ప్రధాన మంత్రి కార్యాలయం

మోర్ బీ లో గోడ కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 18 MAY 2022 2:56PM by PIB Hyderabad

గుజరాత్ లోని మోర్ బీ లో ఒక గోడ కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.  శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘మోర్ బీ లో గోడ కూలిన దుర్ఘటన హృదయ విదారకం గా ఉంది.  ఈ దుఃఖ ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రం గా కోలుకొందురు గాక;  బాధితుల కు స్థానిక అధికారి గణం సాధ్యమైన అన్ని విధాలు గాను సాయపడుతున్నారు.’’

 

‘‘మోర్ బీ లో జరిగిన దుర్ఘటన కారణం గా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది.    క్షతగాత్రుల కు  50,000 రూపాయల వంతు న అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 

 

***

DS/SH



(Release ID: 1826366) Visitor Counter : 97