శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నూతన డేలైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీలో వినూత్న, బహుశా భారత మొట్టమొదటి స్టార్టప్ను ప్రోత్సహించాలని సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్ణయం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్



కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి ,బిల్డింగ్ ఎనర్జీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డే లైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీలో స్టార్ట్-అప్ కు డి ఎస్ టి ప్రోత్సాహం


డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చట్టబద్ధ సంస్థ టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డుతో ఎమ్ఒయుపై సంతకం చేసిన ‘‘స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్" ,హైదరాబాద్


24x7ప్రాతిపదికన బేస్ మెంట్ ఇల్యూమినేషన్ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి స్కైషేడ్ కు రూ.5 కోట్లు అందించనున్న డిఎస్ టి : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 MAR 2022 5:23PM by PIB Hyderabad

 

కార్బన్ ఉనికిని తగ్గించి  భవన ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తాజా డే లైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ లో ఒక ప్రత్యేకమైన స్టార్ట్-అప్ ను ప్రోత్సహించాలని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ (స్వతంత్ర హోదా ) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

డేలైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ కు సంబంధించి  భారతదేశం లోని ఏకైక స్టార్ట్-అప్ కంపెనీ హైదరాబాద్ లోని  "స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్" కోసం భారతదేశంలో ఏకైక స్టార్ట్-అప్ కంపెనీ డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చట్టబద్ధ సంస్థ టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డుతో ఒక ఎమ్ఒయుపై సంతకం చేసింది.

 

24x7 ప్రాతిపదికన బేస్మెంట్ విద్యుద్దీకరణ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి పది కోట్ల ప్రాజెక్టులో రూ.5కోట్ల ను  టిడిబి స్కైషేడ్ కంపెనీకి ఇస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.ఏట్రియంలు , సోలార్ థర్మల్ టెక్నాలజీలను నిర్మించడానికి పెద్ద స్కైలైట్ డోమ్ ల రూపకల్పన,నిర్మాణ కార్యకలాపాలతో ప్రారంభించి మూలాలలో కంపెనీ నిమగ్నమై ఉందని ఆయన చెప్పారు.

స్టార్ట్-అప్ ఇప్పుడు మానవ కేంద్రిత- వాతావరణ అనుకూల, అన్వయిత భవన ముఖభాగాలు , సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ డే లైటింగ్ వ్యవస్థ అనే మరో రెండు సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. ఈ రెండు వ్యవస్థలు పగటి పూట కొత్త క్షితిజాన్ని ఇస్తాయి . ఈ ఉత్పత్తులు సులభంగా భరించ కలిగేవి, స్వీకరించదగినవి ఇంకా ఆర్థికంగా ఆచరణీయమైనవి.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సహజంగా పగటి పూట గదుల లోకి సహజ సూర్యకాంతి వస్తుందని, సౌర శక్తి స్పెక్ట్రమ్ 45% శక్తిని కనిపించే కాంతిగా కలిగి ఉందని, దీనిని రోజుకు సుమారు 9-11 గంటల పాటు భవన ప్రకాశానికి ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

 

ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం అని,  ఆర్థికంగా ఆచరణయోగ్యమైనదనీ, అమర్చడానికి సులభం తో పాటు దీర్ఘాయువుతో తక్కువ నిర్వహణ అవసరమని మంత్రి అన్నారు. అంతేకాక, ప్రతిపాదిత సాంకేతికతలు, ఒక భవనం కోసం భారీ మొత్తంలో సూర్యకాంతిని కోస్తుంది మరియు విద్యుత్ లైటింగ్ శక్తి వినియోగాన్ని 70-80% తగ్గించే కాంతిని నిర్మించడానికి అందుబాటులో ఉంచుకుంటాయి, దీనితో పాటు ఎయిర్ కండిషనింగ్ (కూలింగ్ లోడ్) వినియోగాన్ని తగ్గిస్తుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ప్రతిపాదిత సాంకేతికతలు, ఒక భవనానికి భారీ మొత్తంలో సూర్యరశ్మిని అందిస్తాయి . భవనం కోసం వెలుతురును అందుబాటులో ఉంచుతాయి, ఇది ఎలక్ట్రికల్ లైటింగ్ శక్తి వినియోగాన్ని 70-80% తగ్గిస్తుంది, అంతేకాకుండా ఎయిర్ కండిషనింగ్ (కూలింగ్ లోడ్) వినియోగాన్ని తగ్గిస్తుందని అన్నారు.

 

స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2014 నుండి ఈ ప్రాంతంలో పనిచేస్తోందని, ప్రభుత్వ సంస్థలు, పిఎస్ యులు, కార్పొరేట్ నుండి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా-చెన్నై, తెలంగాణ సెక్రటేరియట్, పిఎంఓ కార్యాలయం సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ, ఎన్ టిపిసి, అమెజాన్, క్యాటర్ పిల్లర్, ఐకియా, మహీంద్రా, టాటా మోటార్స్ హీరో మోటార్స్, ఎయిర్ పోర్ట్ అథారిటీతో సహా యదాద్రీ ఆలయం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, శివాలయం, బోహ్రా మసీదు మొదలైన కొన్ని మత పరమైన నిర్మాణాల వరకు  వినియోగదారుల కోసం పగటి పూట వెలుగులు నింపుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  అయోధ్య ఆలయాన్ని కూడా పగలు రాత్రి వెలిగిం చేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

 

రాజేష్ కుమార్ పాఠక్ ,టిడిబి కార్యదర్శి ఐపి అండ్ టిఎఎఫ్ఎస్ మాట్లాడుతూ, "లైటింగ్ అనేది మన రోజువారీ జీవితానికి ప్రాథమిక అవసరం అని, పగటి కాంతి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని,  ఇది చాలా శుభ్రమైన ఖర్చు-సమర్థవంతమైన శక్తి వనరు అని అన్నారు. డే లైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పగటి పూట మన విద్యుత్ అవసరాలను తీర్చడం ద్వారా, 2070 నాటికి భారతదేశాన్ని నెట్ జీరో ఉద్గార దేశంగా మార్చడానికి "పంచామృత్" వాగ్ధానాలలో ఒకదాన్ని తీర్చడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ ఒక గేమ్ ఛేంజర్ గా నిరూపితం కావచ్చని, రాబోయే సంవత్సరాల్లో పర్యావరణ స్పృహ తో కూడిన జీవన శైలి కోసం ఒక ప్రజా ఉద్యమంగా మారవచ్చని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.

 

కార్బన్ ఉనికిని తగ్గించడానికి,  భవన విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి  తమ టెక్నాలజీల  ద్వారా డే లైట్ హార్వెస్టింగ్ కు పూర్తి పరిష్కారాన్ని కంపెనీ ప్రతిపాదించింది. గ్రీన్ అండ్ నెట్ జీరో భవనాలను సృష్టించడం, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ ఎపిసిసి) కింద జాతీయ మిషన్లలో పాల్గొనడం, సహకారం అందించడం ఈ కంపెనీ లక్ష్యం.

 

పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద విస్తరణ ప్రణాళికతో, భారతదేశం స్థిరమైన ఇంధన పరిష్కారాలను సార్వత్రికంగా అందుబాటు చేసుకోవడం, గణనీయమైన ఆర్థిక, పర్యావరణ ,సామాజిక ప్రభావంతో తక్కువ కార్బన్ భవిష్యత్తును ప్రారంభించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

2022 చివరి నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి తన ఇంధన అవసరాలలో 175 జిడబ్ల్యు సామర్థ్యాన్ని సాధించడానికి దేశం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, గ్లాస్గోలో జరిగిన సిఒపి26 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పేర్కొన్నవిధంగా 2030 నాటికి 500 జిడబ్ల్యు సాధించడానికి కట్టుబడి ఉంది. వాతావరణ మార్పుల విషయం పరిశీలనకు భారత దేశ నిబద్ధతగా ఐదు అంశాల "పంచామృతం" ను భారత దేశం తరఫున శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచానికి అందించారు.

***  



(Release ID: 1802736) Visitor Counter : 195