వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ జూలై 05న ఆహార మరియు పోషకాహార భద్రతపై జాతీయ సదస్సును నిర్వహించనుంది


ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడీఎస్‌) కింద ఉత్తమ పద్ధతుల వ్యాప్తిపై దృష్టి సారించడం మరియు పోషకాహార భద్రతను బలోపేతం చేయడానికి సమావేశం నిర్వహణ

ఫుడ్ ఫోర్టిఫికేషన్, ఫుడ్ బాస్కెట్ డైవర్సిఫికేషన్, క్రాప్ డైవర్సిఫికేషన్, ఇంటిగ్రేటెడ్ అన్నవిత్రన్ పోర్టల్ 2.0, పీడీఎస్ మరియు స్టోరేజీ రంగంలో సంస్కరణలపై చర్చ

సదస్సులో ప్రసంగించనున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, వాణిజ్యం & పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

प्रविष्टि तिथि: 03 JUL 2022 11:07AM by PIB Hyderabad

భారతదేశంలో ఆహార మరియు పోషకాహార భద్రతపై  ఒక రోజు జాతీయ సదస్సును ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ 5 జూలై 2022 మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. క్రాస్ లెర్నింగ్‌ను సులభతరం చేయడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) కింద పథకాల కోసం ఉత్తమ పద్ధతులను ప్రచారం చేయడం మరియు పోషకాహార భద్రతపై దృష్టిని బలోపేతం చేయడం ఈ సదస్సు లక్ష్యం.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, వాణిజ్యం & పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్,

సహాయ మంత్రి (సిఏ,ఎఫ్‌ అండ్ పిడీ) శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి,మరో సహాయమంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే సమక్షంలో ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్రాలు/యుటిల ఆహారం & పౌర సరఫరాల మంత్రులు కూడా హాజరవుతారు.

కాన్ఫరెన్స్‌లోని ముఖ్యాంశాలు ఫుడ్ ఫోర్టిఫికేషన్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫుడ్ బాస్కెట్, క్రాప్ డైవర్సిఫికేషన్, ఇంటిగ్రేటెడ్ అన్నవిత్రన్ పోర్టల్ 2.0, పీడీఎస్ మరియు స్టోరేజ్ సెక్టార్‌లో సంస్కరణలపై చర్చ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు విస్తృత ప్రతిరూపం కోసం కూడా భాగస్వామ్యం చేయబడతాయి.

దేశంలో ఆహార మరియు పోషకాహార భద్రతా పర్యావరణ వ్యవస్థ యొక్క పరివర్తనను సాధించడానికి సహకార సమాఖ్య యొక్క నిజమైన స్ఫూర్తితో సవాళ్లు మరియు అవకాశాలను ప్రతిబింబించే వేదికగా ఈ సమావేశం ఉపయోగపడుతుంది.

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, 2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ప్రకారం భారతదేశం యొక్క టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫుడ్-సెక్యూరిటీ ప్రోగ్రామ్. ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా 5.33 లక్షల కంటే ఎక్కువ సరసమైన ధరల దుకాణాల నెట్‌వర్క్ ద్వారా భారతదేశం అంతటా 80 కోట్ల మంది లబ్ధిదారుల ఆహార భద్రత అవసరాలను నిర్వహిస్తుంది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (ఓఎన్‌ఓఆర్‌సి)తో కలిపి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజీకేఏవై) ద్వారా ప్రభుత్వం యొక్క ఆహార భద్రత ప్రతిస్పందన ప్రజలకు జీవనాధారంగా పనిచేసింది మరియు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఉదాహరణగా ప్రశంసించబడింది.


 

*******


(रिलीज़ आईडी: 1838978) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Tamil , Kannada