వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులు
Posted On:
17 DEC 2021 3:16PM by PIB Hyderabad
2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి రూ.141448.05 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దేశీయపు ఎగుమతులు రూ. 210093.40 కోట్లకు చేరాయి. అంటే దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల నిష్పత్తి 0.67: 1 గా ఉంది. భారతదేశం చాలా వ్యవసాయ వస్తువులలో స్వావలంబన కలిగి ఉంది. అయినప్పటికీ వంటనూనెలు, పప్పులు, జీడి పప్పు, తాజా పండ్లు,యు సుగంధ ద్రవ్యాలను ప్రధానంగా దిగుమతి చేసుకుంటోంది. పప్పుధాన్యాల విషయమై స్వావలంబనను నిర్ధారించడానికి.. పప్పుధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ను (ఎన్ఎఫ్ఎస్ఎం)
అమలు చేస్తోంది. అంతేకాకుండా, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద పప్పుధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి రాష్ట్రాలకు నిధులు అందజేస్తున్నారు. దేశంలో అత్యవసరమైన వంట నూనెల ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఎన్ఎఫ్ఎస్ఎం- నూనె గింజల కార్యక్రమం కూడా అమలు చేయబడుతోంది. దేశంలో వంట నూనెల లభ్యతను పెంచడానికి గాను నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ-ఓపీ) ప్రారంభించబడింది. నూనెల దిగుమతి భారాన్ని తగ్గించడానికి ముడి పామాయిల్ ఉత్పత్తిని పెంచడం, పంట ప్రాంతీయ విస్తరణను ఉపయోగించడం ద్వారా దేశంలో ఎడిబుల్ ఆయిల్ లభ్యతను పెంపొందించే లక్ష్యంతో ఇది ప్రారంభించబడింది. పసుపు అధిక దిగుమతులను అరికట్టేందుకు, అనువైన ప్రాంతాలలో క్లస్టర్లలో అధిక కర్కుమిన్ కంటెంట్ ఉన్న రకాల సాగును నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మన దేశంలో పెరుగుతున్న జీడీపప్పు డిమాండ్ను తీర్చడానికి, ప్రభుత్వం అధిక దిగుబడినిచ్చే రకాలు, అధిక సాంద్రత కలిగిన మొక్కల పెంపకం, వృద్ధాప్య తోటల పునరుజ్జీవనం మరియు పందిరి నిర్వహణ మొదలైన వాటితో విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. కేంద్ర వాణిజ్య శాఖ దేశంలోని వ్యవసాయ రంగంతో సహా దిగుమతి మరియు ఎగుమతులతో విషయమై నోడల్ ప్రభుత్వ ఏజెన్సీ. దీనికి అనుగుణంగా
వాణిజ్య విధానం, కార్యక్రమాలను అభివృద్ధి చేయడం మరియు రూపొందించడం దీని బాధ్యత. వాణిజ్య శాఖలోని వివిధ సంస్థలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మరియు ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా); సుగంధ ద్రవ్యాల బోర్డు; టీ బోర్డు; కాఫీ బోర్డు; రబ్బరు బోర్డు; పొగాకు బోర్డు; ఎగుమతి తనిఖీ మండలి తదితరాలు ఉన్నాయి. అంతేకాకుండా, వ్యవసాయపు ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సాహం చేపట్టడానికి మరియు ఎగుమతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి వాణిజ్య శాఖ వివిధ ఎగుమతి ప్రోత్సాహక మండలిలు, వర్తక మరియు పరిశ్రమల సంఘాలు, రైతు-నిర్మాత సంస్థలు, సహకార సంస్థలు మొదలైన వాటితో కూడా కలిపి పని చేస్తోంది. దీనికి తోడు గుర్తించబడిన ఉత్పత్తి ఎగుమతిని ప్రోత్సహించడానికి అపేడా సంస్థ ఆధ్వర్యంలో ఒక దృష్టి పద్ధతిలో ఎనిమిది అధిక సంభావ్య వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఉత్పత్తి నిర్దిష్ట ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్లు (ఈపీఎఫ్) ఏర్పటు చేయబడ్డాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1782977)
Visitor Counter : 317