మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పాడి పరిశ్రమలోని మహిళల కోసం దేశవ్యాప్త శిక్షణ&సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ఎన్‌సిడబ్లూ ప్రారంభించింది


పాడి వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మహిళలకు శిక్షణ ఇవ్వడానికి దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో ఎన్‌సిడబ్లూ భాగస్వామ్యం కుదుర్చుకుంది

పాడి వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి శాస్త్రీయ శిక్షణ & ఆచరణాత్మక ఆలోచనల ద్వారా మహిళా రైతులు మరియు ఎస్‌హెచ్‌జిలకు సహాయం చేయడం ఎన్‌సిడబ్లూ లక్ష్యం

మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్ర్యం కీలకం:ఎన్‌సిడబ్లు చైర్‌పర్సన్

Posted On: 27 SEP 2021 2:27PM by PIB Hyderabad

గ్రామీణప్రాంత మహిళలకు సాధికారత కల్పించడానికి మరియు వారిని ఆర్థికంగా స్వతంత్రంగా మార్చే ప్రయత్నంలో జాతీయ మహిళా కమిషన్ పాడి వ్యవసాయంలో మహిళల కోసం శిక్షణ మరియు సామర్థ్యం పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకో భారతదేశం అంతటా వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కమిషన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. పాడి వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలలో విలువ జోడింపు, నాణ్యత మెరుగుదల, ప్యాకేజింగ్ మరియు పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి విభిన్న అంశాలలో మహిళలను గుర్తించి, శిక్షణ ఇస్తుంది.

హర్యానా రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌తో హర్యానాలోని హిస్సార్, లాలా లజపతిరాయ్ యూనివర్శిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్‌లో మహిళా ఎస్‌హెచ్‌జి గ్రూపుల కోసం 'వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్' అనే అంశంపై ఈ ప్రాజెక్ట్ కింద మొదటి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన సందర్భంగా  మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం కీలకమని ఎన్‌సిడబ్లూ చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ అన్నారు. గ్రామీణ భారతదేశంలోని మహిళలు పాడి వ్యవసాయంలో ప్రతి భాగంలో పాలుపంచుకుంటున్నారని, వారు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించలేకపోయారని ఆమె అన్నారు. ఎన్‌సిడబ్లూ తన ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు శక్తినివ్వడం మరియు పాల ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, దాని విలువ జోడింపు, ప్యాకేజింగ్ మరియు షెల్ఫ్ జీవితాన్ని పెంచడం మరియు వారి ఉత్పత్తుల మార్కెటింగ్ పెంచడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి సహాయం చేస్తుందని తెలిపారు.

సుస్థిర ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కృషి చేస్తోంది. కమిషన్ ఎల్లప్పుడూ మహిళల సమానత్వం కోసం కృషి చేస్తోంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో సగం మంది జనాభాను తమ అత్యుత్తమ పనితీరును నిలిపివేయడంతో విజయం సాధించలేమని గట్టిగా విశ్వసిస్తుంది.

పాడి వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి శాస్త్రీయ శిక్షణ మరియు ఆచరణాత్మక ఆలోచనల శ్రేణి ద్వారా మహిళా రైతులు మరియు స్వయం సహాయక బృందాలకు సహాయం చేయడం ఎన్‌సిడబ్లూలక్ష్యం. ఈ  కమిషన్ మహిళలకు వారి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు వ్యవస్థాపకత వైపు ప్రోత్సహించడానికి శిక్షణను అందిస్తుంది. ఎన్‌సిడబ్లూ కూడా మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళలు నడిపే పాల సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు మొదలైన వాటికి శిక్షణ ఇచ్చే శిక్షకులను ఎంపిక చేస్తుంది. ఎన్‌సిడబ్లూ పాడి రంగంలో మరింత స్థిరమైన మరియు పునరావృతమయ్యే జిల్లా స్థాయి నమూనాను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాడి ఉత్పత్తులను రూపొందించడంలో మరియు మార్కెటింగ్ చేయడంలో మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి మహిళలకు శక్తిని అందించడంలో గ్రామాలలో ఉన్న అపారమైన సామర్ధ్యం పెంపొందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.


 

*****



(Release ID: 1758748) Visitor Counter : 155


Read this release in: English , Hindi , Punjabi , Tamil