మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లా చోటిల సమీపంలోని నవ గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ సరస్వతి విద్యామందిర్ భవనాన్ని కేంద్ర కేబినెట్ మంత్రి శ్రీ పరశోత్తం రూపాల జాతికి అంకితం చేయనున్నారు.
పాఠశాల గదులను భాయ్ శ్రీ రమేష్ ఓజా అందజేస్తారు మరియు శ్రీ పరశోత్తం రూపాల ముఖ్య అతిథిగా పాల్గొంటారు
గ్రామీణ పట్టణ విభజన మధ్య అంతరాన్ని తగ్గించడమే ఇటువంటి కార్యక్రమాల లక్ష్యమని మంత్రి గతంలో తెలిపారు
Posted On:
17 OCT 2021 11:49AM by PIB Hyderabad
ఇండియన్ ఫ్యామిలీ అసోసియేషన్ కెనడా మరియు ఉర్మిసరోజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుజరాత్లోని సురేంద్రనగర్ చోటిల సమీప వాడి వశహటత్ నవగ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సరస్వతి విద్యామందిర్ ప్రారంభోత్సవ వేడుక 17/10/21 ఆదివారం ఉదయం 10 నుండి 12:30 వరకూ జరుగుతుంది..
పవిత్ర మాధవ్ ప్రియదాస్జీ స్వామి సమక్షంలో పాఠశాల గదులను భాయ్ శ్రీ రమేష్ ఓజా అందజేస్తారు మరియు కేంద్ర మంత్రి శ్రీ పరశోత్తం రూపాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీ రాంభాయ్ మోక్రియా మరియు సౌరాష్ట్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నితిన్ పెథాని కూడా హాజరవుతారు.
జీవితాన్ని మార్చే అనుభవాల ద్వారా తక్కువ ప్రయోజనాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దాతృత్వానికి దారితీసే మానవ జీవితాన్ని మెరుగుపరచడానికి ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క పరోపకార కోరిక మరియు ప్రయత్నం ఈ కార్యక్రమం.
అత్యంత వెనుకబడిన వాడి కమ్యూనిటీ విద్యార్థులకు పాఠశాలను నిర్మించడం అలాంటి విజయ గాధల్లో ఒకటి. పాఠశాల ప్రారంభోత్సవం వెనుక కథ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇది అణగారిన వర్గాల సంక్షేమం కోసం తన సంపాదనను ధారపోసిన ఓ వ్యక్తి చేసిన స్వచ్ఛమైన దాతృత్వ కార్యక్రమం.
ఉర్మిసరోజ్ చారిటబుల్ ట్రస్ట్ను ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ జగదీష్ త్రివేది 2016 లో స్థాపించారు. "మానవత్వానికి సేవ చేయడం దేవుడికి చేసే సేవ" అని ఆయన విశ్వసించారు. సమాజానికి సేవ చేయడం కోసం శ్రీ త్రివేది తన మిగిలిన జీవితాన్ని అర్పించారు. మరియు పదవీ విరమణ తర్వాత 11 కోట్లు (1.47 మిలియన్ డాలర్లు) విరాళంగా ఇవ్వడానికి బహిరంగ నిబద్ధతను ఇచ్చారు. సోషల్ ఆడిట్ కోసం అందుబాటులో ఉన్న తన ప్రచురణలలో అతను తన ఆదాయాలు మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు చేసిన సహకారం గురించి బహిరంగంగా ప్రకటించారు.
పాఠశాల నిర్మాణం వాస్తవానికి కేంద్ర మంత్రి శ్రీ పరశోత్తం రూపాల చేత ప్రేరేపించబడింది. వాడి సమాజంలో చాలా వెనుకబడిన పిల్లల విద్య కోసం ప్రాథమిక మౌలిక సదుపాయాలను పొందాలనే భరోసాలో స్ఫూర్తిదాయకమైన పాత్రను ఆయన పోషించారు.
కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ పరశోత్తం రూపాలనవ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పరశోత్తం రూపాల..వాడి కులాల పిల్లలకు ప్రాథమిక విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ప్రత్యేకంగా ఆకాంక్షించిన విషయాన్ని ఇక్కడ పేర్కొనవచ్చు. గ్రామీణ-పట్టణ విభజన మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రయత్నం గుజరాత్లో ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన సూచించారు.
ఊర్మిసరోజ్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క శ్రీ జగదీష్ భాయ్ ఆ వెంటనే పాఠశాలకు రెండు గదులను నిర్మించారు.
వాడి వసాహత్ లోని సరస్వతి విద్యామందిర్ "సబ్కా సాథ్, సబ్కా వికాస్ ఔర్ సబ్కా ప్రయాస్" కి నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది.
***
(Release ID: 1764515)