ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
23 OCT 2021 9:31AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 101.30 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 16,326 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీ రేటు 98.16% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 17,677 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,35,32,126 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.51% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,73,728. ఇది 233 రోజుల కనిష్ట స్థాయి.
వారపు పాజిటివిటీ రేటు (1.24%) గత 29 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.20%) గత 19 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 59.84 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1765931)
Visitor Counter : 164