ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

107.70 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


98.23 శాతానికి చేరిన రికవరీ రేటు. 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 12,729 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,48,922

వారపు పాజిటివిటీ రేటు (1.25 శాతం) గత 42 రోజులుగా 2 శాతం కంటే తక్కువ

Posted On: 05 NOV 2021 11:00AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 5,65,276 డోసులతో కలిపి, 107.70 కోట్ల డోసులను (1,07,70,46,116) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,08,69,517 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,79,485

రెండో డోసు

92,51,816

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,72,277

రెండో డోసు

1,60,01,188

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

42,28,21,083

రెండో డోసు

14,80,13,602

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

17,59,50,688

రెండో డోసు

9,82,24,169

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

11,03,79,297

రెండో డోసు

6,76,52,511

మొత్తం

1,07,70,46,116

 

గత 24 గంటల్లో 12,165 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,37,24,959 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.23 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 131వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 12,729 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,48,922 వద్ద ఉన్నాయి. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.43) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 6,70,847 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61.30 కోట్లకు పైగా (61,30,17,614) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.25 శాతంగా ఉంది. గత 42 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.90 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 32 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 67 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

 

****



(Release ID: 1769492) Visitor Counter : 159