ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

145.16 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 58 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

98.32 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 22,775 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,781

వారపు పాజిటివిటీ రేటు 1.10 శాతం

Posted On: 01 JAN 2022 10:07AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 58,11,487 డోసులతో కలిపి, 145.16 కోట్ల డోసులను ( 1,45,16,24,150 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,55,02,407 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,87,911

రెండో డోసు

97,14,208

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,85,748

రెండో డోసు

1,69,00,338

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

49,99,80,567

రెండో డోసు

33,37,90,836

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,46,34,482

రెండో డోసు

15,09,65,213

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,14,69,025

రెండో డోసు

9,53,95,822

మొత్తం

1,45,16,24,150

 

గత 24 గంటల్లో 8,949 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,42,75,312 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.32 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 187వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 22,775 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,781. మొత్తం కేసుల్లో ఇది 0.30 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,10,855 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 67.89 కోట్లకు పైగా ( 67,89,89,110 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.10 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. 

 

 

****



(Release ID: 1786807) Visitor Counter : 133