పర్యటక మంత్రిత్వ శాఖ
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో రూ. 1300 కోట్ల మొత్తంతో 16 ప్రాజెక్టులను మంజూరు చేసిన పర్యాటక మంత్రిత్వ శాఖః శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
07 FEB 2022 5:45PM by PIB Hyderabad
పర్యాటక స్థలాలను గుర్తించడం, అభివృద్ధి చేయడం అన్నది ప్రధానంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల భాధ్యత. అయితే, దేశంలో పర్యాటక స్థలాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు/ కేంద్ర ఏజెన్సీలు తదితర సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకం కింద నిధులను అందిస్తుంది. ఈ పథకం కింద భారత ఈశాన్య ప్రాంతంలో రూ. 1337.63 కోట్ల మొత్తంతో 16 ప్రాజెక్టులను పర్యాటక మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకం కింద అస్సాంలో 02 ప్రాజెక్టులను మంజూరు చేసింది.
ఈ సమాచారాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
(రిలీజ్ ఐడి: 1796396)
సందర్శకుల సూచీ సంఖ్య : : 115