ఆయుష్

కోవిడ్-19 చికిత్స కోసం ఆయుష్ ఔషధ వ్యవస్థపై పరిశోధన

Posted On: 03 AUG 2021 5:06PM by PIB Hyderabad

కోవిడ్-19 లక్షణాల తో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం సమర్థవంతమైన ఔషధాలను గుర్తించడానికి వివిధ పరిశోధనా సంస్థలు మరియు జాతీయ పరిశోధనా సంస్థల కింద దేశంలోని 152 కేంద్రాల్లో, 126 అధ్యయనాలు కొనసాగుతున్నాయి.   ఇందులో 42 రోగనిరోధక అధ్యయనాలు;  40 ఇంటర్వెన్షనల్ అధ్యయనాలు; 11 పరిశీలనాత్మక అధ్యయనాలు; 22 ప్రీ-క్లినికల్ / ప్రయోగాత్మక అధ్యయనాలు; 01 క్రమబద్ధమైన సమీక్ష; 08 సర్వే అధ్యయనాలు; 02 పత్రాల తయారీ ఉన్నాయి.  వివిధ వైద్య విధానాలవారీ పరిశోధన అధ్యయనాలలో ఆయుర్వేదం నుండి 66, హోమియోపతి నుండి 26, సిద్ధ నుండి 13, యునాని నుండి 08 యోగా, ప్రకృతి చికిత్స నుండి 13 ఉన్నాయి.  మొత్తం 90 అధ్యయనాలు పూర్తి కాగా, 10 వ్రాత ప్రతులు ప్రచురితమయ్యాయి. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్); జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం (డి.బి.టి), శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్);  అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏ.ఐ.ఐ.ఎం.ఎస్); ఆయుష్ సంస్థల నుండి ప్రాతినిధ్యం కలిగి ఉన్న ఇంటర్-డిసిప్లినరీ ఆయుష్ ఆర్ & డి. టాస్క్ ఫోర్స్‌ను, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.  నాలుగు విభిన్న జోక్యాలను, అనగా, అశ్వగంధ, యష్టిమధు, గుడుచి + పిప్పలి మరియు పాలీ హెర్బల్ ఫార్ములేషన్ (ఆయుష్ -64) లను అధ్యయనం చేయడానికి కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో రోగనిరోధక అధ్యయనాలు మరియు యాడ్-ఆన్ జోక్యాల కోసం, ఇంటర్-డిసిప్లినరీ ఆయుష్ ఆర్. & డి. టాస్క్ ఫోర్స్,  చికిత్సా పరిశోధనా నియమ నిబంధనలను రూపొందించింది మరియు రూపకల్పన చేసింది.

కేంద్ర ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సి.సి.ఆర్.ఏ.ఎస్.) అభివృద్ధి చేసిన పాలీ హెర్బల్ ఫార్ములేషన్, ఆయుష్-64, శాస్త్రీయంగా లక్షణం లేని మరియు తేలికపాటి కేసులను స్వతంత్రంగా మరియు తేలికపాటి మరియు మితమైన కోవిడ్-19 వ్యాధి  నిర్వహణకు శాస్త్రీయంగా ఉపయోగపడుతోంది. ఇందుకోసం, సి.ఎస్.ఐ.ఆర్. సహకారంతో సి.సి.ఆర్.ఏ.ఎస్. మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖలోని జాతీయ స్థాయి సంస్థల సహకారంతో, అంటువ్యాధి ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా దేశంలో బలమైన రోగ నిర్ధారణ పరీక్షలను, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.   వివిధ నిపుణుల కమిటీ ల నుండి ఏకాభిప్రాయంతో నేషనల్ టాస్క్ ఫోర్స్ తయారు చేసిన “కోవిడ్ -19 నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు యోగా ఆధారంగా నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌" లో కూడా, ఆయుష్-64 ని సిఫార్సు చేయడం జరిగింది. 

వీటితో పాటు, సార్స్-కోవ్-2 సంక్రమణ మరియు కోవిడ్-19 వ్యాధి కోసం సవరించిన అదనపు కుడ్య పరిశోధన పథకం కింద పరిశోధన ప్రతిపాదనలను, ఆయుష్ మంత్రిత్వ శాఖ,  2020 ఏప్రిల్, 21వ తేదీ నుండి 2020 మే, 10వ తేదీ వరకు ఆహ్వానించింది.  ఆయుర్వేద ఔషధ వ్యవస్థ పై అటువంటి  21 పరిశోధన ప్రాజెక్టులకు ఈ పథకం కింద నిధులు సమకూర్చడం జరిగింది.  అందులో 8 ప్రైవేటు సంస్థలకు, 13 ప్రభుత్వ సంస్థల కు చెందినవి ఉన్నాయి. 

కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానం లో ఈ సమాచారాన్ని - పొందుపరిచారు. 

*****


(Release ID: 1742098)
Read this release in: English , Urdu , Punjabi , Tamil