నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఎంఎన్‌ఆర్‌ఈ సహాయ మంత్రి హైడ్రోజన్ ఎనర్జీ - విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సవాళ్లపై 1వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు


హైడ్రోజన్ ఎనర్జీపై చర్చల కోసం సిపిఐబి రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది

భారతదేశంలో హైడ్రోజన్ ఎనర్జీ యొక్క అన్ని కోణాలను చర్చించడానికి కీలకమైన వాటాదారులను ఒకే వేదికపైకి తీసుకురావాలని కాన్ఫరెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

Posted On: 24 NOV 2021 12:54PM by PIB Hyderabad

హైడ్రోజన్ ఎనర్జీ - విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సవాళ్లపై 1వ అంతర్జాతీయ సదస్సును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి) న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మరియు ఎన్‌టిపిసీ మద్దతుతో నవంబర్ 24-25, 2021 తేదీలలో ఢిల్లీలో నిర్వహిస్తోంది.
image.png
నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన ప్రారంభోపన్యాసంలో కాప్26లో భారతదేశాన్ని డీకార్బనైజేషన్ చేయడం పట్ల గౌరవప్రదమైన ప్రధానమంత్రి తన దృఢ నిశ్చయాన్ని నొక్కిచెప్పారని అన్నారు. 2030 నాటికి, భారతదేశం 500 డిడబ్లూ ఆర్‌ఈ లక్ష్యాన్ని కలిగి ఉంది. అలాగే భారతదేశం 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుంది. దీని కోసం మేము నిరంతరం ముందుకు సాగుతున్నాము. హైడ్రోజన్ ఎనర్జీ కోసం గరిష్ట పరిశోధన కోసం ఐఐటీలు మరియు ఇతర సంస్థల నుండి సాంకేతిక నిపుణులను ఎలెట్రోలైజర్‌ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే సవాలును చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ఎంఎన్‌ఆర్‌ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే దిశగా భారత్ కృషి చేయాలని తద్వారా మన వినియోగంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయగలుగుతామని ఆయన అన్నారు. హైడ్రోజన్ ఎనర్జీకి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఈ సదస్సులో చర్చించి పరిష్కారాలను కనుగొనగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

image.png

ఈ కార్యక్రమంలో  ఎన్‌టిపిసి సిఎండి శ్రీ గురుదీప్ సింగ్, పోసోకో సిఎండి  శ్రీ కెవిఎస్ బాబా కూడా ప్రారంభ ప్రసంగాలు చేశారు. సిపిఐబి డైరెక్టర్ శ్రీ జి బి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశంలో హైడ్రోజన్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కోణాలపై చర్చించేందుకు కీలకమైన వాటాదారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించబడుతోంది.

సమావేశంలో ఎంఎన్‌ఆర్‌ఈ నుండి నిపుణులు పాల్గొంటారు; డిఎస్‌టి, సిఈఏ, ఎస్‌ఈసిఐ; ఐఓసిఎల్‌; ఎన్‌టిపిసీ; బార్క్, టీసీఈ; రిలయన్స్ ఇండస్ట్రీస్; ఉక్కు పరిశ్రమ; ప్రముఖ విద్యాసంస్థలు, రాష్ట్ర శక్తి సంస్థ; ప్రైవేట్ రంగ సంస్థల నుండి కన్సల్టెంట్లు, నిపుణులు; జపాన్, స్వీడన్ మరియు జర్మనీ నుండి వక్తలు ఇందులో పాల్గొంటారు. హైడ్రోజన్ పాలసీ యొక్క దాదాపు అన్ని అంశాలు, స్వీకరణ కోసం రోడ్ మ్యాప్, సాంకేతికతలు, అప్లికేషన్‌లు, సమస్యలు & సవాళ్లు మరియు పరిశోధన & ఆవిష్కరణలు ఈ సదస్సులో చర్చించబడతాయి.

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్-26 సదస్సులో గౌరవప్రదమైన ప్రధాన మంత్రి ఈ క్రింది ఐదు పాయింట్ల ఎజెండాను సాధించడానికి ఒక అడుగు ముందుకు వేయాలని సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో వాతావరణ మార్పులపై ఈ ప్రపంచ మేధోమథనం 'జాతీయ ప్రకటన' :

 

  • 2030 నాటికి దేశం యొక్క శిలాజ రహిత ఇంధన ఆధారిత శక్తి సామర్థ్యాన్ని 500 జిడబ్లూకి పెంచడం
  • 2030 నాటికి దేశం యొక్క ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి తీర్చడం
  • దేశం ఇప్పుడు మరియు 2030 సంవత్సరం మధ్య మొత్తం అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను ఒక బిలియన్ టన్నులు తగ్గిస్తుంది.
  • ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రత 2030 నాటికి 45% కంటే తక్కువకు తగ్గించబడుతుంది,
  • దేశం 2070 నాటికి కార్బన్ తటస్థంగా మారుతుంది మరియు నికర సున్నా ఉద్గారాలను సాధిస్తుంది.

భారతదేశంలోని 60 సంస్థల నుండి సుమారు 200 మంది పాల్గొంటున్నారు. జర్మనీ నుండి ముగ్గురు అంతర్జాతీయ నిపుణులు; జపాన్, స్వీడన్‌లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. రెండు రోజుల్లో ఐదు టెక్నికల్ సెషన్లలో ఈ సదస్సు చర్చలు జరగనున్నాయి. హైడ్రోజన్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో చోటుచేసుకున్న విస్తృత పరిణామాలను ఈ సదస్సు హైలైట్ చేస్తుంది.

కాన్ఫరెన్స్‌కు సాంకేతిక కమిటీ ఈ రెండు రోజుల చర్చలలో చర్చించబడే విదేశీ రచయితల నుండి 3 పేపర్లతో సహా 29 పేపర్లను ఎంపిక చేసింది. దేశంలో హైడ్రోజన్ ఎనర్జీ అభివృద్ధికి అదనపు వేగాన్ని అందించడానికి ఈ సమావేశం సిఫార్సులతో ముగుస్తుంది.

ఈ కాన్ఫరెన్స్‌ను ఎం/ఎస్ ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్, ఎం/ఎస్ ఎస్‌జెవిఎన్‌ఎల్‌ ప్లాటినం స్పాన్సర్‌గా మరియు ఎం/ఎస్ పవర్ గ్రిడ్ మరియు ఎం/ఎస్ టిహెచ్‌డిసి లిమిటెడ్. సిల్వర్ స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తాయి.


 

***



(Release ID: 1774705) Visitor Counter : 130