విద్యుత్తు మంత్రిత్వ శాఖ

నాలుగు సంవత్సరాల అమలును విజయవంతంగా పూర్తి చేసుకున్న సౌభాగ్య


సౌభాగ్య ప్రారంభమైనప్పటి నుండి 2.82 కోట్ల కుటుంబాలు విద్యుదీకరించబడ్డాయి

మిగిలిన విద్యుత్ లేని గృహాలను గుర్తించడానికి మరియు విద్యుత్ కనెక్షన్‌లను అందించడానికి ప్రత్యేక టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ ఉంది

Posted On: 25 SEP 2021 9:41AM by PIB Hyderabad

సౌభాగ్య ప్రారంభమైనప్పటి నుండి ఈ ఏడాది మార్చి 31 నాటికి 2.82 కోట్ల కుటుంబాలు విద్యుదీకరించబడ్డాయి.  2019 మార్చి నాటికి దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 2.63 కోట్ల విద్యుత్తు సౌకర్యం లేని గృహాలకు 18 నెలల రికార్డు సమయంలో విద్యుత్ కనెక్షన్లు అందించారు. తదనంతరం ఏడు రాష్ట్రాలు- అస్సాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ 31.03.2019 కంటే ముందుగానే గుర్తించబడిన 18.85 లక్షల విద్యుత్ లేని గృహాలు విద్యుత్ కనెక్షన్‌లు పొందడానికి సుముఖత వ్యక్తం చేశాయి. పథకం వాటికి కూడా వర్తిస్తుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద గృహ విద్యుదీకరణ డ్రైవ్‌లలో సౌభాగ్య ఒకటి. సౌభాగ్యను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 సెప్టెంబర్ 2017 న ప్రకటించారు. దేశంలో యూనివర్సల్ హౌస్‌హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్‌ను సాధించడం, చివరి మైలు కనెక్టివిటీ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్తు లేని అన్ని గృహాలకు మరియు పట్టణ ప్రాంతాల్లో పేద గృహాలలో  విద్యుత్ సౌకర్యాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకాన్ని ప్రారంభించే సమయంలో అందరికీ విద్యుత్ అందిస్తామని మరియు కొత్తతరం భారతదేశంలో ఈక్విటీ, సమర్థత మరియు నిలకడ కోసం పని చేస్తానని ప్రధానమంత్రి ప్రతిజ్ఞ చేశారు.

ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఆర్థిక వ్యయం రూ. 16,320 కోట్లు కాగా స్థూల బడ్జెట్ మద్దతు (జిబిఎస్) రూ. 12,320 కోట్లు. గ్రామీణ కుటుంబాలకు రూ. 14,025 కోట్లు కాగా, జిబిఎస్ రూ. 10,587.50 కోట్లు. పట్టణ గృహాలకు వ్యయం రూ. 2,295 కోట్లు కాగా, జిబిఎస్ రూ. 1,732.50 కోట్లు. భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పథకం కోసం అధికంగా నిధులను అందించింది.

దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డిడియుజిజెవై) ఈ పథకం ప్రయాణం ప్రారంభమైంది. ఇది గ్రామాల్లో ప్రాథమిక విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నాణ్యత మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు పెంచడం, ఇప్పటికే ఉన్న ఫీడర్లు/పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌ల మీటరింగ్‌పై ఈ పథకం దృష్టి సారించింది.

ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన - సౌభాగ్య దేశంలో సార్వత్రిక గృహ విద్యుదీకరణ సాధించడానికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మిగిలిన అన్ని విద్యుత్తు లేని గృహాలకు చివరి మైలు కనెక్టివిటీ మరియు విద్యుత్ కనెక్షన్‌ల ద్వారా అందరికీ విద్యుత్‌ను అందించాలని భావించింది. ఈ పథకం ద్వారా సమీపంలోని పోల్ నుండి ఇంటి ఆవరణకు ఒక సర్వీస్ కేబుల్ వేయడం, ఒక విద్యుత్‌ మీటర్ ఏర్పాటు చేయడం, ఎల్‌ఈడీ  బల్బుతో ఒక లైట్ పాయింట్ కోసం వైరింగ్ మరియు ఒక మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ద్వారా విద్యుత్ కనెక్షన్లను అందిస్తారు.

ముందున్న లక్ష్యం

పథకం నిర్ధిష్ట లక్ష్యాలు సాధించబడినప్పటికీ, సౌభాగ్య బృందం అందరికీ 24x7 నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే పనిని కొనసాగించింది. విద్యుత్తు లేని గృహాలను గుర్తించడానికి మరియు వారికి విద్యుత్ కనెక్షన్లను అందించడానికి అన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాలలో ప్రత్యేక ప్రచారాలను ప్రారంభించాలని అభ్యర్థించబడ్డాయి. ఆ ప్రయోజనం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించబడింది.


 

***



(Release ID: 1758018) Visitor Counter : 236