వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం-NICDC పురోగతిపై శ్రీ పీయూష్ గోయల్ సమగ్ర సమీక్ష


ఇ-ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్( ఇ-ఎల్‌ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా భూ కేటాయింపు విధానంలో పూర్తి పారదర్శకతను తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు

ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పని చేయాలని NICDCని ఆదేశించిన మంత్రి

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాం - దేశమంతటికీ వర్తించే కేంద్ర ప్రభుత్వకార్యక్రమం. ఇది దేశ అభివృద్ధిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది-శ్రీ పీయూష్ గోయల్

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్‌ లు ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం లో విలీనం చేశారు, ప్రధానమంత్రి గతిశక్తి – రవాణా సామర్థ్యాన్ని నిర్ధారించడానికి జాతీయ బృహత్ ప్రణాళిక ఏర్పాటు

Posted On: 12 APR 2022 3:16PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT), NICDC నుంచి సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ గణనీయమైన పురోగతిని మంత్రికి వివరించారు. ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ కారిడార్ నెట్‌వర్క్‌ ను 11 ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్, ఆర్త్జిక వ్యవస్థలకు అనుసంధానించి, 32 ప్రాజెక్ట్‌ లను నాలుగు దశల్లో అభివృద్ధి చేసింది, తద్వారా దేశంలోని అన్ని కీలక ఆర్థిక కీలక ప్రాంతాలకు అనుసంధానాన్ని అనుమతిస్తుంది.

జాతీయ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్‌ లు ప్రధానమంత్రి గతిశక్తి - నేషనల్ మాస్టర్ ప్లాన్ పై అభివృద్ధి అవుతున్నాయని, ప్రజలు, వస్తువులు, సేవల సరళ తరలింపు కోసం వివిధ ఆర్థిక మండలాలకు క్రమబద్ధమైన ఆర్థిక, రవాణా కార్యకలాపాలు నిర్వహించడానికి  బహుళ మోడల్ కనెక్టివిటీని అందించడానికి, సమర్థవంతమైన ప్రవర్తనకు దారితీస్తుందని ఆయన వివరించారు.

ధోలేరా (గుజరాత్), షేంద్ర బిడ్కిన్ (మహారాష్ట్ర), విక్రమ్ ఉద్యోగ్‌పురి (ఎం.పి.), ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ (గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్) 4 నగరాల్లో  ప్రపంచ స్థాయి 'ప్లగ్ ఎన్ ప్లే' మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం భూమి కేటాయింపు జరుగుతోంది.

ఈ 4 నగరాల్లో దక్షిణ కొరియా, రష్యా, చైనా, బ్రిటన్, జపాన్, అలాగే భారతదేశ MSMEలతో సహా, పెట్టుబడులను ఆకర్షించడానికి మొత్తం 173 స్థలాలు (851 ఎకరాలు) కేటాయించారు, దాదాపు రూ. రూ. 16,760 కోట్లు ఉత్పత్తి చేసేందుకు . సుమారుగా 21,000 ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు అవకాశం కలుగుతుంది.

రోడ్ షోలు, ఆకర్షణీయమైన, అనుకూలమైన భూ కేటాయింపు విధానాలతో సహా కఠినమైన మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా అభివృద్ధి చెందిన ఈ నగరాల్లో పారిశ్రామిక, వాణిజ్య, నివాస రంగాలకు అభివృద్ధి చేసిన  అదనపు భూమి లభ్యతతో. సుమారుగా 5000 ఎకరాల భూ కేటాయింపులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

స్థలాలు  కేటాయించిన వారితో ఎప్పటికప్పుడు పరస్పర చర్చలు జరపాలని, తద్వారా వారు తమ ఫ్యాక్టరీల నిర్మాణాన్ని లేదా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడంలో తప్పనిసరిగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో వారికి  సహాయపడాలని మంత్రి ఆదేశించారు. పరిశ్రమలకు భూమి అందుబాటులోకి వచ్చే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

భూకేటాయింపు విధానంలో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి అన్ని ప్రాజెక్టుల్లో  ఆన్లైన్ భూ నిర్వహణ వ్యవస్థ  (ఈ-ఎల్‌ఎంఎస్) అమలు చేయాలని, కేంద్రీకృత  డ్యాష్‌బోర్డ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.

“నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ పాన్ ఇండియా కార్యక్రమం, ప్లగ్ అండ్ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి దేశంలో ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుందని,  దేశం మొత్తం అభివృద్ధిపై డొమినో ప్రభావాన్ని చూపుతుందని, పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మంత్రి వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం గౌరవప్రదమైన ప్రధాన మంత్రి దృష్టి”. "పోటీతత్వం, ఉద్యోగాల కల్పనను పెంచడానికి ప్రపంచ స్థాయి తయారీ, పెట్టుబడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి NICDC సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పని చేయాలి." అని మంత్రి జోడించారు.

 

********

 



(Release ID: 1816274) Visitor Counter : 191


Read this release in: English , Urdu , Marathi , Hindi