మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎంఎంవీవై కింద ప్రయోజనం పొందిన మహిళలు

Posted On: 02 FEB 2022 5:09PM by PIB Hyderabad

మహిళా  శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)ని అమలు చేస్తోంది, దీని కింద గర్భిణీలు & పాలిచ్చే తల్లులకు (పీడబ్ల్యూ&ఎల్ఎం) ప్రసూతి ప్రయోజనాలు ₹ 5,000/- మూడు విడతలుగా అందుతున్నాయి. అయితే కొన్ని షరతులకు లోబడి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో (పీఎస్యూలు) రెగ్యులర్ ఉద్యోగంలో ఉన్నవారు లేదా ప్రస్తుతానికి ఏదైనా చట్టం ప్రకారం సారూప్య ప్రయోజనాలను పొందుతున్న వారిని మినహాయించి, అన్ని పీడబ్ల్యూ&ఎల్ఎంలకు పీఎంఎంవీవై కింద ప్రసూతి ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. బలవంతం. పీఎంఎంవీవై అనేది మహిళలకు సమగ్ర ప్రయోజనాలను అందించడానికి ఇటీవల ప్రారంభించబడిన మిషన్ శక్తి కింద ఒక భాగం. మిషన్ శక్తిపై వ్యయ ఫైనాన్స్ కమిటీ  మినిట్స్  సిఫార్సుల ప్రకారం, రెండవ బిడ్డ ఆడపిల్ల అయితేనే ఆ బిడ్డకు ప్రయోజనాలు అందించబడం జరుగుతుంది. మగపిల్లలనే కనాలనే దురాచారాన్ని నిరుత్సాహపరుస్తుంది  ఆడపిల్లను ప్రోత్సహిస్తుంది. పథకం ప్రారంభించినప్పటి నుండి  25.01.2022 వరకు పీఎంఎంవీవై కింద ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య  మొత్తం ప్రసూతి ప్రయోజనం  రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా వివరాలను ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి   స్మృతి జుబిన్ ఇరానీ లిఖితపూర్వకంగా ఈరోజు రాజ్యసభలో ఇచ్చారు. 

 

***


(Release ID: 1795267)
Read this release in: English , Urdu , Punjabi , Tamil