వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021–-22లో రాష్ట్రాల నుండి 326 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు


కనీస మద్దతు ధర మేరకు 25.94 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దాని విలువ రూ. 63,897.73 కోట్లు

Posted On: 09 DEC 2021 4:22PM by PIB Hyderabad

రైతుల నుండి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2021–-22లో వరి సేకరణ గత సంవత్సరాల్లో మాదిరిగానే  కనీస మద్దతు ధర మేరకు సజావుగా సాగుతోంది
08.12.2021 నాటికి  చండీగఢ్, గుజరాత్, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ  మరియు కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ నుంచి  ఖరీఫ్ మార్కెట్ సీజన్ 2021-–22లో 326.00 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు.
కనీస మద్దతు ధర మేరకు ఇప్పటి వరకు 25.94 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దాని విలువ రూ. 63,897.73 కోట్లు.

***

 



(Release ID: 1780510) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi , Tamil