ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్కు ,పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ , సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీ సలహా కమిటీల తొలి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 09 AUG 2022 11:37AM by PIB Hyderabad

కేంద్ర ఉక్కు , పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా నిన్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లు , సెకండరీ స్టీల్ పరిశ్రమ సలహా కమిటీల సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశానికి ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ హాయ మంత్రి శ్రీ

ఫగన్ సింగ్ కులస్తే కూడా హాజరయ్యారు. ఉక్కు పరిశ్రమకు చెందిన ప్రముఖ సభ్యులు, సంఘాలు, విద్యావేత్తలు, ప్రభుత్వం నుండి సీనియర్ రిటైర్డ్ అధికారులు కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AAJN.jpg

 

ఉక్కు రంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కమిటీలు చర్చించాలని నిన్న జరిగిన మొదటి సమావేశంలో నిర్ణయించారు.

 

కమిటీ సభ్యులను ఉద్దేశించి మంత్రి

ప్రసంగిస్తూ, నిర్ణయం తీసుకోవడాన్ని

భాగస్వామ్యం చేయడమే ప్రభుత్వ మంత్రం అని ఉద్ఘాటించారు. లాజిస్టిక్స్, బొగ్గు - గనులు, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలైన వాటితో సహా అనేక ఇతర రంగాల మధ్య చాలా పరస్పర చర్య ఉంది. సలహా కమిటీల ఏర్పాటు ఉద్దేశ్యం ఏమిటంటే, వాటాదారుల నుండి నేరుగా సమస్యలను మరియు చర్యలను వినడానికి వాటాదారుల క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. , ఇది ఉక్కు రంగ విజయాన్ని నిర్ధారిస్తుంది.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KM88.jpg

 

ప్రాధాన్యతా క్రమంలో వ్యవహరించాల్సిన సమస్యలను రెండు సలహా కమిటీలు గుర్తించాయి.

 

అడ్వైజరీ కమిటీలలో క్రియాశీలకంగా పాల్గొనాలని శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా పరిశ్రమను కోరారు. రంగానికి ఉమ్మడిగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ముందుకు సాగాలనే పరిశ్రమ ఆకాంక్ష పై సమావేశాల నిర్వహణ క్రమం ఆధారపడి ఉంటుందని అన్నారు.

 

మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, కమిటీల ఏర్పాటు ఆలోచనను కమిటీ సభ్యులు స్వాగతించారు. రంగం బలమైన అభివృద్ధికి , జాతీయ ఉక్కు విధానం 2017 లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

 

****


(రిలీజ్ ఐడి: 1850420) సందర్శకుల సూచీ సంఖ్య : : 164
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil