అణుశక్తి విభాగం
భారతదేశ అణు కార్యక్రమం జీవన నాణ్యతను మెరుగు పరచడం కోసమే తప్ప మానవ జీవితానికి హాని కలిగించడం కోసం కాదన్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ పునర్నిర్మించిన జాయింట్ హిందీ సలాహ్కార్ సమితి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి
నిష్ణాతులైన అనువాదకుల ద్వారా హిందీ, మాతృభాషలో సరైన అనువాదం ద్వారా అంతరిక్షం, అణు సాంకేతిక పరిజ్ఞానం అత్యున్నత విజయాలు సామాన్యులకు చేరుకోవాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
09 APR 2022 5:53PM by PIB Hyderabad
కేంద్ర శాస్గ్త్ర, సాంకేతిక సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత); సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) భూ విజ్ఞానం ; ప్రధానమంత్రి కార్యాలయం వ్యవహారాలు, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పింఛన్లు, అణుశక్తి , అంతరిక్ష మంత్రి ఐన డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ భారతదేశ అణు కార్యక్రమం మన జీవన నాణ్యతను మెరుగు పరచడం కోసమే తప్ప మానవ జీవితానికి హాని కలిగించడం కోసం కాదని అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడం ఆధారంగా డాక్టర్ హోమీ భాభా అణు శక్తి
కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుండి భారతదేశం సుదీర్ఘ ప్రయాణాన్ని చేసింది. "సంకల్ప్ సే సిద్ధి"గా డాక్టర్ భాభా-గొప్ప ప్రతిజ్ఞను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్ డిపార్ట్ మెంట్ పునర్నిర్మించిన ‘జాయింట్ హిందీ సలాహ్కార్ సమితి’ సమావేశానికి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు.
విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, ఆహార సంరక్షణ, మెరుగైన విత్తన రకాలు, నీటి శుద్ధీకరణ సాంకేతికతలు, పట్టణ వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికతలు, రేడియో ఐసోటోప్ల పారిశ్రామిక వినియోగం వంటి కీలక రంగాలలో అణుశక్తి , శాస్త్ర సాంకేతిక, రేడియేషన్-ఆధారిత కార్యక్రమాలు, ముఖ్యంగా పెట్రోలియం పరిశ్రమలో రేడియేషన్ సాంకేతికతలు గణనీయమైన పాత్ర పోషించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే, అణుశక్తి సంబంధించిన చాలా సామాజిక అనువర్తనాలు ప్రజలకు పెద్దగా తెలియడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
గడ్డలు , ట్యూబ్లలో వ్యర్థాలు మొలకెత్తకుండా నిరోధించడం, తృణధాన్యాలు, పప్పులు , ధాన్యాలలోని క్రిమిసంహారక, పొడి సుగంధ ద్రవ్యాల సూక్ష్మజీవుల నిర్మూలన (పరిశుభ్రత) మొదలైన వాటి సంరక్షణ/ జీవితకాలం పొడిగింపు కోసం రేడియేషన్ మోతాదుల వాడకంతో గామా రేడియేషన్ టెక్నాలజీ ఉపయోగం ఉందని కూడా మంత్రి తెలియజేసారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) COVID-19 రోగుల కోసం భారతదేశం-మొట్టమొదటి దేశీయ, తక్కువ ఖర్చుతో కూడిన, వైర్లెస్ భౌతికావసరాల పారామితుల పర్యవేక్షణ వ్యవస్థ అయిన COVID BEEP వంటి కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చింది.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అనేక క్యాన్సర్ ఆసుపత్రులను నడుపుతున్న ముంబై-టాటా సెంటర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పారు. టాటా ట్రస్ట్ సహకారంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , టాటా మెమోరియల్ సెంటర్ బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్లలో అదనపు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్, భాషా కమిటీ , డిపార్ట్మెంట్ సభ్యులకు వృత్తిపరమైన అనువాదకుల ద్వారా హిందీ , స్థానిక భాషలలో సరైన అనువాదం ద్వారా అంతరిక్షం, అణు సాంకేతిక పరిజ్ఞాన విజయాలు సామాన్యులలో ప్రాచుర్యం పొందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. హిందీ, ప్రాంతీయ భాషలలో విజ్ఞానశాస్త్ర పాఠ్యపుస్తకాలు , సాహిత్యం-సరైన అనువాదం అవసరం కూడా వారు నొక్కి చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో, అమిత్ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖలో భాగమైన రాజ్భాషా విభాగం, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో చాలా వరకు జరుగుతున్న అధికారిక పనుల వల్ల దేశం గొప్ప మార్పును చూస్తోందని అన్నారు. హిందీ యువతలో సైన్స్ పట్ల ప్రేమను పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లప్పుడూ స్థానిక భాషలను ఉపయోగించి సైన్స్ కమ్యూనికేషన్ను పెద్దఎత్తున ప్రోత్సహించేవారని, భాష అవరోధంగా ఉండకూడదని, సులభతరం చేయాలని మంత్రి నొక్కిచెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సామాన్యులకు "సౌలభ్యం" అందించడానికి అంతరిక్ష సాంకేతికతను విభిన్న రంగాల్లో వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, నేలలు, జలవనరులు, భూ వినియోగం/భూమి విస్తీర్ణం, గ్రామీణాభివృద్ధి, భూమి , వాతావరణ అధ్యయనాలు, భూగర్భ విజ్ఞానం, పట్టణ మౌలిక సదుపాయాలు , వైపరీత్య నిర్వహణ మద్దతు, అటవీ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో, ఖగోళ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం గురించి ఇస్రో శాస్త్రవేత్తలు కమిటీ సమావేశానికి వివరించారు. నిర్ణయ ఆధార వ్యవస్థలను వినిమయం లోకి తేవడానికి భూ అంతరిక్ష సాంకేతికతను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాం . వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో డ్రోన్ సాంకేతికత వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ఏడాది మే నుండి భోపాల్లోని గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య రంగ పాఠ్యాంశాలు కొన్ని హిందీలో బోధిస్తారని, వైద్య , శాస్త్రీయ నిపుణుల ద్వారా మొత్తం పాఠ్యాంశాలను అనువదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సలహా కమిటీ సభ్యులు డాక్టర్ జితేంద్ర సింగ్కు తెలియజేశారు.
<><><><><>
(Release ID: 1815613)
Visitor Counter : 256