సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్‌ఎంఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించాల్సిన అవసరాన్ని బ్రిక్స్‌ ఎంఎస్‌ఎంఈ రౌండ్‌టేబుల్ సమావేశం నొక్కి చెప్పింది.

Posted On: 23 JUL 2021 5:43PM by PIB Hyderabad

కోవిడ్-19 అనంతరం ఎంఎస్‌ఎంఈ  వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు ఎంఎస్‌ఎంఈల ప్రయోజనం కోసం వ్యాపార వాతావరణాన్ని సృష్టించే మార్గదర్శినిపై భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపై ఎంఎస్‌ఎంఈ కార్యదర్శి శ్రీ బి.బి. స్వైన్ నొక్కిచెప్పారు. బ్రిక్స్ సమాజాన్ని దృష్టిని ఉద్దేశించి కొవిడ్ అనంతరం ‘వృద్ధి వేగవంతం చేసే రంగం’ రోడ్‌మ్యాప్‌పై మాట్లాడారు.  ఎంఎస్‌ఎంఈలను మహమ్మారి ఎంతవరకు దెబ్బతీసిందో తెలుసుకోవడంతో పాటు వాటిని రక్షించడానికి అవసరమైన ప్రభుత్వ  విధానాలు / ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ బ్రిక్స్‌ ఎంఎస్‌ఎంఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది. ఇది కొవిడ్ అనంతరం బ్రిక్స్‌ సమాజానికి ‘వృద్ధి వేగవంతం చేసే రంగం’కోసం రోడ్‌మ్యాప్ రూపకల్పనపై దృష్టి పెట్టింది. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని బ్రిక్స్ దేశాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు పాల్గొన్నాయి. వాటితో రెండువందలకు పైగా పారిశ్రామిక సంఘాలు, ఎంఎస్ఎంఈ టూల్ రూములు హాజరయ్యారు.

ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్-ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం గ్లోబల్ మరియు ప్రాంతీయ విలువ గొలుసులలో ఎంఎస్‌ఎంఈల ఇంటిగ్రేషన్ గురించి ప్రస్తావించబడ్డాయి;  కోవిడ్ -19 అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈలకు డిజిటలైజేషన్ పాత్రపై చర్చించారు. అలాగే డిజిటల్ పరివర్తన కోసం చర్యలు; ఎంఎస్‌ఎంఈల  వేగవంతమైన అభివృద్ధి కోసం బ్రిక్స్ ఫోరమ్ను పెంచడంపై చర్చ జరిగింది.

అనంతరం బ్రిక్స్ నేషన్స్ యొక్క ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగం నుండి వేర్వేరు సదస్సులు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన సంబంధిత సీనియర్ అధికారులు వాటిని నిర్వహించారు.

బ్రిక్స్ భాగస్వాములు భారతదేశం ప్రణాళిక చేసిన కార్యకలాపాలను ప్రశంసించారు. ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా భారతదేశం ప్రతిపాదించిన వివిధ కార్యక్రమాలపై కలిసి పనిచేయడానికి తమ మద్దతును వ్యక్తం చేశారు.


 

****



(Release ID: 1738393) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Hindi , Punjabi