వ్యవసాయ మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలోని ఐసిఎఆర్-ఐఎఆర్ ఐ 60వ స్నాతకోత్సవంలో కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రసంగం


ఉపాధ్యాయులు , శాస్త్రవేత్తలతో పాటు మంచి రైతులను అందించడం పై దృష్టి పెట్టాలని వ్యవసాయ సంస్థలకు శ్రీ తోమర్ విజ్ఞప్తి

అగ్రి ప్రొడక్ట్ ఎగుమతి రంగంలో భారతదేశాన్ని టాప్ 5 దేశాల్లో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం

ఆరు పండ్లు ,కూరగాయల రకాలను దేశానికి అంకితం చేసిన శ్రీ తోమర్

Posted On: 11 FEB 2022 5:56PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు న్యూఢిల్లీ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఐసిఎఆర్-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన 8 మంది విదేశీ విద్యార్థులతో కూడిన 284 మంది విద్యార్థులకు అవార్డులు, డిగ్రీలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ ఆరు పండ్లు, కూరగాయల రకాలను దేశ ప్రజలకు అంకితం చేశారు. వీటిలో రెండు రకాల మామిడి పుసా లలిమా, పుసా శ్రేష్ఠ్ , వంకాయ రకం పుసా వైభ వ్ , పాలక్ రకం పుసా విలాయతి పాలక్ , దోసకాయ వెరైటీ పుసా గైనోసియస్ దోసకాయ హైబ్రిడ్ -18, పూసా అల్పానా వెరైటీ రోజ్ ఉన్నాయి. మైక్రోబయాలజీ విభజన ద్వారా అభివృద్ధి చేసిన బయో ఫెర్టిలైజర్ 'పుసా సంపూర్ణ్' ను కూడా విడుదల చేశారు. 

 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రసంగిస్తూ, అన్ని వ్యవసాయ

సంస్థలు మంచి రైతులను అందించడంపై దృష్టి సారించాలని పిలుపు ఇచ్చారు. ఇన్ స్టిట్యూట్ లు చాలా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలను తయారు చేస్తున్నాయని, ఇది ప్రశంసనీయమైనదని ఆయన అన్నారు. ఇందువల్ల విజ్ఞానం , సాంకేతికత సంస్థలకు మాత్రమే పరిమితం అయిందని అన్నారు. సంస్థలు రైతులను కనుక తయారు చేస్తే వారు ఈ విజ్ఞానాన్ని అట్టడుగు స్థాయికి తీసుకు రాగలరని అన్నారు.  విద్యార్థులు వ్యవస్థాపకత్వ అభివృద్ధి చేపట్టాలని, వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకోవాలని శ్రీ తోమర్ విజ్ఞప్తి చేశారు.

 

వ్యవసాయ పరిశోధన రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం 10 అగ్రశ్రేణి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాలలో స్థానం  సంపాదించిందని శ్రీ తోమర్ తెలిపారు. "భారత దేశాన్ని టాప్ 5 దేశాలలో ఉంచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. మన వ్యవసాయ సంస్థల ప్రయత్నాలు, పరిశోధన లతో భారత దేశం అతి త్వరలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను‘‘ అని

మంత్రి అన్నారు.

 

రైతుల ప్రయోజనం కోసం డ్రోన్ టెక్నాలజీ ని ఉపయోగించడం పైన, వివిధ భాగస్వాములకు ఉపాధి కల్పన పైన వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ సంస్థలకు డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం 100% గ్రాంట్ గా ఇస్తోందని, తద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థలలో బోధించవచ్చని అన్నారు. డ్రోన్ కొనుగోళ్లకు గ్రాంట్ మద్దతు పొందడానికి వ్యవసాయ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులని ఆయన చెప్పారు.  డ్రోన్ టెక్నాలజీ రంగంలో దీనిని భారీ అవకాశంగా చూడాలని కొత్త గ్రాడ్యుయేట్లకు మంత్రి సూచించారు.

 

వ్యవసాయ రంగంలో మెరుగైన రకాలు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి ద్వారా ఆహారం ,పోషకాహార భద్రతను నిర్ధారించడానికి సంస్థ అందించిన గణనీయమైన సహకారాన్ని వ్యవసాయ మంత్రి ప్రశంసించారు. అవార్డు గ్రహీతలందరినీ శ్రీ తోమర్ అభినందిస్తూ , అత్మ నిర్భర్ కృషి ద్వారా అత్మ నిర్భర్ భారత్  విజయ గాధకు తోడ్పడాలని వారికి విజ్ఞప్తి చేశారు.

 

అంతకుముందు, సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె. సింగ్ మాట్లాడుతూ, సంస్థ గణనీయమైన విజయాలను వివరించారు. సంస్థ అభివృద్ధి చేసిన గోధుమ రకాలు దేశ ధాన్యాగారానికి ఏటా రూ.80,000 కోట్ల విలువైన దాదాపు 60 మిలియన్ టన్నుల గోధుమలను అందిస్తాయని తెలియజేశారు. అదేవిధంగా, సంస్థ అభివృద్ధి చేసిన బాస్మతి రకాలు భారతదేశంలో బాస్మతి సాగులో  ప్రధాన రకాలుగా ఉన్నాయి.

 

 

అదేవిధంగా, బాస్మతి బియ్యం ఎగుమతి ద్వారా సంపాదించిన మొత్తం విదేశీ మారకద్రవ్యం లో 90 శాతం వాటా (రూ. 29524 కోట్లు) అదేవిధంగా, ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బాస్మతి రకాలు భారతదేశంలో బాస్మతి సాగులో ప్రధానమైనవి, బాస్మతి బియ్యం ఎగుమతి ద్వారా లభించిన రు. 32.084 కోట్లలో  మొత్తం విదేశీ మారక ద్రవ్యం వాటా 90% (రూ. 29524 కోట్లు).  దేశంలో ఆవాలను పండించే ప్రాంతంలో 48% ఐఎఆర్ఐ రకాలతో సాగు చేస్తున్నారు. పూసా మస్టర్డ్ 25 నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం ఆర్థిక మిగులు గత 9 సంవత్సరాల్లో రూ.14323 కోట్లు (2018 ధరల వద్ద) గా అంచనా వేయబడింది.

 

 

ఈ సందర్భంగా నాబార్డ్-ప్రొఫెసర్ వి ఎల్ చోప్రా గోల్డ్ మెడల్ , ఎంఎస్ సీ, పీహెచ్ డీలకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వరుసగా శ్రీమతి దేబరాటి మొండల్, డాక్టర్ సిద్ధరూద్ మరాగల్ లకు ప్రదానం చేశారు. ప్రొఫెసర్ ఆర్.బి. సింగ్; న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ మాజీ డైరెక్టర్ డిఎస్ సి హనరిస్ కాసా కు ప్రదానం చేశారు. VI డాక్టర్ ఎ.బి.  జోషి మెమోరియల్ అవార్డును న్యూఢిల్లీలోని ఐసిఎఆర్ ఎడిజి (సీడ్స్) డాక్టర్ డి.కె.యాదవ్ కు ప్రదానం చేశారు. 2వ అత్యుత్తమ వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త అవార్డును న్యూఢిల్లీలోని ఐఎఆర్ ఐ లోని వ్యవసాయ విస్తరణ విభాగం హెడ్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.ఎన్.పడారియాకు ప్రదానం చేశారు. ఎక్స్ సిఐఐ శ్రీ హరి కృష్ణ శాస్త్రి స్మారక పురస్కారాన్ని న్యూఢిల్లీలోని ఐఎఆర్ ఐ లోని వెజిటబుల్ సైన్స్ విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.డి. మున్షీకి ప్రదానం చేశారు. ఆర్ సిఐఐ సుకుమార్ బసు మెమోరియల్ అవార్డును డైరీ కెమిస్ట్రీ డివిజన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రాజన్ శర్మకు ప్రదానం చేశారు, ఐసిఎఆర్-ఎన్ డిఆర్ ఐ, కర్నాల్ ,ఐఎఆర్ఐ బెస్ట్ టీచర్ అవార్డును న్యూఢిల్లీలోని అగ్రోనమీ విభాగం డాక్టర్ సి.ఎం.పరిహార్ కు ప్రదానం చేశారు.

 

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌదరి ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ త్రిలోచన్ మోహపాత్ర, సెక్రటరీ డిఎఆర్ ఈ , డైరెక్టర్ జనరల్, ఐసిఎఆర్ ,డీన్, జాయింట్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్) డాక్టర్ రష్మీ అగర్వాల్ కూడా హాజరయ్యారు.

 

ఈ కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, కౌన్సిల్ అదనపు డైరెక్టర్ జనరల్స్, ఇనిస్టిట్యూట్ మాజీ డైరెక్టర్లు ,డీన్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (డబ్ల్యుటిసి), డివిజన్ల అధిపతులు,  ప్రొఫెసర్లతో సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఇనిస్టిట్యూట్ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు ,సిబ్బంది వర్చువల్ మోడ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

 *****



(Release ID: 1797822) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Bengali