రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బ్యాటరీతో నడిచే వాహనాలు
నాడు పోస్టు చేయడమైనది:
04 AUG 2022 1:05PM by PIB Hyderabad
దేశంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ మరియు బ్యాటరీ ఆధారిత వాహనాల తయారీ మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వేగంగా అమలు చేయడం మరియు తయారు చేయడం కోసం ప్రభుత్వం 2015లో దేశవ్యాప్త ప్రాతిపదికన భారతదేశంలో (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించింది.
శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు వాహన ఉద్గారాల ద్వారా ఎదురయ్యే కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి. ప్రస్తుతం, ఫేమ్-2 ఫేమ్ ఇండియా పథకం 01 ఏప్రిల్, 2019 నుండి ఐదేళ్ల కాలవ్యవధికి మొత్తం రూ. 10,000 కోట్ల బడ్జెట్ మద్దతుతో అమలవుతోంది. ఈ దశ లో ప్రజా రవాణా మరియు భాగస్వామ్య రవాణా విద్యుదీకరణను బలోపేతం చేయడం పై ప్రత్యేక దృష్టి పెడుతుంది.
ఇంకా, దేశంలో ఎలక్ట్రిక్ వాహన రవాణాన్ని ప్రోత్సహించడానికి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:-
I.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కోసం, పునర్నిర్మాణం (రెట్రో-ఫిట్మెంట్) ద్వారా స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి 1 మార్చి 2019 న జి ఎస్ ఆర్ (GSR) 167(E) నెంబర్ తో ప్రభుత్వం ప్రకటన చేసింది. అవి ఏ ఐ ఎస్ (AIS) 123 నిబంధన ల ప్రకారం ఉండాలి.
II.ప్రభుత్వం ఇథనాల్ మరియు మిథనాల్ ఇంధనాలతో నడిచే బ్యాటరీ ఆధారిత రవాణా వాహనాలకుఎస్ ఓ (S.O.) 18 అక్టోబర్, 2018 నాటి 5333(E) పర్మిట్ అవసరాల నుండి కూడా మినహాయింపు ఇచ్చింది.
III.జి ఎస్ ఆర్ (G.S.R) 749(E) ప్రకారం , బ్యాటరీతో నడిచే రవాణా వాహనాల రిజిస్ట్రేషన్ గుర్తును ఆకుపచ్చ రంగు తో, నేపథ్యం పసుపు రంగులో మరియు అన్ని ఇతర సందర్భాల్లో ఆకుపచ్చ రంగు లో గ్రీన్ నేపథ్యం తెలుపు రంగు లో ఉండాలని ప్రభుత్వం 7 ఆగస్ట్, 2018 న ప్రకటన చేసింది.
IV.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సమిష్టి మరియు ప్రజా రవాణా లో ఎలక్ట్రిక్ వాహనాలను వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు జూలై 17, 2019 తేదీన ఒక సలహా సంచికను జారీ చేసింది.
V.బ్యాటరీలు లేని ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం మరియు రిజిస్ట్రేషన్కు సంబంధించి అన్ని రాష్ట్రాలు మరియు యు టి ( UT) లకు ప్రభుత్వం 12 ఆగస్టు 2020 తేదీన ఒక సలహా సంచిక ను జారీ చేసింది.
VI.బ్యాటరీతో నడిచే వాహనాలను ప్రోత్సహించడం కోసం అన్ని రాష్ట్రాలు మరియు యు టి (UT)లకు ప్రభుత్వం జూన్ 16, 2021 తేదీన ఒక సలహా సంచిక ను జారీ చేసింది.
బ్యాటరీతో నడిచే వాహనాల ధర సంప్రదాయ వాహనాల కంటే ఎక్కువ. అయితే, బ్యాటరీతో నడిచే వాహనాల నిర్వహణ వ్యయం సంప్రదాయ వాహనాల కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల, బ్యాటరీతో నడిచే వాహనాల మొత్తం జీవిత కాల ధర సంప్రదాయ వాహనాల కంటే తక్కువగా ఉంటుంది. బ్యాటరీతో నడిచే వాహనాలు మరియు సాంప్రదాయ వాహనాల మధ్య ధర వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఎఫ్ ఏ ఎం ఈ (FAME) ఇండియా ఫేజ్ II కింద కొనుగోలు ప్రోత్సాహకాల ద్వారా బ్యాటరీతో నడిచే వాహనాలకు ధర మద్దతు లభిస్తుంది.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన భారతదేశం ఫేజ్-II (ఫేమ్ ఇండియా ఫేజ్ II)లో వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, ఆమోదం, అనుసరణ కోసం ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పథకం కింద, 68 నగరాల్లో 2877 పబ్లిక్ ఈ వి (EV) ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయబడ్డాయి. 9 ఎక్స్ప్రెస్వేలు, 16 జాతీయరహదారుల వెంట 1576 ఈ వి (EV )ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయబడ్డాయి.
ఫేమ్ ఇండియా (FAME-India) పథకం కింద, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధరలో ముందస్తు తగ్గింపు రూపంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ప్రోత్సాహకం విలువ బ్యాటరీ సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది.
2.ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటును సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది:-
1.ఫేమ్-ఇండియా పధకం: ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ను నెలకొల్పటానికి రూ 1000 కోట్ల తో ఫేమ్ ఇండియా స్కీమ్ రెండో దశని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ(MHI) ప్రారంభించింది.
2.మార్గదర్శకాలు మరియు ప్రమాణాలు: ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు మరియు ప్రమాణాలను విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు
***
(రిలీజ్ ఐడి: 1848422)
సందర్శకుల సూచీ సంఖ్య : : 170