ఉక్కు మంత్రిత్వ శాఖ

స్టీల్ ప్లాంట్ల ఆధునికీకరణ

Posted On: 11 AUG 2021 3:30PM by PIB Hyderabad

స్టీల్ అనేది అనియంత్రితరంగం మరియు మంత్రిత్వశాఖది కేవలం అనుసంధానకర్త పాత్ర మాత్రమే. స్టీల్ పాంట్ ఆధునీకీకరణకు సంబంధించిన నిర్ణక్ష్మీం టెక్నోకమర్షియల్ అంశాల ఆధారంగా కంపెనీ వ్యక్తిగతంగా తీసుకుంటుంది.


రెండు ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీలు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)లు గత దశాబ్ద కాలంలో తమ ఉక్కు కర్మాగారాలను క్రమంగా ఆధునీకరించాయి. వీటిలో భిలాయ్ (ఛత్తీస్‌గఢ్), బొకారో (జార్ఖండ్), రూర్కెలా (ఒడిశా), దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్), బర్న్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మరియు విశాఖపట్నం (ఆంధ్ర ప్రదేశ్) లోని సెయిల్ స్టీల్ ప్లాంట్‌లు ఉన్నాయి.

భారత ప్రభుత్వం ఉక్కు కర్మాగారాల ఆధునీకీకరణ కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. ఉక్కు కర్మాగారాల ఆధునీకికరణకు సంబంధిత ఉక్కు రంగ సంస్థ దాని అంతర్గత వనరులు / రుణాలు నుండి నిధులు సమకూరుస్తుంది.

ఈ సమాచారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చారు.

***

 



(Release ID: 1744986) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Tamil