సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ వీడ్కోలు సమావేశంలో ఐ అండ్ బీ కార్యదర్శి లేవనెత్తిన ముఖ్యంశాలు
నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2021 6:43PM by PIB Hyderabad
మీడియా, వినోద రంగం సాధారణంగా ఆర్థిక వ్యవస్థ కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఎం&ఈ రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా వెలుగొందుతోంది. అంతే కానీ దేశ ఆర్థిక వ్యవస్థను అనుసరించేది కాదు. ఎం&ఈ రంగం 100 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్గా మారాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. కంటెంట్ చట్టం పరిధిలో ఉన్నంత వరకు, ఏదైనా కంటెంట్కు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది . ఎటువంటి పరిమితులు ఉండవు. మంత్రిత్వ శాఖ ఈ సంబంధిత నిబద్ధతకు అనుగుణంగా మసలుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏవీజీసీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో, పరిశ్రమ భాగస్వామ్యం కోసం మంత్రిత్వ శాఖ ఉంచబడుతుంది, పీపీపీ విధానంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తుంది. థియేటర్లను ఏర్పాటు చేయడానికి చట్టాలు చాలా పాతవి మరియు సినిమాటోగ్రాఫ్ చట్టం సమయంలో రూపొందించబడ్డాయి. ప్రాచీన చట్టాలను పునఃపరిశీలించమని ప్రభుత్వం రాష్ట్రాలను కోరుతూ వస్తోంది. పైరసీ వ్యతిరేక ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, పైరసీ అనేది అన్ని స్థాయిలలో బలమైన చర్య అవసరమయ్యే శాపంగా ఉంది. ముసాయిదా సినిమాటోగ్రాఫ్ చట్టం పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. డిజిటల్ మాధ్యమంలో పైరసీపై వారి ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పుడు సీఐఐతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 1773234)
సందర్శకుల సూచీ సంఖ్య : : 148