పర్యటక మంత్రిత్వ శాఖ

'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కింద తెలంగాణకు చెందిన విద్యార్థుల బృందం ఫరీదాబాద్ చేరుకుంది


హర్యానా సంస్కృతి, వంటకాలు మరియు జీవనశైలి గురించి నేర్చుకుంటారు

Posted On: 19 JUL 2022 3:30PM by PIB Hyderabad

'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కింద తెలంగాణ మరియు హర్యానా రెండు రాష్ట్రాల విద్యార్థులు పరస్పరం ఆయా రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అక్కడి సంస్కృతి, వంటకాలు మరియు జీవనశైలి గురించి తెలుసుకుంటున్నారు.

కార్యక్రమంలో భాగంగా హర్యానా గురించి తెలుసుకునేందుకు తెలంగాణకు చెందిన విద్యార్థుల బృందం ఈరోజు ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ బృందం హర్యానా రాష్ట్రంలో ఐదు రోజుల పర్యటిస్తుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ మరియు ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ విద్యార్థులకు 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కార్యక్రమం యొక్క విశేషాలను వివరించారు. యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ సంజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కింద ఒకరి రాష్ట్రం గురించి మరొకరు తెలుసుకునే సువర్ణావకాశం లభించిందన్నారు. " మన విద్యార్థులు అక్కడికి వెళ్లి అక్కడి సంస్కృతిని నేర్చుకోవాలని, ఇతర రాష్ట్ర విద్యార్థులు ఇక్కడి సంస్కృతిని నేర్చుకోవాలని 2 రాష్ట్రాలకు బాధ్యతలు అప్పగించిన కార్యక్రమం జరుగుతోంది" అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం కింద తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులకు కోసం ఏర్పాట్లు చేసినట్లు "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" కార్యక్రమానికి యూనివర్సిటీ నోడల్ అధికారి డాక్టర్ గుర్జిత్ కౌర్ చావ్లా తెలియజేశారు. ఈ విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హర్యానా సంస్కృతి, భాష, జీవనశైలి, వంటకాలపై అవగాహన కల్పిస్తామని ఆమె తెలిపారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి వచ్చిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా హర్యానా సంస్కృతి, భాష, జీవనశైలి మరియు వంటకాలను తెలుసుకునే అవకాశం లభించిందని చెప్పారు.


 

***



(Release ID: 1842883) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Punjabi