కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

16 నుంచి 31 ఆగ‌స్టు 2022 వ‌ర‌కు స్వ‌చ్ఛ‌త ప‌ఖ్వాడాను నిర్వ‌హిస్తున్న ఎంసిఎ

Posted On: 18 AUG 2022 4:58PM by PIB Hyderabad

క్యాబినెట్ సెక్ర‌టేరియేట్‌, తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఆదేశాల మేర‌కు కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) లో  16 నుంచి 31 ఆగ‌స్టు 2022 వ‌ర‌కు స్వ‌చ్ఛ‌త ప‌ఖ్వాడాను నిర్వ‌హిస్తున్నారు. 
కార్య‌క్ర‌మంలో భాగంగా ఎంసిఎలో స్వ‌చ్ఛ‌తా ప్ర‌తిజ్ఞ‌ను నిర్వ‌హించింది. కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి ఈ ప్ర‌తిజ్ఞ‌ను చేయించారు. అంతేకాకుండా, ప‌ఖ్వాడాలో భాగంగా, ఈ కాలంలో మంత్రిత్వ శాఖ‌లో -  ఫ‌ర్నిచ‌ర్‌, పాత ఫైళ్ళ‌ను స‌మీక్షించి, ప‌నికిరాని వాటిని, వ‌స్తువుల‌ను  విస‌ర్జించ‌డం, స్వ‌చ్ఛ‌త పై వెబినార్‌, స్వ‌చ్ఛ‌త పై వ్యాస‌ర‌చ‌న పోటీ స‌హా ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.  
ప‌లు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అథారిటీలు, మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని అనుబంధ కార్యాల‌యాలు, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ కింద ఉండే క్షేత్ర‌స్థాయి కార్యాల‌యాలు అన్నీ కూడా ఈ కాలంలో వివిధ కార్య‌క‌లాపాల‌ను చేప‌డుతున్నాయి. 

 

***



(Release ID: 1853057) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Hindi