సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
'పరిపాలనా సంస్కరణల ద్వారా ప్రజలను, ప్రభుత్వాన్ని మరింత దగ్గరగా తీసుకురావడం' అనే అంశంపై ప్రాంతీయ సదస్సు మార్గదర్శక యువ మనస్సులు ఊహించిన సమిష్టి దార్శనికతతో ముగుస్తుంది
పరిపాలన సంస్కరణల ద్వారా పౌరులను మరియు ప్రభుత్వాన్ని మరింత దగ్గరకు తీసుకురావడం' అనే అంశంపై యువ సారథ్య ఆవశ్యకత పై సమిష్టి దార్శనికత తో ముగిసిన ప్రాంతీయ సదస్సు
రెండు రోజుల పాటు జరిగిన ప్రాంతీయ సదస్సుకు సీనియర్ ఐఎఎస్ అధికారులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరు
రాబోయే ఐదు సంవత్సరాల్లో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ 500 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు పాలనలో మిడ్ కెరీర్ బిల్డింగ్ కార్యక్రమాల నిర్వహణ కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఎన్ సిజిజి/డిఎఆర్ పిజి
ఇ-ఆఫీస్ వెర్షన్ 5.6 నుంచి వెర్షన్ 7.0కు అప్ గ్రేడ్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయనున్న
డిఎఆర్ పిజి
నాడు పోస్టు చేయడమైనది:
19 AUG 2022 1:10PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 2022 ఆగస్టు 18 నుంచి 19 వరకు ఇటానగర్ లో 'పరిపాలన సంస్కరణల ద్వారా ప్రజలను, ప్రభుత్వాన్ని దగ్గరగా తీసుకురావడం' అనే అంశంపై కేంద్ర ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి ) రెండు రోజుల ప్రాంతీయ సదస్సును నిర్వహించింది.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ , శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ తో కలసి ఈ రెండు రోజుల ప్రాంతీయ సదస్సును ప్రారంభించారు.
2014 కు ముందు ఈశాన్య ప్రాంతం వరుస కేంద్ర ప్రభుత్వాల ముందు చూపు లేని విధానాల కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని, కాని 2014 లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, ఈ ప్రాంతాన్ని దేశంలోని ఇతర అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా ముందుకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రధాన మంత్రి పేర్కొన్న మేరకు ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల పని సంస్కృతి గత 8 సంవత్సరాలలో విప్లవాత్మకంగా రూపాంతరం చెందిందని .డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
తత్ఫలిత౦గా, ఇప్పుడు ఈశాన్య ప్రా౦తాల్లోని ప్రాజెక్టులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి అవుతున్నాయని, కేంద్ర నిధుల వినియోగ౦ దాదాపు నూటికి నూరు శాత౦గా ఉ౦దని మంత్రి చెప్పారు. ఈశాన్య ప్రాంతం లోని ప్రతి రాష్ట్రం దేశ రాజధానికి రైలుమార్గం ద్వారా అనుసంధానించబడిందని , ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలలో ప్రతి ఒక్కటి స్వంత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తుండగా, గౌహతి ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిందని ఆయన తెలిపారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అరుణాచల్ ప్రదేశ్ వంటి సుదూర ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇతర కొండ ప్రాంతాలు, , వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు అన్ని రంగాలలో సాధికారత కల్పించే దిశగా ఇలాంటి సదస్సులు జరుగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ ఇటానగర్ కాన్ఫరెన్స్ కు ముందు మేఘాలయలో 2019 ఆగస్టులో ఇ-గవర్నెన్స్ పై నేషనల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించిందని, అందులో ఉత్తమ విధానాలు, అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి మార్పులను పరస్పరం పంచుకుని , సమర్థవంతమైన పాలన , మెరుగైన ప్రజా సేవలను అందించడానికి వాటిని ఉపయోగించుకోవడానికి ఇ-గవర్నెన్స్ పై 'షిల్లాంగ్ డిక్లరేషన్' ను ఆమోదించడం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం , సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్ సహకారంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్స్ ఈశాన్య రాష్ట్రాలకు మొట్టమొదటి జిల్లా సుపరిపాలన సూచికను అభివృద్ధి చేసిందని, ఇది జాతీయ సుపరిపాలన సూచిక తరహాలో జిల్లాల్లో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈశాన్య రాష్ట్రాలకు మొట్టమొదటిదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి జిల్లా ర్యాంకింగ్స్ ను నెలవారీ ప్రాతిపదికన పర్యవేక్షించడానికి , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పనితీరును బెంచ్ మార్క్ చేయడంలో సహాయపడటానికి ఒక జిల్లా సుపరిపాలన పోర్టల్ ను అభివృద్ధి చేయడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని డిఎఆర్ పిజి యోచిస్తోందని ఆయన చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ జిల్లా సుపరిపాలన సూచిక తరహాలో ఈశాన్య ప్రాంతం కోసం వార్షిక మెరుగుదలలను ట్రాక్ చేసే ఒక ఆన్ లైన్ సుపరిపాలన సూచికను నిర్మించడం వాంఛనీయం అని, అప్పుడు దీనిని డిజిటల్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించవచ్చని అన్నారు.
తూర్పు ఆసియాకు అరుణాచల్ ను ప్రధాన ద్వారంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. జాతీయ భద్రతకు సంబంధించి అరుణాచల్ పాత్ర కు అనుగుణంగా ఆధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రకృతి అరుణాచల్ కు చాలా సంపదను ప్రసాదించిందని, అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్లడానికి కేంద్రం కూడా ప్రయత్నిస్తోందని చెప్పారు.
ఈ ఎంఒయు ప్రకారం, ప్రతి జిల్లా పనితీరును నెలవారీగా పర్యవేక్షించడానికి , పనితీరును బెంచ్ మార్క్ చేయడంలో సహాయపడటానికి ఒక 'జిల్లా సుపరిపాలన పోర్టల్'ను అభివృద్ధి చేయడానికి డిఎఆర్ పిజి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు, అంతేకాకుండా ఇ-ఆఫీస్ వెర్షన్ 5.6 ను దశలవారీగా ఇ-ఆఫీస్ వెర్షన్ 7.0 కు అప్ గ్రేడ్ చేయడంలో రాష్ట్రానికి సహాయపడటం జరుగుతుందని తెలిపారు.
అంతేకాకుండా, డిఎఆర్ పిజి ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాబోయే ఐదేళ్లలో అరుణాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు చెందిన 500 మంది అధికారుల కోసం పరిపాలనలో మిడ్-కెరీర్ బిల్డింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఇటానగర్ లో రెండు రోజుల పాటు ప్రాంతీయ సదస్సును నిర్వహించినందుకు గాను డిఎఆర్ పిజి కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ ను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.
రెండు రోజుల ప్రాంతీయ సదస్సు
ప్రారంభోత్సవంలో అరుణాచల్ ప్రదేశ్
ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ మాట్లాడుతూ, పరిపాలనలో మార్పు తీసుకురావడానికి,
ప్రజలకు మరింత చేరువ కావడానికి పరిపాలనా సంస్కరణలు అవసరమని, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకత , జవాబుదారీతనం, వేగంగా ఫైళ్ల ను పరిష్కరించడం కోసం నిరంతరం
సంస్కరణలను అమలు చేస్తోందని చెప్పారు.
“ప్రభుత్వం - ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రభుత్వ అధికారులకు సౌలభ్యం కల్పించడం , సన్నద్ధం చేయడం లో ఈ సదస్సుకు చాలా ప్రాముఖ్యత ఉంది. సమర్థవంతమైన పారదర్శక పాలన కోసం ఇ-ఆఫీస్ వ్యవస్థను అత్యుత్తమ సాంకేతిక జోక్యాలలో ఒకటిగా పేర్కొంటూ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం "డిజిటల్ ప్లాట్ఫారమ్లో నిబద్ధతతో తన కార్యాలయాలను ఆన్-బోర్డింగ్ చేస్తోంది" అని శ్రీ పెమా ఖండూ ఈ సందర్భంగా శ్రీతెలియజేశారు.
2022-23ను ఈ-గవర్నెన్స్ సంవత్సరంగా ప్రకటించామని, ఇప్పటికే రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్లో 100 శాతం ఈ-ఆఫీస్ ను అమలు చేశామని, ఈ-అసెంబ్లీ, ఈ-క్యాబినెట్ మాడ్యూల్స్ ను అమోదించామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 17 ఈ-ప్రగతి సమీక్షా సమావేశాలు నిర్వహించామని, ఇందులో 200కు పైగా ప్రాజెక్టులు, పథకాలను డిప్యూటీ కమిషనర్లు, లైన్ డిపార్ట్మెంట్లతో సమీక్షించామని తెలిపారు.
ఈ-ఆఫీస్ ప్లాట్ ఫామ్ లో ఆన్ బోర్డింగ్ కోసం ప్రభుత్వం 22 సెక్టార్లను గుర్తించిందని, జిల్లాలతో సహా మిగిలిన కార్యాలయాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి బోర్డులోకి రావాలని ఆదేశించినట్లు శ్రీ ఖండూ తెలిపారు.
‘‘ఇప్పటి వరకు 8,10,350 ఫైళ్లను ఈ-ఆఫీసుల ద్వారా తరలించామని, ఫైల్ కదలిక పారదర్శకంగా, వేగంగా మారిందని చెప్పారు. ఇది జవాబుదారీతనానికి కూడా దారి తీసిందని, ఎందుకంటే ఇప్పుడు ఏ విభాగంలో లేదా ఎవరి టేబుల్ పై ఒక నిర్దిష్ట ఫైలు పెండింగ్ లో ఉందో గుర్తించడం సులభం" అని ఆయన అన్నారు. సుపరిపాలనపై సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందుకు డిఎఆర్ పిజి కి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
ఇటానగర్ లో ప్రాంతీయ సదస్సు
నిర్వహించినందుకు గాను గౌరవ ముఖ్య మంత్రిని, ప్రధాన కార్యదర్శిని శ్రీ వి. శ్రీనివాస్ అభినందించారు. గరిష్ఠ పాలన-కనీస ప్రభుత్వం అనే ప్రభుత్వ విధానానికి సిటిజన్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ అత్యుత్తమ నమూనా అని ఆయన అన్నారు. ‘‘సంస్థల డిజిటల్ మార్పు ద్వారా దీనిని సాధించవచ్చు. పరిపాలనా సంస్కరణలు చురుకైన, సహకారాత్మక అనుసంధానిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడాలి‘‘ అని అన్నారు. జిల్లా సుపరిపాలన సూచికను అభివృద్ధి చేయడానికి డిఎఆర్ పిజి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని, ఇది ఎన్ ఈ రాష్ట్రాలకు మొట్టమొదటిదని ఆయన అన్నారు.ఇది డేటా రీకాన్సిలేషన్ చివరి దశలలో ఉంది త్వరలో ప్రయోగానికి సిద్ధంగా ఉంటుంది. భారత ప్రభుత్వం విజన్ India@2047 రూపొందిస్తోంది. డా. జితేంద్ర సింగ్ డి.ఎ.ఆర్.పి.జి అడ్వైజరీ గ్రూప్ ఆన్ గవర్నెన్స్ పైన, యువ అధికారుల పైన దృష్టి సారించారు.విజన్ India@2047 రూపొందించడంలో డిఎఆర్ పిజి కోసం నాలెడ్జ్ పార్టనర్ గా డాక్టర్ ఎస్ ఎన్ త్రిపాఠి ఐఐపిఎ లో ఎంతో కృషి చేశారు.2022 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి గౌరవ ప్రధాన మంత్రి యువ అధికారులందరికీ, జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన సందేశం మనం విన్నాం.
"జై అనుసంధాన్" - మిషన్ ఇన్నోవేషన్ అనే దార్శనికతను గౌరవ ప్రధాన మంత్రి తెలియజేశారు. దేశాన్ని మార్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ నమూనాలను రూపొందించడం ద్వారా పాలనలో నూతన ఆవిష్కరణల కోసం ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపుకు జిల్లా కలెక్టర్లు ప్రతిస్పందించాలి‘‘ అని శ్రీ వి. శ్రీనివాస్
అన్నారు.
ఈ ప్రాంతీయ సదస్సును ఉద్దేశించి అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మెయిన్ , శ్రీ ధర్మేంద్ర, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి; శ్రీ లోక్ రంజన్, కార్యదర్శి, డిఒఎన్ఇఆర్; శ్రీ ఎన్.బి.ఎస్ రాజ్ పుత్, జాయింట్ సెక్రటరీ, ఎ.ఆర్.పి.జి. కూడా ప్రసంగించారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి (ఏఆర్) అజయ్ చాగ్తీ ప్రారంభ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.
ఈ రెండు రోజుల సదస్సులో పరిపాలనలో సంస్కరణలకు సంబంధించి- ఈశాన్య రాష్ట్రాలలో పబ్లిక్ గ్రీవియెన్స్ రిడ్రెసల్, ఇ-ఆఫీస్; ఈశాన్య రాష్ట్రాల్లో సుపరిపాలన విధానాలు; జిల్లా సుపరిపాలన సూచిక, సుపరిపాలన పద్ధతుల పై ఐదు సాంకేతిక సెషన్లు నిర్వహించారు.
మొదటి రోజు, ఐఐపిఎ డిజి శ్రీ ఎస్.ఎన్. త్రిపాఠి, "పరిపాలనలో సంస్కరణలు" అనే అంశంపై సెషన్ -1 కు అధ్యక్షత వహించారు, ఇందులో విజన్ India@2047 పై ప్రజంటేషన్లు ఇచ్చారు.పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ లో సంస్కరణలు; మిషన్ కరమ్యోగి , అరుణాచల్ ప్రదేశ్ లో సంస్కరణలు.
నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఐటి) శ్రీ కె.డి.విజో అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజనానంతర సెషన్లలో -నాగాలాండ్ లో పబ్లిక్ గ్రీవియెన్స్ రిడ్రెసల్ అండ్ ఇ-ఆఫీస్ , సి పి జి ఆర్ ఎ ఎం ఎస్ రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవియెన్స్, పబ్లిక్ గ్రీవియెన్స్ రిడ్రెసల్ అండ్ ఇ-ఆఫీస్ ఇన్ ఎన్ ఇ స్టేట్స్, సిక్కింలో ఇ-ఆఫీస్: అరుణాచల్ ప్రదేశ్ లో సిటిజన్ సెంట్రిక్ ప్లానింగ్; తవాంగ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం. అనే అంశాలపై ప్రజంటేషన్లు ఇచ్చారు..
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్ చౌహాన్ అధ్యక్షతన ఎన్.ఇ.స్టేట్స్ లో సుపరిపాలన విధానాలు అనే అంశంపై జరిగిన సెషన్ - IIIలో, వాతావరణ మార్పు నివారణ ద్వారా నైతిక పాలన, ప్రభుత్వంలో ప్రాసెస్ రీ-ఇంజినీరింగ్ - పునరుద్ధరించిన సి పి జి ఆర్ ఎ ఎం ఎస్, చాంగ్లాంగ్ లో ప్లాస్టిక్ ష్రెడింగ్ యూనిట్, నామ్సాయ్ లో టూరిజం; ఈశాన్య హిల్ సైట్లలో నీటి సంరక్షణ - సియాల్సిర్ గ్రామం నుండి అనుభవ పాఠాలు , కోక్రాఝార్ లో కోవిడ్ మేనేజ్ మెంట్ - అంశాలపై ప్రజంటేషన్లు ఇచ్చారు..
రెండవ రోజున జిల్లా సుపరిపాలన సూచిక అనే అంశంపై సెషన్ IVలో ,డిఎఆర్ పిజిజి జాయింట్ సెక్రటరీ శ్రీ ఎన్ బిఎస్ రాజ్ పుత్ అధ్యక్షతన, అరుణాచల్ ప్రదేశ్ కు డిజిజిఐ ఇండెక్స్ , జమ్మూ కాశ్మీర్ డిజిజిఐ పోర్టల్ పై ప్రజంటేషన్ లు ఇచ్చారు..
రెండవ రోజున ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఎంహెచ్ఎ అదనపు కార్యదర్శి శ్రీ శ్రీరామ్ తరణికంటి అధ్యక్షతన జరిగిన ఐదవ సెషన్ లో - "నల్బరిలో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్" , ఎన్.ఇ. స్టేట్స్ లో ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్'; "టెక్నాలజీ ఇన్ అడ్మినిస్ట్రేషన్"; "మేఘాలయలో ఈ-ఆఫీస్"; ఈస్ట్ సియాంగ్ లో మిషన్ ఇంద్రధనుష్. పై
ప్రజంటేషన్ లు ఇచ్చారు..
పౌర కేంద్రిత పాలనను సులభతరం చేయడానికి పరిపాలనా శిక్షణ, సామర్ధ్యం పెంపు , పౌర ఇ-గవర్నెన్స్ ద్వారా మెరుగైన ప్రజా సేవల పంపిణీ, పారదర్శకమైన, జవాబుదారీతనం , పౌర-స్నేహపూర్వక సమర్థవంతమైన పరిపాలనలో ఉత్తమ విధానాల రూపకల్పన ,అమలులో అనుభవాలను పంచుకోవడానికి ఒక ఉమ్మడి వేదికను అందించే ప్రయత్నం గా ఈ సదస్సును నిర్వహించారు.
డిఎఆర్ పిజి కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస్ , అరుణాచల్ ప్ర దేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర ల ముగింపు ప్రసంగాలతో ఈ సదస్సు ముగిసింది.
*****
(రిలీజ్ ఐడి: 1853408)
సందర్శకుల సూచీ సంఖ్య : : 241