ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
85 కోట్ల డోసుల మైలురాయిని దాటిన భారతదేశ కొవిడ్-19 టీకా కార్యక్రమం
గత 24 గంటల్లో 68 లక్షలకుపైగా డోసులు నిర్వహణ
97.77 శాతానికి చేరిన రికవరీ రేటు
గత 24 గంటల్లో 28,326 కొత్త కేసులు నమోదు
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,03,476) 0.90 శాతం
వారపు పాజిటివిటీ రేటు (1.98 శాతం) గత 93 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
Posted On:
26 SEP 2021 9:43AM by PIB Hyderabad
దేశంలో కొవిడ్-19 టీకా కార్యక్రమం నిన్నటితో 85 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 68,42,786 డోసులతో కలిపి, మొత్తంగా 85 కోట్ల డోసులను (85,60,81,527) టీకా కార్యక్రమం అధిగమించింది. 83,64,110 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,03,71,245
|
రెండో డోసు
|
88,28,268
|
ఫ్రంట్లైన్ వర్కర్లు
|
మొదటి డోసు
|
1,83,48,990
|
రెండో డోసు
|
1,48,10,221
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
34,66,84,035
|
రెండో డోసు
|
7,34,36,483
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
15,59,65,608
|
రెండో డోసు
|
7,35,71,780
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
9,94,61,207
|
రెండో డోసు
|
5,46,03,690
|
మొత్తం
|
85,60,81,527
|
గత 24 గంటల్లో 26,032 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,29,02,351 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 97.77 శాతానికి చేరింది. 2020 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి.
![](https://ci5.googleusercontent.com/proxy/QV7C3kQBhL5ncqDs2_2XN3OQM-Ws4otJ4ju8bebw5V_vWKCp0wY5iAWnuIS2KYPP-CoTE0WGteBK4nWr-Yk5F27UUgU1A5RFoM_sV-MwP7ds20mruhuOeigMow=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WQIT.jpg)
కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 91వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 28,326 కొత్త కేసులు నమోదయ్యాయి.
![](https://ci4.googleusercontent.com/proxy/Rl5qBaLo5Bnbeeyrs2PbDtTZIpqxS6CtJPD2YBH0PYLjpbdeQDvtuRufJR807t2UnH6uUMTfKt0_G5UqQOg3VKblvKEXOMlgXFHqX5p_x7WLSW4u5Op6LQXe_A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Y04E.jpg)
ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,03,476. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.90 శాతం. 2020 మార్చి తర్వాత దేశంలోని క్రియాశీల కేసుల్లో ఇదే కనిష్ట స్థాయి.
![](https://ci3.googleusercontent.com/proxy/Kia2WOHFSB-R5nkwtAkWSiZh_9FBYV7exe-TSA18cL1EUdECJbFmMJuUOwn3j-sBylCMO0venD5r1iqWHhpLvYu2QFbL9rQwh3iss08IpqwRJsF_L3c7uL6J3Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00457MT.jpg)
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,88,945 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56.32 కోట్లకుపైగా (56,32,43,245) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉంది. గత 93 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.90 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 27 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 100 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.
![](https://ci6.googleusercontent.com/proxy/73UVz16BA_5lzbPbW-l89t5A53k_AW3AqVtaT4EifvIaEaMD7nPETksncrz2ei6xPagFydSCYIPznuxBuR71O-d7RV0AnmHtvfaDgDoYevv40fvI7Bboa6xDsA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005971E.jpg)
****
(Release ID: 1758276)
Visitor Counter : 170