనర్లు, బ్యాంకులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్. ఈ అవగాహన కార్యక్రమాలు బ్యాంకు అధికారులకు భారీ సామర్థ్య నిర్మాణ వ్యాయామంగా ఉపయోగపడతాయి. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు బ్యాంకు అధికారులకు, పెన్షనర్లు/కుటుంబ పింఛనుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల కోసం ఇటువంటి మొదటి కార్యక్రమం ఆగస్ట్ 30, 31 తేదీల్లో అమృత్‌సర్‌లో నిర్వహిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో దేశవ్యాప్తంగా నాలుగు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో, 2022-23లో ఇతర పెన్షన్ పంపిణీ బ్యాంకుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

<><><><><>



(Release ID: 1855511) Visitor Counter : 133