ప్రధాన మంత్రి కార్యాలయం
మోర్ బీ లో గోడ కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
18 MAY 2022 2:56PM by PIB Hyderabad
గుజరాత్ లోని మోర్ బీ లో ఒక గోడ కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘మోర్ బీ లో గోడ కూలిన దుర్ఘటన హృదయ విదారకం గా ఉంది. ఈ దుఃఖ ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రం గా కోలుకొందురు గాక; బాధితుల కు స్థానిక అధికారి గణం సాధ్యమైన అన్ని విధాలు గాను సాయపడుతున్నారు.’’
‘‘మోర్ బీ లో జరిగిన దుర్ఘటన కారణం గా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయల వంతు న అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
***
DS/SH
(Release ID: 1826366)
Visitor Counter : 97
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam