ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆర్థిక పరిస్థితిలో పురోగతి

Posted On: 28 JUL 2021 1:22PM by PIB Hyderabad

జాతీయ గణాంకాల కార్యాలయం వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల వద్ద (ప్రామాణిక సంవత్సరం 2011-12) తలసరి "నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి" (ఎన్‌ఎస్‌డీపీ) గత ఐదేళ్లలో పెరిగింది. 2015-16 నుంచి 2019-20 వరకు, రాష్ట్రాల వారీగా ప్రస్తుత ధరల వద్ద ఎన్‌ఎస్‌డీపీ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:

పట్టిక: ప్రస్తుత ధరల వద్ద తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (ఎన్‌ఎస్‌డీపీ) (ప్రామాణిక సంవత్సరం 2011-12) (రూపాయల్లో)

రాష్ట్రం

2015-16

2016-17

2017-18

2018-19

2019-20

అరుణాచల్‌ప్రదేశ్‌

116985

123744

139029

149634

164615

అసోం

60817

66330

75151

82837

90758

మణిపూర్‌

55447

59345

71507

75229

84746

మేఘాలయ

68836

73753

77504

84725

92175

మిజోరం

114055

127107

155222

176620

204018

నాగాలాండ్‌

82466

91347

102003

117691

130230

సిక్కిం

245987

280729

349163

380926

425656

త్రిపుర

84267

91596

100444

112849

125191

సమాచారం: జాతీయ గణాంకాల కార్యాలయం, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతంలో రైలు, రహదారి, వాయు మార్గాల అనుసంధానం, టెలీకమ్యూనికేషన్, విద్యుత్, అంతర్గత జలమార్గాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రాజెక్టులను అమలు చేసింది. నీటి సరఫరా, విద్యుత్, అనుసంధానం, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అంశాల్లో ప్రాథమిక, ద్వితీయ రంగాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించే పర్యాటక, సామాజిక రంగాలకు సంబంధించి, భౌతిక మౌలిక సదుపాయాల్లో చాలా ప్రాజెక్టులను ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా అమలు చేసింది.

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

 

*****



(Release ID: 1739942) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Bengali , Tamil